ఆజంనగర్ నిమ్మగూడెం రహదారికి చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి

నిమ్మగూడెం, ఆజంనగర్ నుండి ప్రేమనగర్ వరకు రహదారి నిర్మాణ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. బుధవారం భూపాలపల్లి మండల పరిధిలోని నిమ్మగూడెం, ఆజంనగర్ నుండి ప్రేమ్ నగర్ వరకు నిర్మించనున్న రహదారిని ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజంనగర్ నుండి ప్రేమ్ నగర్ వరకు రహదారి నిర్మాణానికి కావలసిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయుటకు వివరాలు అందజేయాలని తెలిపారు. దాదాపు 3.5 కిలోమీటర్లు వరకు రహదారికి ఇరువైపుల భూమి అవసరం ఉందని అన్నారు. రెండు వైపుల భూ సేకరణ చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు అవసరమైన భూ ప్రతి పాదనలతో పాటు రైతుల వివరాలు అందచేయాలని తెలిపారు. ఆర్ అండ్ బి, రెవెన్యూ, కాంట్రాక్టర్ సంయుక్తంగా సర్వే నిర్వహించి నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ప్రజా అవసరాల దృష్ట్యా రహదారి నిర్మాణానికి అవసరమైన భూమికి ఆయా రైతులకు పరిహారం చెల్లించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రహదారి నిర్మాణంలో అవసరమైన చోట వంతెనలు నిర్మించాలని అన్నారు. మిరాజ్ పేట నుండి ప్రేమ్ నగర్ వరకు రహదారి నిర్మాణానికి హద్దులు నిర్ణయించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version