మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ…. కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచనలతో సిపిఐ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
కెసిఆర్ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన
5గురు సీపీఐ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగిందని దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 30కి పెరిగిందని మిగిలిన 6గురిని బీఆర్ఎస్ లో చేర్చుకుని క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. 30 వార్డుల్లో గడపగడపకు ప్రచారం చేసి వనమా వెంకటేశ్వరరావును 40 వేల పైచిలుకు మెజార్టీతో గెలిపించుకునే విధంగా కృషి చేస్తామని అన్నారు. జనరల్ స్థానంలో బీసీ నాయకుడికి టికెట్ ఇచ్చిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
నియోజకవర్గ ఇన్చార్జిగా వద్దిరాజు రవిచంద్ర బాగా పనిచేస్తున్నారని, కొత్తగూడెం మున్సిపాలిటీ నుండి 30000 మంది పైగా కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. కొత్తగూడెంలో ప్రతిపక్ష పార్టీలను పారద్రోలి గులాబీ జెండాను ఎగరేస్తామన్నారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సిపిఐ ఫ్లోర్ లీడర్
ఎర్రమల్లెల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరాము. కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో, కొత్తగూడెం లో వనమా వెంకటేశ్వరరావు సంక్షేమ పథకాలు బాగున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజకీయాలకు తావులేకుండా అందర్నీ కలుపుకొని వెళుతున్నారు.
మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందాన్నరు. బీసీ నాయకుడుగా అందరి వాడుగా వనమా నియోజకవర్గానికి తండ్రిలా వ్యవహరిస్తున్నారు. కౌన్సిలర్లు అందరం కలిసికట్టుగా, ప్రణాళిక బద్ధంగా వనమా వెంకటేశ్వరరావు విజయం కోసం కృషి చేస్తాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి , ఎం ఏ.రజాక్, పరమేష్ యాదవ్, బండారి రుక్మేందర్, కోలాపురి ధర్మరాజు,పల్లపు. లక్ష్మణ్,ప్రసాద్, నర్సింహ్మ, మాచర్ల. శ్రీను, సుందర్రాజ్,యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.