గణనాథునికి ముస్లిం సోదరులచే ప్రత్యేక పూజలు.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోనీ తోటపల్లి గ్రామంలో గణనాధుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.రుద్ర సేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని బుధవారం రాత్రి ముస్లిం సోదరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మతసామ్రాస్యానికి ప్రతీకగా నిలువడం పట్ల పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఎండీ అష్, నాజిరదిన్, ఖాజా, అజ్జిబాబా, దుర్ధ్ణ బేగం, అష్పిన్, నవాజ్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.