· తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు
· డెడ్లైన్ విధించి పని చేయడం ఆయన నైజం

· రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలు తెచ్చిన సమర్థ నేత
· కేవలం పదిరోజుల్లో “వెలుగుమట్ల” సమస్యను పరిష్కరించిన నేత
· నిజమైన బాధితులను గుర్తించి ఇళ్ల పట్టాలు అందజేత
· డిసెంబర్ 9 నాటికి గహప్రవేశాలు జరిపేందుకు ఇప్పటినుంచే చర్యలు
· పదెకరాల్లో మోడల్ కాలనీ నిర్మాణం
· సమర్థవంతమైన పనితీరుతో మంత్రివర్గంలో స్థానం సుస్థిరం
· ఆదేశాలివ్వడమే కాదు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఆయన పనితీరుకు నిదర్శనం
· ఖమ్మం జిల్లాను అభివద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న ముగ్గురు మంత్రులు
హైదరాబాద్, నేటిధాత్రి:
రాష్ట్ర రెవెన్యూ, గహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెలుగుమట్ల బాధితులకు పదిహేను రోజుల్లోగా ఇళ్ల పట్టాలిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మడమతిప్పని నాయకుడిగా నిరూపించుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే మార్చి 11న ఉపముఖ్యమం త్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావులతో కలిసి 311 మంది బాధితులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. మంత్రిగా ఆయన ఏ విషయంలోలైనా వేగంగా స్పందించి అనుకున్నదానికంటే పని పూర్తిచేస్తారన్న పేరుంది. ఆ పేరును వెలుగుమట్ల బాధితుల విషయంలో కూడా మార్చి 1న ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు రోజుల ముందే ఈ ప్రక్రియను పూర్తిచేసి సెభాష్ అనిపించుకున్నారు.
గత ఫిబ్రవరి నెలలో వెలుగుమట్ల (ఖమ్మ) భూదాన్ భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారంటూ పేదల ఇళ్లను కూల్చివేతతో వివాదం రాజుకుంది. జిల్లాకు చెందిన ముగ్గు రు నాయకులు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుండటంతో విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇష్టానుసారం వార్తలు రావడంతో ఈ ముగ్గురు మంత్రు లు చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవం. తమపై వస్తున్న ఆపవాదులనులను అసత్యాలని నిరూపించేందుకు ముగ్గురు మంత్రులు తక్షణమే రంగంలోకి దిగి సమస్య పరిష్కారానికి అడుగులు ముందుకు వేసారు. ఆవిధంగా చర్యలు తీసుకున్న తర్వాత మార్చి 11న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన చేతుల మీదుగా బాధితులకు పట్టాలు పంపిణీ చేశారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు “నష్ట నివారణ చర్యల్లో” కీలక పాత్ర పోషించారు. అర్హులైన బాధితులను గుర్తించాలని కలెక్టర్ను అదేశించడమే కా కుండా, మోడల్ కాలనీగా అభివద్ధి చేయడానికి పదెకరాల భూమిని గుర్తించాలని సూ చించారు. ఆదిశగా ఆయన వ్యక్తిగతంగా ఈ సమస్యను ఒక కొలిక్కి తెచ్చేందుకు కషిచేశారు.
ఇక రెవెన్యూ, గహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగి, తన శాఖకు చెందిన సమస్యే కావడంతో, ఖాళీ చేయించిన కుటుంబాలకు కావలసిన భూమినిఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించారు. గుర్తించిన భూమికి వారంలోగా నిర్మాణానికి అవసరమైన నీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేస్తామని స్పష్టం చేశా రు. ఆవిధంగా ముగ్గురు మంత్రులు గత కొద్దికాలంగా అనవసర రాద్ధాంతానికి కారణమైన వెలుగుమట్ల వివాదానికి ముగింపు పలికారు. అంతేకాదు ఈ ఏడాది డిసెంబర్ 9నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ముఖ్యమంత్రిచేత గహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా స్పష్టం చేయడం విశేషం. బాధితులను ప్రస్తుతం కొన్ని తాత్కాలిక షెల్టర్లకు తర లించారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, తదితర ఫంక్షన్ హాళ్లలో 700 బాధితులకు స దుపాయం కల్పించగా, మరికొంతమందిని కూల్చివేతల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్ర భుత్వ పునరావాస కేంద్రాలకు కలెక్టర్ తరలించారు.
