Integrity thy name Kavitha

Having been in politics since the inception of Telangana State, the BRS MLC

has never used or influenced as the daughter of chief minister K Chandra

Shekhar Rao. She tried to sustain on her own so that her individuality andhttps://netidhatri.com/కవిత-కడిగిన-ముత్యం/

integrity remain intact. As the cultural representative of Telangana, she has been

trying to highlight the core aspects pertaining to Telangana culture and tradition.

It is a fact that she has never attracted this kind of malicious propaganda which

is aimed at maligning her career and character.

Liquor case a drama of BJP?

It appears that for the last five months, Delhi liquor scam has become an

opportune weapon for BJP to target the Telangana government as well as its

leaders. Nobody knows for certain as to what is the scam and what are the issues

involved in it. As the liquor policy had already been scrapped by the Delhi

government itself, it seems that the BJP is doing much ado about nothing with

regard to that dismantled policy. The BJP is trying to bring something out of

nothing by implicating BRS senior leader Kavita.

BRS the potential force:

Ever since the Bharat RashtraSamithi(BRS) is formed, there has been

tremendous response to it across the nation. The president of the party and the

Chief Minister of Telangana K Chandra Shekhar Rao has brought such a wider

political as well as ideological strength to the party thereby making it a potential

political force in the ensuing Lok Sabha elections. Now it has become clear the

BRS has the nationwide political strength to face BJP at the hustings. It seems

that this is the only reason for the BJP leadership to target BRS so that it is

morally weakened. From the very beginning Mrs Kavita has proved her dynamic

leadership by undertaking many programmes for the cultural upliftment of

Telangana. We cannot find such a dynamic women leader even in BJP. Fearing

the political potentiality as well as the dynamism Mrs Kavita has, the BJP has

been trying to threaten her with cases. Can we consider or term a policy that has

been taken up by an assembly as scam? Even before the policy came into force

how can it be termed as scam ? it is also a fact that the Delhi government has

withdrawn that policy even before it coming into force. How can we say that the

Delhi government did wrong by withdrawing the policy?

In this background it is not out of the context why the central government has

withdrawn the agriculture policies. The farmers of north India severely oppose

the act and brought force on the government to retreat. Just withdrawing an act

does not mean that the government did something wrong.

Anti BJP governments are targeted:

In order to make the opposition ruled governments to submit to its dictacts, the

BJP run central government has been targeting opposition ruled states in a

number of ways.

Is it right to privatise PSUs?

It appears that privatising Public Sector Units has become order of the day. After

the BJP government came to power at the national level there has been selling spree of Public Sector 

Units. Is it not wrong to privatise Public Sector Units? In

what way central government’s action in this regard is justified?

Just to divert Adani issue :

Caught in the midst of Adani group issue and also the fallout from the turmoil,

the central government has been trying to divert the issue by targeting opposition

parties that tried to highlight the issue. Almost all the opposition parties united on

the Adani issue. The parties have also projected the investments made by PSUs

like LIC, SBI and other banks. It is also a fact that the BJP ruled central

government has been promoting crony capitalism. Just to coverup the scams

committed by its cronies the BJP government has been targeting opposition

parties and even went to the extent of implicating and arresting them.

How can BRS MLC Kavita influence a liquor policy of Delhi government? Just to

intimidate her politically and morally she has been targeted in the name of the

scam. The allegations against her involvement in the scam are surprising given

the fact that she is not at all involved in it. It is nothing but a political vendetta of

the BJP government to target a leader who has proved her innocence and integrity.

The central government has no time.

Common people burdened:

From soaps to biscuits and from cooking gas to petrol the prices of which have

been hiked so many times. The common people of the country have been

burdened and are heavily pained with the increases. The government has no time

to relieve the commoner from the price hikes for it is busy with targeting

opposition leaders and protecting cronies.

‘‘నో’’ టిక్కెట్‌… ‘‘కాదంటే’’ కట్‌!?

`వారసుల ఆశలు ఆవిరి?

`ఈసారి వారసులకు టిక్కెట్లు కష్టమే!

`ఎన్నికలు ఈసారి బిఆర్‌ఎస్‌ కు మరింత ప్రతిష్టాత్మకం.

`ఇప్పటికే ఇండికేషన్‌ పంపిన సిఎం కేసిఆర్‌?

`అనుభవజ్ఞులైన సీనియర్లకే మళ్ళీ అవకాశం!

`మార్చాల్సిన స్థానాలలో కూడా ఆశావహులైన సీనియర్లకే ప్రాధాన్యత.

`మొత్తం మీద మరో సారి సీనియర్లనే రంగంలోకి…

`వారసులతో ఇప్పటికే చాలా మంది సీనియర్లకు ఇంటిపోరు.

`తాము బలంగా వున్నప్పుడే వారసులను గెలిపించుకోవాలని ఆశ పడుతున్న సీనియర్లు.

`వచ్చే ఎన్నికల దాక మళ్ళీ ఆగాల్సిందేనా అని వారసుల గోల?

`గత ఎన్నికలలో ఇదే పరిస్థితి ఎదుర్కొన్న కొందరు సీనియర్లు?

`ఈసారి కూడా సీనియర్లకే అనడం వారసులకు నిరాశే!

` ఒకే ఇంట్లో ఇద్దరికీ ఇవ్వడం కుదరదు?

`తలలు పట్టుకుంటున్న సీనియర్లు.

`బలంగా వున్న ప్రతిపక్షాలను ఎదుర్కోవాలంటే సీనియర్లే కీలకం!

