వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుధ్య పనులు.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించడం ఘనంగా జరుగుతుంది,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహిస్తుంది దానిలో భాగంగానే పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పతకాలు , మహిళల సాధికారిక అనేక అంశాలపై ప్రసంగిస్తారు, ఆమెతోపాటు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు , రాష్ట్ర నాయకులు మరియు జిల్లా అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో మండలంలోని వీధులు మెయిన్ రోడ్లు వెంబడి చెత్తాచెదారం లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ గ్రామ పంచాయతీ సిబ్బందితో రెండు రోజుల నుంచి పనులు మమ్మురంగా జరుగుతున్నాయి దీనికి మండలంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మినిస్టర్ ప్రోగ్రాం ఉండడం వల్ల మండల కేంద్రం క్లీన్ అండ్ గ్రీన్ గా పిచ్చి మొక్క లేకుండా రోడ్లన్నీ శుభ్రంగా తయారవుతున్నాయని , ఏది ఏమైనా శుక్రవారం రోజు జరిగే మహిళా శక్తి సంబరాలకు మినిస్టర్ తో పాటు జిల్లా అధికారులు రావడం వల్లనే మా గ్రామంలోని వీధులు రోడ్లు శుభ్రంగా ఉన్నాయని, గ్రామపంచాయతీ సిబ్బంది వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ్య పనులను నిర్వహించడం పట్ల మండల ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు,