`తెలంగాణ సొమ్ముతో ఆంద్రాలో రిజర్వాయర్లు?

`తెలుగు దేశం పార్టీ వచ్చాక మరింత దోపిడీ.

`మద్రాసుకు నీళ్లిచ్చారు.

`తెలంగాణను ఎండబెట్టారు.

`పోతిరెడ్డిపాడు పొక్క పెట్డి, తెలుగు గంగ పారించారు.

`రాయలసీమలో అడుగడుగునా ఎత్తిపోతల రిజర్వాయర్లు కట్డుకున్నారు.

`పెద్ద ఎత్తున ఎత్తిపోతల పథకాలు?

`తెలంగాణ ప్రాజెక్టులకు ఆనాడు చేతులు రాలేదు.

`ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చేసిన అన్యాయానికి సాక్ష్యాలు.

`తెలంగాణలో ఎత్తిపోతలు ఖర్చన్నారు.

`అంత ఖర్చు సాద్యం కాదన్నారు.

`ఆంద్రాలో పదుల సంఖ్యలో రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు.

`ఆనాడు నోరు మెదపని తెలంగాణ నాయకులు.

`తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం మీద విషం చిమ్ముతున్నారు.

`నీళ్లన్నీ కిందకు వదిలేసి ఆంద్రాకు న్యాయం చేస్తున్నారు.

`తెలంగాణ ఎండబెట్టి ఆంద్రాకు నీళ్లు వదిలేస్తున్నారు.

`కేసిఆర్‌ హయాంలో రాజమండ్రికి నీటి కరువొచ్చింది.

`కాంగ్రెస్‌ హయాంలో ఇప్పుడు ధవళేశ్వరం కళకళలాడుతోంది.

`తెలంగాణకు ఉమ్మడి పాలకులు ఎప్పటికీ శత్రువులే!

