శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ కు మలుపు
మరిపెడ నేటిధాత్రి.
నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో విజయ దుందుభి మోగించిన పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ సంఘానికి మలుపు లాంటిదని అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి,లింగాల మహేష్ గౌడ్ లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత నెల రోజులుగా శ్రీపాల్ రెడ్డి విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పిఆర్టీయూ సంఘ రాష్ట్ర,జిల్లా,మండల బాధ్యులకు,మండల కార్యవర్గ సభ్యులకు, సంఘానికి పట్టుకొమ్మలైన ప్రాథమిక సభ్యులందరికీ మరియు ఈ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లందరికి కూడా పేరుపేరున పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ పక్షాన హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నమని అన్నారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న అపరిష్కృత సమస్యలు పరిష్కరించే విధంగా పిఆర్టీయూ సంఘం చొరవ తీసుకుంటుందని అన్నారు.