ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే రాగిజావ అమలు
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రభుత్వ పాఠశాలల్లో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు అమలు చేస్తున్న రాగిజావ పంపిణీ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇప్పటివరకు అందలేదని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గత ఏడాది వరకు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రాగిజావ పంపిణీ జరిగిందని పేర్కొన్నారు.ఈ ఏడాది ఆదేశాలు వస్తే విద్యార్థులకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.