జైపూర్,నేటి ధాత్రి:
ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారిగా మంచిర్యాల జిల్లాలోని స్వస్థలానికి చెన్నూరు నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ ప్రాంతంలో అభిమానులు,రాజకీయ నాయకులు,కార్యకర్తలు కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికి పూల బొకేెను అందజేసి శాలువులతో సన్మానం చేశారు.ఆతరువాత జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను సందర్శించగా ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు.పాఠశాలలో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలపై ఉపాధ్యాయులు వినతి పత్రాన్ని అందజేశారు.కోదండరాం సానుకూలంగా స్పందించి ప్రభుత్వ పాఠశాలలో ఏ సమస్య ఉన్న సంబంధిత అధికారులకు తెలియజేసి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో రిక్కుల శ్రీనివాస్ రెడ్డి,సంపత్ రెడ్డి, శ్రావణ్,మూల రాజిరెడ్డి,కె.వి ప్రతాప్, ఆగిడపు శివ,అరిగెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.