`ఉమ్మడి పాలకులకు తెలంగాణ బాగుపడడం ఇష్టం లేదు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి ఆంద్రా పాలకులు తెలంగాణ నీళ్లను తరలించుకుపోయారు. నిధులు ఆంద్రాకు మళ్లించుకున్నారు. నియామకాలన్నీ కట్టబెట్టుకున్నారు. తెలంగాణకు తీరని అన్యాయంచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు ఇంకా ఎలా అన్యాయం చేయాలన్న ఆలోచనలే చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని బనకచర్లను తెరమీదకు తీసుకొచ్చారు. వెంటనే దాని పనులు మొదలుపెట్టారు. సముద్రంలో కలిసే నీటిని వృధాగా పోకుండా, వరద జలాల మీద ఆధారపడి బనకచరర్ల నిర్మాణం చేపడతామని ఏపి ప్రభుత్వం అంటోంది. నిజానికి వరద పోటేత్తే సమయంలో వాడుకునే పరిస్థితి వుంటుందనేది శుద్ద అబద్దం. ఎప్పుడైతే ప్రవాహ ఉదృత్తి మోతాదులో వున్నప్పుడే నీటిని వాడుకుంటారు. కాని మాటలకు మాత్రం వరద జాలలను మాత్రమే వినియోగించుకుంటామని చెప్పడం ఏపి పాలకులకు అలవాటైంది. ఉమ్మడి రాష్ట్ర్రంలో కూడా అదే చెప్పేవారు. పోతిరెద్డి పాడు విషయంలోనూ అదే చేశారు. దాంతో ఏపిలో నిర్మాణం చేసిన అనేక ఎత్తిపోతల ప్రాజెక్టుల రిజర్వాయర్లకు అదే సమాదానం చూపించారు. కాని నికర జలాలు మాత్రమే ఎత్తుకుపోతున్నారు. అది గత అరవై సంవత్సరాలుగా సాగుతూనే వుంది. ఇంకా సాగిస్తూనే వున్నారు. ఏ నదికైనా కింది రాస్ట్రానికి ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం వుంటుందన్న సాకుతో పరిమితికి మించి నీటిని వాడుకోవడానికే ఏపి ఆనాటి నుంచి అలవాటు చేసుకున్నది. రాష్ట్రం విడి పోయిన తర్వాత ఆ వాదన మరింత ఎక్కువగా చేస్తోంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, బిజేపి నాయకులు ఏపి ప్రభుత్వం బనకచర్లకు నీళ్లు తరలించుకుపోతున్నా స్పందించడం లేదని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. పోలవరం నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసుకునేందుకు రాయలసీమను సస్యశ్యామలం చేయాలని తెలంగాణపై కుట్రలు చేస్తున్నారు. ఓ వైపు శ్రీశైలం నుంచి ఇప్పటికే రాయలసీమకు పోతిరెడ్డిపాడు మొదలుపెట్టి, చెన్నైకి తెలుగు గంగ కాలువ ద్వారా మంచినీటిని అందిస్తున్నారు. కాని తెలంగాణకు మంచినీటిని అందించేందుకు కూడా ఏనాడు ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలైనా సరే గోదావరి నీటిని బనకచర్లకు వందల టిఎంసిల నీటిని తరలించుపోయే కుట్ర చేస్తున్నారు. కేంద్రం ఆశీస్సులతో మళ్లీ తెలంగాణకు తీరని అన్యాయంచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్‌ ఫ్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులకు నోరు రావడం లేదానే అని ఆరోపణలు వి నిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి 8 లోక్‌సభ సీట్లు గెలిచిన బిజేపి బనకచర్ల మీద సమర్ధవంతంగా మాట్లాడితే ఆపార్టీకే ఎంతో మేలు జరుగుతుంది. తెలంగాణలో బిజేపికి మరింత మద్దతు దొరికే అవకాశముంది. పైగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బనకచర్లకు కేంద్రం ఎలాంటి అనుమతులివ్వలేదంటున్నారు.. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొని, కేంద్ర ప్రభుత్వ సంస్ధ వ్యాప్కో సూచనలతో కట్టిన కాళేశ్వరాన్ని తప్పు పడుతున్నారు. కేంద్రం ఆశీస్సులతో తెలంగాణ అన్యాయం చేసే బనకచర్లపై మాత్రం మాట్లాడేందుకు రెండు జాతీయ పార్టీల నాయకులు పూర్తి స్ధాయిలో ఎందుకు స్పఏదించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బనకచర్ల లాంటి అతి పెద్ద ప్రాజెక్టు కేంద్రం అనుమతులు లేకుండా నిర్మాణం సాద్యమౌతుందా? ఇంత హడావుడిగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన సమయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు. తెలంగాణను ఎండబెట్టే కుట్ర తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, బిజేపి నాయకులు ప్రశ్నించపోవడాన్ని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోంది. ఇది మన కళ్లముందు కనిపిస్తున్నదే అయినా పెద్దగా స్పందన రావడం లేదు. గెలిపించిన తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టే ప్రమాదాన్ని అడ్డుకోవాల్సిన అవసరం వుంది. పదేళ్లపాటు పచ్చగా, కాళేశ్వరం ద్వారాకోటి ఎకరాల మాగాణగా మారిన తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందనేది జల ఇంజనీర్ల అభిబ్రీపాయం. దశాబ్దాల పాటు కరువుతో అల్లాడిన తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడానికి ఉమ్మడి పాలకులు ఇష్టపలేదు. ఏపి పాలకులు, పార్టీలు తెలంగాణకు మరోసారి తీరని అన్యాయంచేస్తున్నాయి. తెలంగాణను అరవైఏళ్లు పీల్చి పిప్పి చేశారు. గతంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్మాణంచేయలేదు. ఎన్నికల ముందు పునాది రాళ్లు వేయడం, తర్వాత