ఇక రెవెన్యూ, గహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాలకుఅనుకున్న ప్రకారం మోడల్ కాలనీ నిర్మాణం పూర్తిచేసి, వీరితో గహప్రవేశాలు పూర్తిచే యించాలన్న కతనిశ్చయంతో వున్నారు. కాలనీ నిర్మాణానికి అవసరమైన విశాలమైన రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పిస్తారు. ఇక పారిశుద్ధ్య కార్యక్రమం కింద స మగ్రమైన రీతిలో మురుగునీటి పారుదల సౌకర్యాన్ని కల్పించనున్నారు. అంతేకాదు కాలనీలో ఒక ఆసుపత్రి, తెలంగాణ పబ్లిక్ స్కూల్ను నిర్మిస్తారు. ప్రభుత్వ వీటిని మిగిలిన 16ఎకరాల స్థలంలో నిర్మిస్తారు. వీటితో పాటు ఒక కమ్యూనిటీ హాల్ను, కమర్షియల్ కాం ప్లెక్స్ను నిర్మాణాలు కూడా పూర్తిచేస్తారు. ఈ శాఖ మంత్రి కావడంతో పొంగులేటి శ్రీని వాసరెడ్డి ప్రత్యేకంగా ఈ పనులను పర్యవేక్షించనున్నారు. ప్రజాప్రభుత్వంలో నిరుపేదలకుఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమన్న సత్యాన్ని నిరూపించే దిశగా ముఖ్యంగా వివాదాస్పద వెలుగుమట్ల బాధితుల విషయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, గహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు చర్యలు తీసుకుంటున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో ఎంతో చురుగ్గా పనిచేశారు. క్షేత్రస్థాయిలోఅధికార్లతో సామాజిక`ఆర్థిక సర్వే చేయించారు. సుమారు 412మంది బాధితులను గు ర్తించగా తొలిదశలో 311మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అనర్హులకు జాబితాలో చోటు లేకుండా పారదర్శకంగా సకల జాగ్రత్తలు తీసుకున్నారు. “పేదవాడి కన్నీరు తుడవడమే తన ధ్యేయం”గా పొంగులేటి పనిచేస్తున్నారు. వెలుగుమట్ల కూల్చివేతల విషయంలో తన పై వచ్చిన ప్రతికూలతను మానవతా దక్పథంతో వ్యవహరించి బాధితులకు శాశ్వత పునరావాసం కల్పించడం ద్వారా సానుకూలంగా మలచుకోవడం ఆయన సమర్థ నాయకత్వాన్ని వెల్లడిస్తోంది.
కేవలం స్థానిక సమస్యలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం “భూ భారతి పోర్టల”తో పాటు కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తేవడంలో కీలకంగా వ్యవహ రిస్తున్నారు. ధరణి సమస్యలను పరిష్కరిస్తూ సుమారు 2.35లక్షల పెండింగ్ మ్యుటేషన్ల ను క్లియర్ చేయడం ఆయన ప్రతిభకు, నిబద్ధమైన పనితీరుకు నిదర్శనం. ధరణి పోర్టల్ లో అప్పీలు చేసుకునే అవకాశం పరిమితంగా వుండేది. ఈ ఇబ్బందిని అధిగమించే రీతిలో, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిల్లోనే సమస్యను పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించడం భూభారతి చట్టం ప్రత్యేకత. ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి కమతానికి 12అం కెలతో కూడిన “భూదార్ నెంబరు”ను కేటాయిస్తారు. దీని ద్వారా భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, మ్యాప్లు అందుబాటులో వుంటాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియుసర్వే విభాగాలను ఒకే ఛత్రం కిందికి తెచ్చారు. దీనివల్ల భూమి రిజిస్ట్రేషన్ కాగానే ఆ టోమేటిక్గా మ్యుటేషన్ జరిగేలా, వారసత్వ భూములు ఎటువంటి జాప్యం లేకుండా బదలాయింపు జరిగేలా నిబంధనలు రూపొందించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి సాదా బైనామాలను క్రమబద్ధీకరించే అవకాశం కల్పించారు. ఫిర్యాదులు, అప్పీళ్ల విషయంలో రైతులనుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయరు. ఆబాదీ, గ్రామకంఠం భూములకు కూడా యాజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ చట్టాన్ని కొన్ని మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి “ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సిస్టమ” అందుబాటులోకి రానుంది. దీనిద్వారా రైతులు ఒక్క క్లిక్తో తమ భూముల వివరాలు తెలుసుకోగలుగుతారు. ధరణికి, భూభారతికి వున్న ప్రధానమైన తేడా ఏంటంటే, ధరణిలో కేవలం డిజిటల్ రికార్డులుండగా, భూభారతిలో డిజిటల్తో పాటు మాన్యువల్ రికార్డులను కూడా నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 18లక్షల ఎకరాల భూములు వివాదాల్లో వుండటం వల్ల పార్ట్`బి (నిరోధిత జాబితా)లో వుండిపోయాయి. ఇప్పుడు కొత్తగా తెచ్చిన భూభారతి ద్వారా సమస్యలు పరిష్కరించి అసలైన యజమానులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందిస్తున్నారు. రెవెన్యూ శాఖలో ఇన్ని మార్పులు తీసుకొ చ్చిన ఘనత పొంగులేటి శ్రీనివాస్రెడ్డిదే అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
