పోన్నం ప్రభాకర్ గౌడ్ అభినందన సభను విజయవంత చేయాలి – జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అభినందన సభ కరపత్రాలను గౌడ కులస్తులతో కలిసి మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి ముందు విడుదల చేశారు. ఈకార్యక్రమానికి గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ గౌడ్ అభినందన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పోన్నం ప్రభాకర్ గౌడ్ శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ కులగణనకి చేసిన సేవ వెలకట్టలేనిదని ఈసందర్భంగా కొనియాడారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం నాయకులు మాచర్ల ప్రసాద్ గౌడ్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, పడాల అజయ్ గౌడ్, పులి ఆంజనేయులు గౌడ్, పంజాల శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు పురేళ్ళ గోపాల్ గౌడ్, మడ్డి శ్యాంసుందర్ గౌడ్, మాజీ సర్పంచ్ లు పంజాల జగన్మోహన్ గౌడ్, నేరెళ్ల ఆంజనేయులు గౌడ్, గోనపల్లి బాలగౌడ్, పాకాల రాములు, బుర్ర లవ్వయ్యగౌడ్, బుర్ర రాజాగౌడ్, బుర్ర వెంకటేష్ గౌడ్, మొలుగూరి రాజశేఖర్ గౌడ్, గోనపల్లి రాజాగౌడ్, అనుపురం వెంకటేష్ గౌడ్, వివిధ గ్రామాల గౌడ సంఘం నాయకులు, తదితరులు హాజరైయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version