మర్చిపోవడం అలవాటు చేసుకున్నారు. పదవుల కోసం మాత్రమే రాజకీయాలు చేసిన తెలంగాణ నాయకులు ఏపి నాయకులకు తొత్తులుగా మారిపోయారు. దాంతో తెలంగాణలో ప్రాజెక్టు అనే పేరు వినిపించకుండా చేశారు. తెలంగాణ అనే పదాన్ని నిషేదించేదాకా తెచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జై తెలంగాణ అనేందుకు ధైర్యం చాలడం లేదు. ఇలాంటి పాలకుల వల్ల ఇప్పటికే తెలంగాణ మళ్లీ పదేళ్లు వెనక్కిపోయింది. ఇంకా ఇలాగే వుంటే యాభై ఏళ్లు వెనక్కి పంపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేమన్నారు. నిధులు ఇవ్వలేమన్నారు. ఎత్తిపోతల సాద్యం కాదన్నారు. కాని ఏపిలో మాత్రం అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మాణంచేసుకున్నారు. అందులో రాయలసీమలోనే వందల టిఎంసిల నీళ్లతో కూడిన ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నోరు మెదపలేదు. తెలంగాణ ప్రజలు అదికారం కట్టబెట్టినా ఆంద్రా నాయకులకు ఎదురు మాట్లాడడం లేదు. తెలంగాణ ప్రాజెక్టులకు నిదులు లేవని చెప్పిన ఉమ్మడిపాలకులు ఏపిలో కండలేరు నిర్మాణం చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం అదికారంలోకి వచ్చిన తర్వాత ఆసియాలోనే అతి పెద్ద మట్టి నిర్మాణంతో జలాశయం నిర్మాణం చేశారు. పదకొండు కిలోమీటర్ల పొడవు కట్ట నిర్మాణం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధులతో కండలేరు కట్టుకున్నారు. తెలంగాణలో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను 50 టిఎంసిలో నిర్మాణం చేస్తే భూకంపం వస్తుందని భయపెట్టిన తెలంగాణ ద్రోహులకు, కండలేరు కనిపించలేదు. 1985లోనే కండలేరును 68 టిఎంసిల నీటి సామర్ధంతో నిర్మాణంచేశారు. ఎప్పుడూ 50 టిఎంసిల నీటికి తక్కువ కాకుండా నింపుకుంటూ వచ్చారు. తిరుపతి నగరమేకాదు, ఆఖరుకు తమిళనాడు రాజదానికి చెన్నైకి మంచినీటిని సరఫరా చేశారు. అమ్మకు అన్నం పెట్టని వాళ్లు పినతల్లికి గాజులు చేయించినట్లు చేశారు. తెలంగాణకు మంచినీరు ఇవ్వడానికి ఇష్టపడని తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు చెన్నై నగర ప్రజల మంచినీళ్ల కోసం ఆలోచించారు. ఉమ్మడి రాష్ట్ర నిధులతో చెన్నైదాకా నీళ్లు తరలించుకున్నారు. ఇలా సాగు, తాగు నీటి అవసరాలు తీర్చుకున్నారు. తెలంగాణలో ఎత్తిపోతల సాద్యం కాదని చెప్పిన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఏపిలో ఎత్తిపోతల పధకాలు వేలాది కోట్లు ఖర్చు చేసి కడుతుంటే కళ్లు మూసుకున్నారు. ఇదే కాకుండా పదుల సంఖ్యలో పెద్ద పెద్ద రిజర్వార్లు నిర్మాణం చేసుకున్నారు. అందులో ప్రధానమైనవి వెలింగొండ ప్రాజెక్టు. సుమారు 43 టిఎంసిల సామర్ధ్యంతో తెలంగాణ నిదులను వాడుకొని నిర్మాణం చేసుకున్నారు. దాని కింద అనేక చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మాణంచేసుకున్నారు. ఊరకళ్లు రిజర్వాయర్‌ 10 టిఎంసిల సామర్ధ్యంతో కట్టారు. బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌ను 17 టిఎంసిల సామర్ధ్యంతో చేపట్టారు. పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర నిధులను ఇలా దోచుకెళ్లారు. అలుగునూరు ప్రాజెక్టుకు 10 టిఎంసిలతో నిర్మించుకున్నారు. అవుకు 9 టిఎంసిలతో రిజర్వాయర్‌ పూర్తి చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం వున్నాయి. వీటి కింద కొన్ని వందల చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిదులతో చేపట్టారు. ఆఖరుకు రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ తూములు పగుల గొట్టి మరీ నీళ్లను దోపిడీ చేసుకున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా సాగునీటి అవసరాలకోసం నిర్మాణం జరిగిన రాజోలి బండ తూములు పగలగొట్టి మరీ నీళ్లు తీసుకెళ్లారు. నిజం చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులకు చేసిన ఖర్చుల సగం ఖర్చు చేసినా తెలంగాణ పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. తెలంగాణలో ఒక్క ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టినా తెలంగాణ అంతా సస్యశ్యామలమయ్యేది. అయినా ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. నీళ్లిచ్చి తెలంగాణ బాగు పడడం చూడాలనుకోలేదు. తెలంగాణను ఎడారిగా మార్చి, తెలంగాణ నిధులతో ఆంద్రా ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు. ఏపిని అన్నపూర్ణ అని పిలిపించుకున్నారు. తెలంగాణను ఆకలి కేకలు వింటూ ఆనందపడ్డారు. అలాంటిది ఇప్పుడు కూడా మరో సారి బనకచర్ల పేరుతోమరో పెద్ద జలదోపడీ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ వాదులు మేలుకోకపోతే, నీటి పంపకాల సమయం వచ్చినప్పుడు మరోసారి తెలంగాణకు తీరని అన్యాయం జరిగే అవకాశం వుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version