సిఐటియు జిల్లా సెక్రెటరీ ఆకుదారి రమేష్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా జాయింట్ సెక్రెటరీ ఆకుదారి రమేష్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23 బ్లాక్ డేగా నిర్వహించడం జరిగింది
కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి నేషనల్ మానిటైజేషన్ పైపులైను రద్దు చేయాలి. బొగ్గు బ్రాకులను వేలం వేయడాన్ని నిలుపుదల చేయాలి, సింగరేణి కి నేరుగా గనులను కేటాయించాలి. కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలుగా నిర్ణయించాలి.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అంగన్వాడి,ఆశ, మధ్యాహ్న భోజనం, ఐకెపి,వివో ఏ, వైద్య ఆరోగ్య రంగంతో పాటు వివిధ స్కీములలో పనిచేస్తున్న స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి చట్టాలు అమలు చేయాలి.
ఈపీఎఫ్ చెల్లింపులో జాప్యం చేసిన వారికి జరిమానాలను తగ్గించడానికి ఉపసంహరించుకోవాలి.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాలి. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఈపీఎస్ పెన్షన్ దారులకు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలకు తగ్గకుండా చెల్లించాలి.
కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించండి.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెలిశెట్టి రాజయ్య, గడప శేఖర్,
కార్మికులు శంకర్, అబ్బాస్, నవీన్ జ్ఞానేశ్వరి గోమాత, రజిత తదితరులు పాల్గొన్నారు..