హైదరాబాద్‌,నేటిధాత్రి: రాజకీయాల్లో రాను రాను వారసత్వాలు పెరిగిపోతున్నాయి. ఇది వాంఛనీయం కాకపోవచ్చు. కాని వారసత్వ రాజకీయాలు తప్పుకాదు. రాజకీయ నాయకుల వారసులు రాజకీయాలను ఎంచుకోవడంలో తప్పులేదు. ఎటొచ్చి ఎల్లకాలం వాళ్లేనా…మాకు అవకాశం రావొద్దా? అని ఎదురుచూసే నాయకులు కూడా వుంటారు. రాజకీయ జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలని, ఎంపి కావాలని, మంత్రి కావాలన్న కోరిక చాలా మందికి వుంటుంది. అత్యున్నత పదవులు పొందాలన్న లక్ష్యం నెరవేర్చడం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నవారు కూడా వుంటారు. అయినా కొన్ని సార్లు అలాంటి వారికి జీవితాంతం అవకాశం రాకపోవచ్చు. కొందరికి అనుకోని వరంలా అవకాశాలు కలిసిరావొచ్చు. అలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నవారు..వారి వారసులను రాజకీయాల్లోకి చేర్చినవారు కొన్ని వందల మంది వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన తెలుగుదేశం మూలంగా కొత్త తరం రాజకీయాలకు శ్రీకారం జరిగింది. కొత్త తరం నేతలు రాష్ట్ర రాజకీయాలకు పరిచయమయ్యారు. ఆనాడు రాజకీయాలకు పరిచయం అయిన నేతలు ఇంకా క్రియాశీలక రాజకీయాలలో తమదైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో వారి వారసులకు రాజకీయ భవిష్యత్తును సృష్టించిన వారు వున్నారు. కొన్ని కుటుంబాలలో ఒకటి రెండు తరాలు మారినా, వాళ్లే రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా వున్నవాళ్లు కూడా వున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు అందరూ అర్హులే. కాకపోతే రాజకీయ నాయకుల స్ధాయిని, హోదాను బట్టి ఆయా ప్రాంతాలో వారసులు కూడా తమ భవిష్యత్తు రాజకీయాలను తీర్చిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది. వారి వారి ప్రాంతాలలో రాజకీయాలను చేతిలోకి తీసుకొని నాయకత్వ పటిమ ప్రదర్శిస్తూ వుంటారు. ప్రజల ఆశీస్సులు వుంటే ఎవరైనా ప్రజా ప్రతినిధి కావొచ్చు. వారసత్వం అన్నది ఒక మెట్టు ఎక్కడానికో, రాజకీయాలకు పరిచయం చేయడానికో మాత్రమే పనికొస్తుంది. ఎల్ల కాలం ఉపయోపగపడదు. తనకు ప్రజా ప్రతినిధిగా అవకాశం వచ్చినప్పుడు ఆ యువ నాయకుడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారన్నది కూడా ప్రజలు గమనిస్తూ వుంటారు. ప్రజలకు సేవ చేయడంలో సక్సెస్‌ అయితే మళ్లీ, మళ్లీ అవకాశం కల్పిస్తారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే అభివృద్ధి చేస్తేనే, ప్రజలకు అందుబాటులో వుంటే, తమ సమస్యలు నాయకుడు తీర్చగలడన్న నమ్మకం వుంటేనే ఓట్లేస్తారు..గెలిపిస్తారు..అంతే కాని వారసులు అన్న ఒకే ఒక్క పదం మాత్రమే నాయకుడిని చేయదు…చేసినా అది ఎల్ల కాలం నిలబడదు..అలా రాజకీయాలు చేయలేక నిష్క్రమించిన వాళ్లు కూడా చరిత్రో అనేక మంది వున్నారు. 

 అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరం కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది.

కాని ఇప్పుడున్న పరిస్దితుల్లో ఏ పార్టీ అంత ధైర్యం చేసే పరిస్దితి కనిపించడం లేదు. రెండుసార్లు అధికారంలోకి వచ్చి, మూడోసారి గెలిచి హాట్రిక్‌ కొట్టాలనుకుంటున్న అధికార బిఆర్‌ఎస్‌ పార్టీతోపాటు, ప్రతిపక్షాలు కూడా కొత్త తరం నాయకులకు టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా సుముఖంలేవు. కాంగ్రెస్‌లో ఇప్పటికీ సీనియర్లదే హవా కొనసాగుతోంది. ఆ పార్టీలో కూడా మరోసారి అవకాశం కోసమే పాత తరం నేతలంతా ఎదురుచూస్తున్నారు. ఆ పార్టీలో కొత్త నాయకత్వానికి అవకాశమే లేదు. పాతవారికే టిక్కెట్లు సర్ధలేక కాంగ్రెస్‌ పార్టీ తలలు పట్టుకునే అవకాశం వుంది. ఇక బిజేపిలో కూడా దాదాపు అంతే…ఇతర పార్టీలనుంచి వచ్చిన సీనియర్లు, గతం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికే ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల కొత్త తరానికి అక్కడా అవకాశం లేకుండాపోయింది. కాకపోతే అధికార బిఆర్‌ఎస్‌లో పోటీ మాత్రం విపరీతంగా వుంది. ఆ పోటీ మాత్రం విచిత్రంగా వుంది. ఈసారి టిక్కెట్లు మాకు కాకుండా మా వారసులకు ఇవ్వాలన్ని డిమాండ్‌ బిఆర్‌ఎస్‌లో బాగానే వుంది. తాము నాయకులుగా బలంగా వున్నప్పుడే, పార్టీ పటిష్టంగా వున్నప్పుడే తమ వారసులను రంగంలోకి దింపి ఎన్నికలలో గెలిపించుకోవాలని, వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని చాలా మంది నేతలు ఆశపడుతున్నారు. అందులో కూడా చాలా మంది గత ఎన్నికల్లోనే తమ వారసుల భవిష్యత్తును నిర్ధేశించుకోవాలనుకున్నారు. కాని ఆ ఎన్నికల్లో ఆ అవకాశం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇవ్వలేదు. ఒకరికో, ఇద్దరికో అవకాశం ఇచ్చారు. కాని ఈసారి ఆ అవకాశం కూడా ఇవ్వకూడదన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి తమకు కాకుండా టిక్కెట్టు తమ వారసులకు కావాలని కోరుకునే నేతలకు సీరియస్‌గానే సిఎం. కేసిఆర్‌ చెప్పనున్నారట. మీరు మాత్రమే పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం వుందన్నది తెలుస్తోంది. కాదూ, కూడదు అని ఎవరు నసిగినా వాళ్లకు కూడా టికెట్‌కట్‌ అన్న సంకేతాలు పంపిస్తున్నట్లు సమాచారం. అంటే ఈసారి కూడా బిఆర్‌ఎస్‌ వారసులకు టిక్కెట్లు లేవు. ఇప్పుడున్న సీనియర్లే మళ్లీ పోటీ చేయాలి.. అందులో కూడా కొందరిని మార్చే అవకాశం వున్న చోట కొత్తవారికి అవకశం కల్పించనున్నారు. అంతే కాని నాయకుల వారసులకు మాత్రం టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఫిక్స్‌ అయినట్లు సమాచారం. ఎందుకుంటే ఇటీవల ఓ సభలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కాకతాళీయంగా అన్నా, అవే సీరియస్‌ సంకేతాలుగానే పరిగణించాలని నాయకులకు అర్ధమైపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఇండికేషన్లు వున్న తర్వాత కూడా టిక్కెట్‌ విషయంలో ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఆయన ఇవ్వకపోవచ్చు.

 ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం.

 అధికార బిఆర్‌ఎస్‌కు మరీ ముఖ్యం. ఎందుకంటే బిఆర్‌ఎస్‌దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సమయంలో అనుభవజ్ఞులైన నాయకుల నాయకత్వమే ఎంతో అవసరం. వారికి వున్న అనుభవం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ నాయకులకు నియోజకవార్గల మీద, జిల్లా మీద పూర్తి పట్టు వుంటుంది. అదే వారసులకు అంతగా వుండకపోవచ్చు. పైగా ప్రజల్లో కొత్త వారసత్వ నాయకుల ప్రభావం కూడ పడొచ్చు. రెండుసార్లు అధికారంలో వున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ప్రజలకు పూర్తి స్దాయి నమ్మకం, భరసా వున్నాయి. ఆయన నాయకత్వమే ప్రజలు కోరుకుంటున్నారు. కాని కొందరు నాయకుల పనీతీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అలాంటి చోట్ల బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుల స్దానంలో వారి వారసులకు అవకాశం కల్పిస్తే, మొదటికే మోసం రావొచ్చు. కొత్త తరానికి అవకాశం రావాలి. కాని దానికి కూడా సమయం సందర్భం వుంటుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పును చూశాం…నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో తీర్పును చూశాం…రామలింగారెడ్డి పనితీరుపై ప్రజలు అసంతృప్తితో వుండడంతో మళ్లీ ఆ కుటుంబాన్ని ప్రజలు ఆదరించలేదు. సానుభూతి కూడా పనిచేయలేదు. అదే నాగార్జున సాగర్‌లో సానుభతి పనిచేసింది. నోముల నర్సింహయ్య నాయకత్వం ప్రజలకు వున్న నమ్మకంతో భగత్‌ను గెలిపించారు. అందుకే ఈసారి రాష్ట్రంలో ముక్కొణపు పోటీ అనివార్యం. ప్రతిపక్షాలు కూడా కొంత బలపడ్డాయనే చెప్పాలి. గత ఎన్నికల పరిస్ధితి ఇప్పుడు లేదు. అందువల్ల ఆ పార్టీలను ఎదుర్కొనాలంటే ఖచ్చితంగా సీనియర్‌ నాయకులనే మళ్లీ ఎంపిక చేయాల్సిందే..వారికే టిక్కెట్లు ఇస్తేనే సీనియర్‌ నాయకులపై వున్న నమ్మకం, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద వున్న విశ్వాసంతో బిఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. అందుకే ఈసారి వారసులకు టిక్కెట్‌ నో…!కాదూ..కూడదు…అంటే సీనియర్లకు కూడా కట్‌…!! ఇది ఫిక్స్‌…!!! అని సమాచారం. వారసులను రాజకీయాల్లోకి దింపాలన్న నాయకుల లిస్టు పెద్దగానే వుంది…అందుకే అందతా కాన్సిల్‌…? ఇదే ఫైనల్‌!?

బిసి నేతలు ఎదుగొద్దా! బతకొద్దా!?

` రాజకీయాలలో హత్యా రాజకీయాలకు తావులేదు.

`రాజకీయాలన్నీ ఆత్మహత్యా సదృశ్యాలే!

`బిసి. నేతలను నిర్మూలించి ఎన్నేండ్లు రాజకీయం చేస్తావు?

`వెయ్యేండ్లు బతికి పదవులు అనుభవిస్తావా?

`పార్టీయే నమ్మక పిసిసి ఇవ్వలేదు!

`కోమటి రెడ్డి సమర్థత ఎంతో అక్కడే తేలిపోయింది?

`చెరుకు సుధాకర్‌ చిన్న నాయకుడైతే అంత భయమెందుకు?

`రేవంత్‌ రెడ్డిని ఎదిరించే ధైర్యం లేదు?

`బిసి.నేతల మీదనా నీ ప్రతాపం?

`తెలంగాణ ఉద్యమ సమయంలో పిడి.యాక్ట్‌ ఎదుర్కొన్న ఏకైక నాయకుడు చెరుకు సుధాకర్‌.

`నల్గొండ జిల్లాలో ఎంతో మంది బిసి నేతల రాజకీయ జీవితాలు నాశనం చేసినట్లు అనేక ఆరోపణలు?

`ఇప్పటికే పార్టీలో ఎవరూ నమ్మడం లేదు?

`కాంగ్రెస్‌ లో టిక్కెట్‌ వస్తుందో నమ్మకం లేదు?

`ఎప్పుడు గోడ దూకుతావో ఎవరికీ తెలియదు?

`పార్టీని ఖతం చేసే పనిలో, నేతలను కూడా లేపేస్తావా?

`ఇంతేనా ఇన్నేళ్ల రాజకీయం నేర్పిన పాఠం!

` ఇదేనా ఇంత కాలం అనుసరించిన అరాచక రాజకీయం!

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాల్లో అసహనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో రాయలసీమలో ఇలాంటి వాతారణం వుంటుందని అంటుండేవారు. కాని కోమటి రెడ్డి వెంకటరెడ్డిలా తన రాజకీయ ప్రత్యర్ధులను ఏకంగా వంద మంది వెతుకుతున్నారు..వేసేస్తారు? అని చెప్పేంత ధైర్యం ఎవరూ చేసి వుండదు. రాజకీయాలకు దూరంగా వున్నవారో..లేక వ్యాపారాలలో ప్రత్యర్ధులలో..తగాదాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారి చూసి వుంటాం…కాని ఒకే పార్టీలో వుంటూ, మరో నాయకుడిపై భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడాన్ని అందరూ ఖండిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో ఇటీవల వీపతీరంగా అసహం పెరిగిపోయినట్లుంది. గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నారు. పార్టీలో వుండాలో వద్దో తేల్చుకోలేకపోతున్నాడు. తమకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తిరుగులేదనుకున్నాడు. తమకు ఎదురులేదనుకున్నాడు. ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ రావడంతో ప్రజలు తమ వైపు వున్నారన్న అహంభావం మరీ ఎక్కువైంద. ఎవరిని పడితే వారిని తిడుతున్న్డాడు. దూషిస్తున్నాడు. కాంగ్రెస్‌లో అసమ్మతి నేతగా వుంటూ వస్తున్నారు. అసమ్మతి నేతైనంత మాత్రాన ఆయనేం బలమైన నేత అన్నది ఎవరూ అనుకోడం లేదు…పార్టీ కూడా గుర్తించలేదు. కాకపోతే ఎన్నికల్లో అడిన చోట్లల్లా టిక్కెట్లు ఇస్తూ వస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో తన సోదరుడైన రాజగోపాల్‌రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చాడు. రాజశేఖరెడ్డి ఆశీస్సులతో తన తమ్ముడికి ఎంపి టిక్కెట్టు ఇప్పించుకున్నాడు. గెలిచారు. కాని 2014 ఎన్నికల్లో అన్న గెలిచాడు. తమ్ముడు ఓడిపోయాడు. అయినా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇచ్చింది. తర్వాత 2018లో మునుగోడు టిక్కెట్టు తమ్ముడికి, నల్లగొండ టిక్కెట్టు అన్న తీసుకున్నారు. ఈసారి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయాడు. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి గెలిచాడు. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ వెంకటరెడ్డికి పార్టీ భువనగిరి ఎంపి టిక్కెట్‌ ఇచ్చింది. ఇంతగా పార్టీ అన్నాదమ్ములకు ప్రోత్సాహం ఇచ్చినా పార్టీని వెన్నుపోటు పొడిచారు. తమ్ముడు పార్టీ మారాడు. మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడు. వున్న పదవి పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే రాజగోపాల్‌ మునుగోడు బరిలో నిలిచాడో అప్పటినుంచి అన్నకు అసహనం విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది.

 రాజగోపాల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా వున్నప్పుడే ఇక కాంగ్రెస్‌ పార్టీ ఖతమైందంటూ బిజేపి వైపు చూశాడు. 

తమ్ముడు రాజీనామా చేసిన తర్వాత అన్న అదే రాగం అందుకున్నాడు. భవిష్యత్తు బిజేపిదే అంటూ, కాంగ్రెస్‌లో వుంటూ తమ్ముడి వైపు సైలెంటు ప్రచారం నిర్వహించాడు. అబాసు పాలయ్యాడు. అయినా ఆయనలో మార్పు రాలేదు. పైగా సొంతపార్టీ నేతలపై బెదిరింపులకు దిగుతూ వస్తున్నాడు. చివరికి తెలంగాణ ఉద్యమకారుడైన చెరుకు సుధాకర్‌ గౌడ్‌ను చంసేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశాడు. వంద మంది ఆయన కోసం వెతుకుతున్నారంటూ సుదాకర్‌గౌడ్‌ కొడుకుతో ఫోన్లో బెదిరించాడు. సుధాకర్‌ గౌడ్‌కొడుకు హాస్పిటల్‌ను నాశనం చేస్తానన్నాడు. చెరుకు సుదాకర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం అన్నది ఆది నుంచి వెంకటరెడ్డికి నచ్చలేదు. ఆయన రాకను వెంకటరెడ్డి వ్యతిరేకించాడు. 

 కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆది నుంచి చెరుకు సుధాకర్‌ కొరకరాని కొయ్యగా మారుతూ వస్తున్నాడు.

 దాంతో సుధాకర్‌పై ఇలాంటి వాఖ్యలు చేశాడు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా వున్న సమయంలో తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఆ సమయంలో చెరుకు సుధాకర్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమకారుడిగా పదేపదే కాంగ్రెస్‌పై విరుచుకుపడుతుండేవారు. అది వెంకటరెడ్డికి అనేక సార్లు ఇబ్బందులకు గురి చేసింది. ఇదే సమయంలో చెరుకు సుధాకర్‌పై పడి. యాక్ట్‌ పెట్టారు. ఆయనను వరంగల్‌ జైలుకు పంపారు. ఇందులోనూ కోమటిరెడ్డి ఒత్తిళ్లే కారణమన్నది అప్పట్లో చెప్పుకుంటుండేవారు. కాకపోతే తాను తెలంగాణ వాదినే అని చెప్పుకొని మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత వెంకటరెడ్డి వరంగల్‌ జైలులో సుదాకర్‌ను కలవడం జరిగింది. తాను సుధాకర్‌కు వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపారు. అయినా వారి మధ్య వార్‌ నడుస్తూనేవుంది. ఇది ఇటీవల కాలంలో మరింత పెరిగింది. అప్పుడుంటే చెరుకు సుధాకర్‌ టిఆర్‌ఎస్‌ వుండేవారు. తర్వాత ఆయన సొంతంగా తెలంగాణ ఇంటి పార్టీ పెట్టుకున్నాడు. కాని ఇప్పుడు సుధాకర్‌ గౌడ్‌ కాంగ్రెస్‌లో వున్నాడు. ఈ మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిని ఓడిరచడంలో కీలక పాత్ర పోషించాడు. రాజగోపాల్‌రెడ్డికి పట్టున్న చౌటుప్పలోనే ఓట్లు పడకుండా రాజకీయం నడిపాడు. అప్పటినుంచి చెరుకు సుధాకర్‌ మీద వెంకటరెడ్డి మరింత కోపం పెంచకున్నాడన్నది వినిపిస్తున్న మాట. అయితే తాజాగా జరిగిన వివాదంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యుత్సాహానికి పోయి, గతంలో అద్దంకి దయాకర్‌ విషయంలో చేసిన దూకుడే ఇప్పుడూ ప్రదర్శించాడు. కాకపోతే బొక్కా బోర్లా పడ్డాడు. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలను పూర్తిగా చూడకపోతే ఏమౌతోందో అన్నది వెంకటరెడ్డి ఉదంతమే సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పాలి. పైపైన వుండే నాలుగు అక్షరాలు చేసి, ఆవేశపడితే మొదటికే మోసం వస్తుందని తెలిసి కూడా కొన్ని సార్లు తొందరపాటు ఎంత పనిచేస్తుందో వెంకటరెడ్డికి బాగా తెలిసి వచ్చింది. నిజానికి సుధాకర్‌ గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు తననే అనుకొని, తనకు ఆపాదించుకొని వెంకటరెడ్డి రెచ్చిపోయాడన్నది అసలు సారాంశం. 