రాష్ట్ర వ్యాప్తం గా మూడులక్షల ఇళ్లను నిర్మించే లక్ష్యాన్ని సాధించాలన్న తపన ఆయనలో బాగా కనిపిస్తున్నది. ఈ దిశగా అధికార్లను పరుగులు పెట్టిస్తున్నారు. మార్చి నెలాఖరుకు మొదటి విడత పూర్తిచేసి, ఏప్రిల్ నుంచి రెండో విడత ప్రారంభించాలన్న కతనిశ్చయంతో వున్నారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో “బెస్ట్ పర్మాఫర్మర”గా పొంగులేటి ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయడం, పనులపై పూర్తి అవగా హనతో అధికార్లపై పట్టు సాధించి పనులు చేయించడం ఆయన ప్రత్యేకత.ఈ లక్షణమే ఆయన్ను విలక్షణ నాయకుడిగా గుర్తింపు తెచ్చింది.
అంతదాకా ఎందుకు, ఎన్నో ఏళ్లుగా ఏటూ తేలని, వెలుగుమట్ల భూముల వివాదాన్ని కేవలం పదకొండు రోజుల్లో పరిష్కరించి, బాధితులకు పునరావాస సదుపాయం ఘనత పొంగులేటిదే అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. దీంతో ఇప్పటివరకు ఆ భూముల్లోతాము నిర్మించుకున్న ఇళ్ల విషయంలో సందిగ్ధంతో వున్న బాధితులకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. మార్చి నెలాఖరుకు లక్ష ఇందిరమ్మ ఇళ్లలో గహప్రవేశా లు నిర్వహించాలన్నది ఆయన లక్ష్యం. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తున్నారు.
భూముల సర్వే విషయంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న సంప్రదాయ విధానానికి స్వస్తి పలికి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. భూ రికార్డులు మరింత కచ్చితంగా వుండేందుకు వీలుగా జీపీఎస్, డీజీపీఎస్ రోవర్ పరికరాలను ప్రవేశపెట్టారు.ఇక రెవెన్యూ శాఖను కేవలం పన్నులు వసూలు చేయడానికి మాత్రమే కాకుండా, ప్రజా సేవకు పనిచేసేవిధంగా తీర్చిదిద్దారు. రెవెన్యూ శాఖను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో ఇప్పటివరకు అద్దె ఇళ్లలో కొనసాగుతున్న 230 తహసీల్దార్, ఆర్డీవో కార్యాల యాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు ప్రళాలికలు రచించారు. ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణంలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా, ఒక్కొక్క ఇంటికి అందించే రూ.5లక్షలను నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో నాలుగు విడతలుగా జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
రెవెన్యూ‘గహ నిర్మాణ శాఖలతో పాటు ఆయన సమాచార పౌరసంబంధాలశాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఈ మూడు శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఆయన సొంత జిల్లా అయిన ఖమ్మం జి ల్లాలో పూర్తిగా పది స్థానాలను కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చేలా చేసిన ఘనత ఆయనదే. ఆ విధంగా ఆయన సొంత జిల్లాతో పాటు, కేబినెట్లో కూడా తన స్థానాన్ని పదిలం చేసుకు న్నారు. పనితీరు విషయంలో ఆయన ప్రభుత్వం, ప్రజలనుంచి పూర్తి మార్కులు సంపా దించుకున్నారు. పొంగులేటి విజయంలో ఆయన పాటించే “డెడ్లైన” అంశం చాలా కీల కం. ఆయన సాధిస్తున్న విజయాలకు దీన్ని పాటించడమే ప్రధాన కారణం. అంతేకాదు ఆయన కేవలం ఆదేశాలివ్వడానికే పరిమితం కారు. క్షేత్రస్థాయిలో పనుల తీరును ఎప్పటి కప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ఆయన పాటించే “డెడ్ లైన” వల్ల తక్కువ సమ యంలో ఎక్కువ ఫలితాలు చూపగలుగుతున్నారు.