పోతుగల్లు శివార్లో ఇష్టారాజంగా ఇసుక దందా… పర్మిషన్ లేని ఇసుక క్వారీ….

పోతుగల్లు శివార్లో ఇష్టారాజంగా ఇసుక దందా… పర్మిషన్ లేని ఇసుక క్వారీ….
అడుగంటిపోయిన భూగర్భ జలాలు…..

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి…. మారపల్లి మల్లేష్
మొగులపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్లపల్లి మండలం లోని పోతుగల్ గ్రామ శివారులో చలివాగులో ఎలాంటి ఇసుక క్వారీ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు చలివాగులో సుక్క నీరు లేకుండా ఎండిపోయినది చలివాగు ప్రవహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల పొలాల్లో నీరు అందక ఉన్న బోర్లు ఎత్తిపోయే ప్రమాదం ఉన్నది పొలాలు ఇప్పటికే కొన్ని ఎండిపోతా ఉన్నాయి పొట్టకచ్చిన పొలాలకు ఈ సమయంలో నిరంతకపోతే రైతులు ఆరుకాలం పెట్టినటువంటి పెట్టుబడి రాక చేతికి వచ్చిన పొలం ఎండిపోతుంటే రైతులు లబోదిబో అనే పరిస్థితి దాపురించింది కానీ ఇసుక మాత్రం ఇష్టానుసారంగా తరలించడం వల్లనే భూగర్భ జలాలు అడగండి పోయి ఉన్న బోర్లు ఎత్తిపోతవున్నాయి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇసుక దందాను అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం .

ఎండిపోతున్న పొలాలకు నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రైతులను ఆదుకోవాలని అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక బకాసురుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు… ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మండల కార్యదర్శి అంబాల అశ్వద్ధామ అజయ్ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version