ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్తో సర్పంచ్ మర్యాదపూర్వక భేటీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన బడం పేట సర్పంచ్ దయానంద్ పాటిల్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ను మర్యాదపూర్వకంగా కలిసి శనివారం సన్మానించారు. ఎంపీ సర్పంచు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంలో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
