నేను మీ బిడ్డను మిరే కాపాడుకోవాలి

ఢిల్లీకి రాజునైన హుజురాబాద్ నియోజకవర్గానికి కొడుకులా ఉంటా

మీ కష్టసుఖాల్లో నేనున్నా ఆలోచించండి

ఇల్లందకుంట దేవాలయాన్ని మినీ యాదగిరిగుట్ట చేస్తా

ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

రాజకీయంగా ఎంత ఎదిగిన ఎంత పెద్ద పదవిలో ఉన్న చివరికి ఢిల్లీకి రాజునైన హుజురాబాద్ నియోజకవర్గానికి కొడుకులా ఉంటానని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నేను మీ మధ్యలో తిరుగుతున్న మీ బిడ్డను మీరే కాపాఫుకోవాలి అని అన్నారు. గురువారం ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లి, బోగంపాడు, గడ్డివానిపల్లి, టేకుర్తి గ్రామాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బిజెపి జాతీయ పార్టీలతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు.రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి కొత్త మేనిఫెస్టో తయారు చేశారని ముఖ్యంగా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పేరిట అర్హులైన మహిళలందరికీ నెలకు 3000 చూపున ఇవ్వనున్నామని, అలాగే గ్యాస్ సిలిండర్ కూడా 400 కి అందిస్తామన్నారు. అన్నపూర్ణ పేరుతో సన్న బియ్యం అందించనున్నామని, ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామన్నారు. కెసిఆర్ ధీమా ఇంటింటికి బీమా అనే పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న వారి కుటుంబంలో ఎవరైనా పోషకులు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షలు అందజేస్తామన్నారు. ప్రస్తుతం 2000 ఉన్న పెన్షన్ 5 వేలకు చేస్తామని.4000 ఉన్న వికలాంగుల పెన్షన్ దఫాలవారీగా 6000 చేస్తామని అన్నారు. గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలోనే ఉంటూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధిలో హుజురాబాద్ రూపురేఖలు మార్చి చూపిస్తానని అన్నారు. మర్రివానిపల్లిలో పెద్దమ్మ గుడి దేవాలయాన్ని కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. గత 15 సంవత్సరాలుగా మీ వాడిగా మీ వెంటే ఉంటున్నానని, మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని అన్నారు. ఒక్కసారి ఆలోచించి ఆశీర్వదించాలని కోరారు. ఇల్లందకుంటలోని రామాలయాన్ని మినీ యాదగిరిగుట్టల తీర్చిదిద్దానని అన్నారు.

నా కొంగు చాపి బిక్షం అడుగుతున్నా ఒక్క అవకాశం ఇవ్వండి

కొంగు పట్టి అర్ధిస్తున్న ఒక్క అవకాశం ఇవ్వాలంటూ హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన గొప్ప ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ఉండి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని అభివృద్ధి పనులన్నీ చేపించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణరావు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version