సింధూర్ ఆపరేషన్ లో పాల్గొన్న ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం
ఇబ్రహీంపట్నం నేటిధాత్రి:
సింధూర్ ఆపరేషన్ దేశానికి అత్యంత కీలకమైన ఆర్మీ మిషన్ ఈ కీలక క్రమంలో భాగస్వామిగా ఉన్న మండలంలోని కోజన్ కొత్తూరు గ్రామవాసి జవాన్ ఇటీవలే సెలవులపై వచ్చిన సందర్భంగా అతడికి డబ్బా గ్రామానికి చెందిన యువకులు సన్మానం చేశారు దేశ రక్షణలో ముందు వరసలో ఉన్న జవాన్ తోట రమేష్ జూనియర్ కమిషనర్ ఆఫీసర్ సింధూర్ ఆపరేషన్ లో తన ప్రాణాలు ప్రాణంగా పెట్టి విధిని నిర్వహించాడు మట్టికి సేవ చేసిన బిడ్డను మెచ్చుకొని సన్మానించారు జవాన్ తల్లి భాగ్యలక్ష్మికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్. లింగంపల్లి గంగాధర్. గొర్రె రాజేశ్వర్. చీకట్ల వేణు. బైన మహేష్ పాల్గొన్నారు