ఎండాకాలంలో సేఫ్టీ తప్పనిసరి- పరకాల అగ్నిమాపక అధికారి భద్రయ్య
పరకాల,నేటిధాత్రి
ప్రస్తుతం నెలకొంటున్న అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల ఫైర్ ఆఫీసర్ భద్రయ్య సూచించారు.ఎండాకాలంలో చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించడం అత్యవసరమని తెలిపారు.ఎండల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు పెరుగుతున్నందున,పొలాల్లో లేదా నివాస ప్రాంతాల్లో మంటలు వేయడాన్ని నివారించాలని హెచ్చరించారు.అలాగే విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని గ్యాస్ సిలిండర్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.చిన్న తప్పిదాలు కూడా అగ్ని ప్రమాదాలకు కారణమవుతాయని అన్నారు.ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన పక్షంలో వెంటనే అత్యవసర సేవల నెంబర్ 8712699306 కు సమాచారం అందించాలని కోరారు.పరకాల పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు ఈ సూచనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అగ్నిమాపక అధికారి భద్రయ్య తెలిపారు.
