ఎన్కౌంటర్లో నేలకొరిగిన గాజర్ల రవి:-
టేకుమట్ల, నేటిధాత్రి:-
అల్లూరి జిల్లాలలో భారీ ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల అగ్ర నేతల మృతి … ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావో యిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ , అంజు మృతి చెందారు. . ఎన్కౌంటర్ ఘటనాస్థలి నుంచి మా వోయిస్టులు పరారయ్యారు. మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం .భూపాలపల్లి జిల్లా టేకు మట్ల మండలం వెలిశాల గ్రామా నికి చెందిన గాజుల రవి అలియాస్ ఉదయ్ 40 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం ముగిసింది., అప్పటి రాజ శేఖర్ రెడ్డి ప్రభుత్వంతో జరిగిన చర్చల ప్రతినిధిలో గాజర్ల రవి ఒకరు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఏవోబీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గాజర్ల రవి పై 25 లక్షల రివార్డు ఉంది గాజుల రవి మృతితో టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛా యలు అలముకున్నాయి.