పరకాల నేటిధాత్రి
మల్లక్కపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దొమ్మటి దాసు,రాజు తండ్రి దొమ్మటి సమ్మయ్య అనారోగ్యంతో ఇటీవల మరణించడం జరిగింది.పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.అనంతరం కుటుంబ సభ్యులను మనోధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,మల్లక్కపేట గ్రామ కమిటీ అధ్యక్షులు మనూరి రాజు,మాజీ సర్పంచ్ అల్లం రఘు నారాయణ,మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజి రెడ్డి,రాయపర్తి మాజీ ఎంపీటీసీ పర్నెం మల్లారెడ్డి,ఏఎంసీ డైరెక్టర్ దాసరి బిక్షపతి,గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు దోమ్మటి చార్లెస్,బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని,మాజీ కౌన్సిలర్ లక్కము శంకర్,యూత్ కాంగ్రెస్ నాయకులు మచ్చ సుమన్,దోమ్మటి కృష్ణకాంత్., ఉడుత సంపత్,మహమ్మద్ అలీ,గంగోజుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