  చెరుకు సుధాకర్‌ గౌడ్‌ ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌లో వెంకటరెడ్డికి నూకలు చెల్లినట్లే అంటున్నారు. 

ఆది నుంచి కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి నిత్య అసమ్మతివాదిగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. తాను పార్టీకి సేవ చేశానని అంటున్నారే గాని, తనకు పార్టీ అవకాశం కల్పించిందన్న సంగతిని మర్చిపోతున్నారు. అంటే తన వల్లే కాంగ్రెస్‌ బతికి బట్టకట్టిందన్నంత అతివిశ్వాసానికి వెంకటరెడ్డి వచ్చారని విమర్శలున్నాయి. పైగా వెంకటరెడ్డి ఎప్పుడూ ఒక్క మాట మీద నిలవడడు అన్న అపవాదు కూడా వుంది. ఇంకా కాంగ్రెస్‌పార్టీ వెంకటరెడ్డిని భరించే పరిస్థితుల్లో లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఓ వైపు బిజేపి వైపు కన్ను గీటుతూ, మరో వైపు కాంగ్రెస్‌లో కొనసాగుతూ, అవకాశం వస్తే మరెటైనా దూకేందుకు సిద్దంగా వెంకటరెడ్డి వుంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు తెలంగాణలో వైసిపి వుంటే వెంకటరెడ్డి ఖచ్చితంగా ఈపాటికి చేరిపోయేవారని, ఒక వేళ షర్మిల పార్టీ బలంగా వుంటే ఆపార్టీలోకైనా వెళ్లిపోయేవారే అంటున్నారు. వైసిపి లేదు…షర్మిల పార్టీ అనుకున్నంత గొప్పగా లేదు. ఇప్పటికైతే కాంగ్రెస్‌లోనే వుంటూ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, అప్పుడు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకే వెంకటరెడ్డి ఆగుతున్నాడు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరెడ్డికి టిక్కెట్టు దక్కే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం. ఆయన ఎలాగూ ఎంపిగా వున్నారు. ఆయనకు అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తే మిగతా అసమ్మతి వాదులకు అవకాశం కల్పించినట్లైంది. అంతదాకా ఎందుకు మొన్నటిదాకా ఆయన వెంట నడిచిన వారు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు కూడా వెంకటరెడ్డి వ్యవహార శైలిని నచ్చడం లేదట. అందుకే ఈ మధ్య మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనం. ఇప్పుడు బిసి నాయకుడు, తెలంగాణ ఉద్యమ కారుడైన చెరకు సుధాకర్‌ గురించి చేసిన వ్యాఖ్యల మూలంగా ఆయన రాజకీయ భవిష్యత్తు తలకిందులయ్యే అవకాశాలే ఎక్కువగా వున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయం నేటిధాత్రి కూడా ఎప్పుడో చెప్పింది. మునుగోడు ఎన్నికల సమయంలో కోమటి రెడ్డి సోదరులు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఎంత మంది బిసి నేతలను ఎదకుండా చేశారన్నదానిపై కూడా సమగ్ర కధనం కూడా ప్రచురించింది. అయినా వెంకటరెడ్డి తన సహజశైలిని మార్చుకోలేదు. అందుకే అహం బైటపడిరది….రాజకీయ భవిష్యతుకు ఎసరు రానున్నది.

అర్హులను నెట్టి…అనర్హులకు పెట్టి!?

`అధికారుల సహకారం…ట్రేడర్ల మాయాజాలం

`లబ్ధి దారులకు సెంట్రింగ్‌ ఇచ్చే వారు వద్దా? 

` రెండు లక్షలు తీసుకునే వారే ముద్దా!

`దళితుల సొమ్ము కాజేసేవారికే కొమ్ము కాస్తారా?

` సెంట్రింగ్‌ సరఫరా చేస్తామనే వారికి బెదిరింపులా?

`మా ఊరికొస్తే అట్రాసిటీ కేసు పెడతామని భయపెట్టిస్తారా?

` నిజాయితీగా లబ్ధి దారులకు మేలు చేస్తామంటే వద్దంటారా?

` కేకే…స్టీల్‌ ట్రేడర్‌ ను ఎందుకు కాదన్నారు?

` తాను సరఫరా చేసిన సెంట్రింగ్‌ కు కూడా పని కల్పిస్తామని చెప్పే వారు వద్దా?

` నిష్పక్షపాతంగా సెంట్రింగ్‌ సరఫరా చేసే వారికి ప్రోత్సాహం లేదా?

` కనీసం అప్పటికప్పుడు లైసెన్స్‌ సృష్టించుకున్న వారికి అందలమా?

`దళితుల బలహీనతతో ఆడుకుంటారా?

`రెండు లక్షలు నొక్కి, తోచింది చేతిలో పెట్టి, దళిత బంధు లక్ష్యం నీరుగార్చుతారా?

`యూనిట్‌ ఇవ్వకుండా, డబ్బులిస్తామని చెప్పడం నేరం కాదా?

`దళితులను మోసం చేయడమే అధికారుల లక్ష్యమా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక చారిత్రక నిర్ణయంలో, సమాజ నిర్మాణంలో అందరికీ అవకాశం రాదు. భాగస్వామ్యం కాలేరు. దళితబంధు లాంటి విప్లవాత్మకమైన పథకం అమలులో అన్ని వర్గాల ఉద్యోగుల అవసరం లేదు. కాని తెలంగాణలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెచ్చిన దళిత బంధు పధకం అమలుకు కొన్ని శాఖలు, కొంత మంది అధికారులకే అవకాశం వచ్చింది. ఆ పధకం అమలులో భాగస్వామ్యమైన దళితులకు అందాల్సిన రూపాయి పక్కదారి పట్టకుండా చూడాల్సిన అధికారులు చేసిన నిర్వాకం మూలంగా వారే విమర్శల పాలౌతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎట్టిపరిస్ధితుల్లో వారు చేసిన, దారి చూపిన అవినీతిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందిస్తోంది. ఏ క్షణమైనా దీనిపై విచారణ జరిగే అవకాశం కూడా వుంది. అధికారులు, అధికారులకు కొమ్ము కాసిన ట్రేడర్ల మూలంగా హుజూరాబాద్‌ లో అమలు చేయస్తున్న దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు అసలు లక్ష్యం పక్కదారి పట్టింది. అర్హులనై ట్రేడర్లను పక్కనకు నెట్టేశారు. అనర్హులైన ట్రేడర్లకు అవకాశాకాలు కల్పించారు. దాంతో దళితులకు అందాల్సిన న్యాయమైన సొమ్ము ఉత్తుత్తి ట్రేడర్లు, అధికారుల జేబుల్లోకి వెళ్లిందనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 

 దళిత బంధు అమలులో ప్రభుత్వం అవకాశం కల్పించిన ట్రేడర్లలో సెంట్రింగ్‌ యూనిట్‌ అందించే ప్రత్యేక పరిశ్రమ వున్న సంస్ధ కేకే. స్టీల్‌. పూర్తి స్దాయిలో అన్ని రకాల అనుమతులు వున్న సంస్ధ. 

దళిత బంధు అమలులో భాగంగా అందించే సెంట్రింగ్‌ యూనిట్‌ను అందిస్తున్న విశ్వసనీయ సంస్ధల్లో ఇదొకటి. సహజంగా సెంట్రింగ్‌ యూనిట్లు అందిస్తున్న ఇతర సంస్ధలు కేవలం 1500 ఎస్‌ఎఫ్‌టిమాత్రమే అందిస్తున్నాయి. కాని కేకే అనే సంస్ధ 2000 ఎస్‌ఎఫ్‌టి అందిందించేందుకు ముందుకొచ్చింది. దళితులకు మేలు చేసే ఇలాంటి గొప్ప పధకంలో భాగాస్వామ్యం కావాలన్నదే ఈ సంస్ధ లక్ష్యం. అంతే కాదు మిగతా సంస్దలకన్నా తక్కువ ధరకే కోడ్‌ చేస్తామని కూడా చెబుతున్నారు. ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమల గిరిలో ఈ సంస్ధ అందించిన యూనిట్లు ఇప్పుడు దళితులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ కేకే అనే సంస్ధ సెంట్రింగ్‌ యూనిట్‌ను అందించడమే కాకుండా, ఆ యూనిట్‌ తీసుకున్న దళితులకు ఆ యూనిట్‌ ద్వారా ఆదాయం సమకూర్చే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా చెబుతున్నారు. కాని ఇది అధికారుల చెవికెక్కలేదు. నిజానికి ఆ పని అధికారులు చేయాలి. సెంట్రింగ్‌ యూనిట్‌ అప్లికేషన్‌ పెట్టుకున్న దళితులకు ఖచ్చితంగా ఆ యూనిట్‌ అందజేయాల్సిన బాధ్యత అధికారులది. అంతే కాకుండా ఆ యూనిట్‌ ద్వారా ఉపాధి అవకాశాలు కూడా కల్పించాల్సిన బాధ్యత అధికారులదే.

ఇది ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో ఖచ్చితంగా పాటించాల్సిన అంశం. ఇక్కడ అధికారులు పాటించాల్సిన అంశాన్ని సెంట్రిగ్‌ యూనిట్‌ అందిస్తామని చెప్పిన కేకే స్టీల్‌ ట్రేడర్‌ , లబ్ధిదారులందరికీ తామే ఉపాధి కల్పిస్తామని అందుకు అవసరమైన బాండ్‌ కూడా రాసిస్తామని చెబుతున్నారు. కాని అదికారులు వినలేదు. ససేమిరా అన్నారు. కారణం ఈ కేకే స్టీల్‌ ట్రేడర్స్‌ లబ్ధిదారులకు నేరుగా డబ్బులు ఇస్తామని చెప్పకపోవడమే కారణం….! అసలు ట్రేడర్లు చేయాల్సిన పనేమిటి? అధికారుల పర్యవేక్షణ ఏమిటి? అన్నది అందరికీ తెలియాల్సిన అవసరం వుంది. ఖచ్చితంగా ట్రేడర్లు లబ్ధిదారులకు సెంట్రింగ్‌ యూనిట్లే అందించాలి. కాని దళితుల అకౌంట్లో వున్న డబ్బును సుమరు 2 లక్షలు తీసుకొని మిగతా సొమ్ము ఇవ్వడానికి కాదు…ఇలా ప్రజా ధనం పక్క దారి పట్టేందుకు కాదు…కాని అధికారులు, కొంత మంది ట్రేడర్లు కలిసి ఆడుతున్న నాటకంలో అసలైన ట్రేడర్లు పక్కకు వెళ్తున్నారు. లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. వారి సొమ్మును నొక్కేస్తున్నారు. 

 లబ్ధిదారులకు యూనిట్లు అందిస్తామే తప్ప డబ్బుల మాయాజాలంలో మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని చెబుతున్న కేకే స్టీట్‌ ట్రేడర్‌ సంస్ధ వ్యక్తులను కొందరు వ్యక్తులు బెదిరిచినట్లు సమాచారం.

