ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతులమీదుగా దళిత జర్నలిస్ట్ ఫోరమ్ నూతన 2024 డైరీ ఆవిష్కరణ.

ప్రభుత్వాలకు ప్రజలకు వారధి జర్నలిస్ట్ లు – వారి సమస్యలకై,అభ్యున్నతికై నిరంతరం పోరాడుతాం

సమాజాభివృద్ధికి నిరంతరం కృషిచేసి ఏకైక శ్రామికులు జర్నలిస్ట్ లు

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ఉమ్మడి మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతులమీదుగా దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్,జిల్లా అధ్యక్షుడు డి.వెంకటన్న కలిసి తెలంగాణ రాష్ట్ర దళిత జర్నలిస్ట్ ఫోరమ్ నూతన 2024 డైరీని ఘనంగా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ….ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉంటూ సమాజాభివృద్ధి కోసం నిరంతరం పోరాడే ఏకైక శ్రామికులు జర్నలిస్ట్ లు అని అన్నారు.జర్నలిస్ట్ ల సమస్యలను తీర్చేందుకు,వారి అభ్యున్నతకై నిరంతరం కృషిచేస్తానని ఈ సందర్భంగా వారన్నారు.భవిష్యత్తులో కూడా రాష్ట్ర దళిత జర్నలిస్ట్ ఫోరమ్ గొప్ప స్థాయికి ఎదగాలని మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిఎస్.కేశవ్ గద్వాల పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్,మల్దకల్ మండల ఎంపీపీ వై.రాజారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరి కురుమన్న,మల్దకల్ వైస్ ఎంపీపీ ఈరన్న,బిజ్వారం ఎస్.తిరుమలేష్ దళిత జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా ఉపాధ్యక్షుడు,వెంకటన్న మల్దకల్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు,ఎస్.రంజిత్ కుమార్ ఉపసర్పంచ్ ల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు,మల్దకల్ మండల బిఆర్ఎస్ నాయకులు మధు నాయకి,తిమ్మరాజు,పరుష రాముడు,జూరాల డ్యామ్ భీమన్న,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version