పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు..

పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు

ఇంటింటికి తిరుగుతున్న అభ్యర్థులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రం లోని అన్ని గ్రామాల్లో ఊపం దుకున్న పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతుంది మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేష న్లు దాఖలు చేయడం, ఉపసం హరణ కావడం వంటి మూడవ హంకానికి తెరబడింది. ఎన్ని కల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కు అధికారులు గుర్తులు కేటాయించడంలో ప్రధాన ఘట్టమైన ప్రచార పర్వం మొదలైంది. మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతుంది పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది.ఇప్పటికే కథనరం గం లో నువ్వా!నేనా!అన్న విధంగా దిగిన కొందరు అభ్యర్థులు అంతర్గతంగా ప్రచారం మంది మార్బలంతో హంగు, ఆర్భాటoతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కేటాయించిన గుర్తులను ఓటర్లకు చూపిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

గమ్మత్తైయిన గుర్తుల గురించి ప్రజలకు చెప్పడం

సర్పంచ్ వార్డ్ సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈసారి గమ్మత్తయిన గుర్తులు వచ్చాయి ఇదివరకు జరిగిన ఎన్నికల్లో కేటాయించిన గుర్తులను కొన్నింటిని తొలగిస్తూ కొత్త గుర్తులు చేర్చారు వేలిఉంగరం , కత్తెర ,బ్యాట్, ఫుట్ బాల్, హ్యాండ్ బ్యాగ్ పర్స్, రిమోట్ ,టూత్ పేస్ట్, స్పానర్, డస్ట్ బిన్, గౌను, గ్యాస్ పొయ్యి స్టూలు, గ్యాస్ సిలిండర్, బీరు వా,విజిల్ వంటి గుర్తులను చూసి గమ్మత్తైనగుర్తులు వచ్చా యని ఓటర్లు అనుకుంటు న్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కేటాయించిన గుర్తులను చూపిస్తూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

సమస్యలు ఆలోచించే సమయం వచ్చింది

మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో కోతుల బెడద , కుక్కల బెడద విపరీతంగా ఉంది. మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు .దాని నివారణ చర్యలు చేపట్టే వారికి దృష్టిలో పెట్టుకొని మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో ఆలోచించే సమయం వచ్చింది.దృష్టిలో పెట్టుకొని ఓటుహక్కు వినియోగించుకో వాలని ప్రజలు ఆలోచిస్తు న్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version