 యూనిట్లు ఇస్తామంటూ నియోజకవర్గంలోకి వస్తే, అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని కూడా కొందరు నాయకులు బెదిరించారట. అసలు ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్న ట్రేడర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని బెదిరించడం ఏమిటి? అంతే కాదు లబ్ధిదారుల డబ్బులు పట్టుకొని ట్రేడర్‌ మాయమైతే అప్పుడు ఎవరి బాధ్యత అంటూ అమాయకులైన లబ్ధిదారులకు లేని పోని భయాలు కూడా కొందరు సృష్టించారని తెలిసింది. యూనిట్లు అందిజేసిన తర్వాతే లబ్ధిదారులనుంచి అందుకు అవసరమైన సొమ్మును డ్రా చేయించుకోవాలి…అదే కేకే.స్టీల్‌ చేస్తామని చెప్పింది. అయినా అధికారులు వినలేదు…నాయకులు వినలేదు…… పైగా ప్రజలను కొందరు నియోజకరవర్గ నాయకులు, బోగస్‌ ట్రేడర్ల్‌ దళితులను తప్పుదోవ పట్టించి, కేకే ట్రేడర్స్‌ను రాకుండా చేశారు. హుజూరాబాద్‌ నియోజవర్గంలో దళిత బంధు లబ్ధిదారులకు అందించాల్సినంత సెంట్రింగ్‌ దరఖాస్తు చేసుకున్న చాలా మంది ట్రేడర్లకు ఎలాంటి అర్హత లేదు. వారికి కంపనీలే లేవు. అవన్నీ కేవలం సూట్‌ కేస్‌ కంపనీలు. రాత్రికిరాత్రి పుట్టుకొచ్చిన లైసెన్సులు మాత్రమే . అవసరమైన గోడౌన్లు లేవు. ఆ సదుపాయాలు కూడా లేవు. మెటీరియల్‌ అంతకాన్న లేదు. కేవలం కాగితాల మీద లైసెన్సు తప్ప మరేం లేవు…కాని కేకే.స్టీల్‌ ట్రేడర్స్‌ అవసరమైన గోడౌన్లు వున్నాయి. దళితులకు అందజేయాల్సిన సెంట్రింగ్‌కూడా రెడీగా వుంది. అధికారులు కూడా ఆ గోడౌన్లు పరిశీలించారు. నామ్‌కే వాస్తే చూశామన్నట్లు చెప్పి, ఉత్తుత్తి ట్రేడర్లకు లాభాల పంట పండిరచేందుకు, వాటలు పొందేందుకే అధికారులు మొగ్గు చూపారు. కేకే స్టీల్‌ ట్రేడర్స్‌కు అవకాశం కల్పించలేదు. అధికారుల తప్పుడు నిర్ణయం వల్ల లబ్ధిదారులకు ఇప్పటికిప్పుడు యూనిట్లు అందజేసేంత మెటీరియల్‌వున్న కేకే సంస్ధను కాదన్నారు. ఆయన పెట్టుకున్న దరఖాస్తును పక్కన పెట్టేశారు. ఉత్తుత్తి ట్రేటర్లకు అవకాశం కల్పించారు. నేటిధాత్రి ఈ విషయంలో దరఖాస్తు చేసుకున్న ట్రేడర్లు, వారి వివరాలు సేకరించింది. వారికి సంబంధించిన లైసెన్స్‌ల ప్రక్రియను కూడా పరిశీలించింది. ఉత్తుత్తి ట్రేడర్ల నిర్వాకంపై నేటిధాత్రి పూర్తి స్దాయి దృష్టిపెట్టింది. వాటి బండారం బైటపెట్టనుంది. త్వరలో వారి బోగోతాలు వరుసగా మీ నేటిధాత్రిలో రానున్నాయి.

మహా కార్యాన్ని మలినం చేయం.

దళిత బంధు పనుల బాధ్యతల నుండి మమ్మల్ని తప్పించండి….. https://netidhatri.com/దళిత-బంధు-మేసిన-రాబందులె/

గ్రౌండ్ లెవల్లో పరిస్థితులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన గ్రామ కార్యదర్శులు…….. కెసిఆర్ https://netidhatri.com/దళిత-బంధు-ట్రాక్టర్లు-ఆం/

ప్రభుత్వం మానస పుత్రికగా అభివర్ణించిన దళిత బంధు పథకం,దళిత జాతి ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో, https://netidhatri.com/దళిత-బంధు-లో-దగా-దగా/

ప్రతిష్టాత్మకంగా హుజురాబాద్ నియోజకవర్గం లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంద్ పథకానికి ఉన్నతాధికారుల https://netidhatri.com/దగా-చేసేది-మీరేనా-ఆత్మాభ/

నిర్లక్ష్యం,లంచగొండితనం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుకారి,లబ్ధిదారులు లాభంhttps://netidhatri.com/అత్యవసరంగా-మీటింగ్-అన్న/

పొందక పోగా,మధ్యలో బ్రోకర్లు,కొద్ది మంది ఉన్నతాధికారులు, వ్యాపారులు,కోట్ల రూపాయలు మూట గట్టుకున్నారని,గత కొద్దిరోజులుగా నేటి ధాత్రి దినపత్రిక లో వస్తున్న వరుస కథనాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.నష్ట నివారణ చర్యల్లో భాగంగా గ్రామ కార్యదర్శులకు దళిత బంధు ఆస్తుల ఫోటో రికార్డింగ్ చేసి నివేదికలను తయారు చేయాలంటూ బాధ్యతలను అప్పగించారు. ఉన్నతాధికారుల కనుసనల్లో ఈ భారీ కుంభకోణం జరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో,గ్రామ కార్యదర్శుల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.రికార్డులలో చూపినట్టుగా దళిత బంధు ద్వారా ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థలు, వాహనాలు, ఇతర ఆస్తులు కనబడటం లేదని,కొన్ని వాహనాలు అమ్ముకున్నారని, మరికొన్ని వాహనాలు వేరే ప్రాంతాల్లో లబ్ధిదారులు లీజుకి ఇచ్చుకున్నట్లుగా తెలుస్తుందని, అంతేకాకుండా ఒకే వ్యాపార సంస్థను ఇద్దరు ముగ్గురు పేర్లతో నమోదు చేసుకున్నారని,ఇలాంటి సమయంలో తాము దళిత బంధుఆస్తుల ఫోటో సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించలేమని,ఈ బాధ్యత నుండి తమను తప్పించాలంటూ, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఆయా గ్రామాల కార్యదర్శులు జిల్లాకలెక్టర్ కు స్థానిక ఎంపీడీవో ద్వారా వినతి పత్రాన్ని పంపించారు.

అత్యవసరంగా మీటింగ్‌ అన్నారు! అర్థాంతరంగా ఆపేశారు!!

 

`ఇంతకీ ఏం జరిగింది?

`పంచాయతీ రాజ్‌ సెక్రెటరీల వాదనేమిటి?

`మమ్మల్ని వదిలేయండి…ప్లీజ్‌!`మేం చిన్న జీవులం…

`దళిత బంధుపై ఎలాంటి ఒత్తిళ్లు తేవొద్దు!

