ఆలయంలో దోపిడీ, హత్య..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T113528.288.wav?_=1

ఆలయంలో దోపిడీ, హత్య..

 

విరుదునగర్‌ జిల్లా రాజపాళయంలోని నచ్చాడై తవిర్తరుళియ స్వామివారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు వాచ్‌మన్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆ ఆలయంలో పేచ్చిముత్తు (50), శంకరపాండియన్‌ (65) అనే ఇద్దరు వాచ్‌మన్లుగా పనిచేస్తున్నారు.

చెన్నై: విరుదునగర్‌(Virudunagar) జిల్లా రాజపాళయంలోని నచ్చాడై తవిర్తరుళియ స్వామివారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు వాచ్‌మన్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆ ఆలయంలో పేచ్చిముత్తు (50), శంకరపాండియన్‌ (65) అనే ఇద్దరు వాచ్‌మన్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం అర్చకులు వచ్చి ఆలయాన్ని తెరవగా ఆ ఇరువురూ రక్తపుమడుగులో శవాలుగా పడివున్నారు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మూడువైపులా ఎత్తయిన ప్రహరీ ఉన్న ఆ ఆలయం చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. ఆ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పోలీసులు పరిశీలించగా, సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు రెండు కార్లలో పదిమంది దుండుగులు ఆలయానికి వచ్చి, సీసీ కెమెరా(CCTV camera)లను ఒక్కొక్కటిగా పగులగొట్టి, వెనుకవైపున్న స్తంభా ల ఆధారంగా ఆలయ ప్రాంగణంలోకి దూకారు. ఆలయం లోపల ఉన్న వాచ్‌మన్లు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version