లక్షెటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి
ప్రభుత్వ దవాఖానా లలో ప్రసవాలను పెంచేలా ప్రతీ ఒక్క సిబ్బంది కృషిచేయాలని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుబ్బారాయుడు కోరారు.గురువారం నాడు వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ప్రభుత్వ దవాఖానా లలో 80 శాతం నార్మల్ డెలివరీలు జరుగుతున్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అలాగే వ్యాక్సినేషన్ పకడ్భందీగా నిర్వహించాలని పలు సూచనలు అందించారు.
ఈ సందర్భంగా ఇటీవల ఇంచార్జీగా వున్న చోటే పదోన్నతిపై రెగ్యులర్ డీఎంహెచ్ ఓ పదవీ బాధ్యతలు చేపట్టిన సుబ్బారాయుడు గారిని సిబ్బంది శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్, ఇంచార్జి ఎన్ సీడి పీఓ శివప్రతాప్ , హెచ్ ఈ ఓ లక్మణ్ స్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