`పెద్ద వాళ్లను రక్షించేందుకు మమ్మల్ని బలిచేయొద్దు!

`దళిత బంధు లో రూపాయి తిన్నది లేదు!

`పూర్తిగా పై అధికారుల కనుసన్నల్లో జరిగిందే!

`అవకతవకలు కప్పిపుచ్చుకునేందుకు మేమే దొరికామా?

`అమలు విషయంలో అసత్యాలు నమోదు చేయలేం!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పెద్ద పెద్ద తిమింగలాలు ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే చేస్తాయి…చిన్న చిన్న చేపలే బలౌతుంటాయని అనేక సంఘటలను రుజువు చేసిన ఉదంతాలు వున్నాయి. ఇప్పుడు కూడా దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలులోనే చిన్న జీవులను బలిచేసే ప్రయత్నం పెద్ద జీవులు చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి పైలెట్‌ ప్రాజెక్టులు అమలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఆ బాధ్యతను పై స్ధాయి ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా చేపట్టాలి. కింది స్ధాయిలో ఎక్కడా అవకతవకలు జరక్కుండా చూసుకోవాలి. కింది స్ధాయి ఉద్యోగులకు పూర్తి స్ధాయి శిక్షణలివ్వాలి. వారికి కొన్ని బాద్యతలు అప్పంచాలి. కాని దళిత బంధు విషయంలో పై స్దాయి అదికారులే అన్నీ చూసుకున్నారు. పథకం తప్పుతోవ పట్టిందన్న విషయం వెలుగులోకి రావడంతో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలను బలిచేసే ఎత్తుగడలు మొదలైనట్లు తెలుస్తోంది. క్షేత్ర స్ధాయిలో ఈ పధకం అమలుకు సంబంధించి కేవలం అప్లికేషన్లు నింపే ప్రక్రియలాంటి చిన్న పని తప్ప, మరే సంబంధం లేదు. పైలెట్‌ ప్రాజెక్టు కావడంతో ఎంపిక విధానానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అసవరం లేకండాపోయింది. దళితులందరినీ ఈ ప్రాజెక్టులో భాగస్వాములు చేయడంతో పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలు పేర్లు పంపించడం తప్ప మరేం చేయలేదు. కాని ఇప్పుడు వారికి పెద్ద చిక్కొచ్చి పడిరది. రెండో విడత నిధులు విడుదల చేయాల్సిన సమయం వచ్చింది. పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలతో పై స్ధాయి అధికారులక పని పడిరది. అసలు ఎంత పై స్దాయి అధికారులైనా ఇలాంటి పైలెట్‌ ప్రాజెక్టులపై క్షేత్ర స్ధాయి అవగాహన వుండాలి. కాని అటు ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులెవరూ వాటిని పట్టించుకోలేదు. కేవలం ఇందులో ఎంత సంపాదించొచ్చన్న విషయాలను మాత్రం బాగా పట్టించుకున్నట్లున్నారు. అందుకే ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నారు. ప్రజల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

 ఇటీవల దళిత బంధు పథకం పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై నేటిధాత్రిలో వస్తున్న కథనాలతో భూకంపం పుట్టింది.

 అంతకు ముందు ఈ విషయాలు అందరికీ తెలిసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని నేటిధాత్రిలో వచ్చే సరికి ప్రభుత్వం కూడా సీరియస్‌ గా వుంది. అసలేం జరిగిందన్నదానిపై ఆరా తీస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టు అమలులోనే ఇన్ని లోపాలు ఎదురైతే అసలు పధకం అమలులో అధికారులు ఎన్ని అవాంతరాలు సృష్టిస్తారో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఓ మంచి పధకాన్ని తీసుకొచ్చి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చూస్తుంటే అధికారుల చేసిందేమిటి? అన్న ప్రశ్నలే మిగులుతున్నాయి. ఈ పధకంలో రాజకీయ జోక్యం వుండొద్దని పూర్తి పారదర్శతతో సాగాలని, అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఎంతో బాగుంటుందని నమ్మిన ప్రభుత్వాన్ని పనిగట్టుకొని అబాసు పాలు చేసే పరిస్దితి తెచ్చారు. ఈ పధకం అమలు విషయంలో అధికార బిఆర్‌ఎస్‌ నాయకులను దూరంగా వుంచారు. లేకుంటే ప్రతిపక్షాలు ఇప్పటికే ఎంతో ఆగం చేసేవి. అయినా పధకం సక్సెస్‌ కావొద్దనే ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నాయి. అందుకే పైలెట్‌ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచి ఈ పధకం మీద బురజ జల్లుతూనే వస్తున్నాయి. ఈ పధకం అమలైతే తమ పార్టీలకు ఇక తెలంగాణలో చోటుండదని ఆ నాయకులకు తెలుసు. అందుకే ఈ పధకం విఫల ప్రయత్నం అన్న ప్రచారంతోపాటు, ప్రభుత్వాన్ని నిందిద్దామని చూస్తూనే వున్నాయి. 

ఇలాంటి సమయంలో ఎంతో గొప్ప పధకంగా ప్రజల చేత కీర్తింబడుతున్న ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే పరిస్ధితి అధికారులు తీసుకొచ్చారు. 

ఇక పై నుంచి ఒత్తిళ్లు మొదలు కావడంతో లబ్దిదారులకు సంబంధించినపూర్తి వివరాలు క్రోడీకరించాలని ఓ ప్రత్యేక యాప్‌ తీసుకొచ్చారు. కింది స్ధాయి ఉద్యోగులైన పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలను బలి చేసే ఎత్తుగడలు వేశారు. దీన్ని ఆ ఉద్యోగులు పసిగట్టారు. పంచాయితీ సెక్రెటరీలు నివేధిక మీదే పథకం భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. కాని ఇక్కడే అసలు చిక్కుముడి వుంది. కనీసం ముప్పై శాతం లబ్ధిదారుల వద్ద ఎలాంటి యూనిట్లు లేవు. కిరణాషాపులు లేవు. ప్రభుత్వం ఇచ్చిన బర్రెలులేవు. కార్లు లేవు. ట్రాక్టర్లు లేవు. సెంట్రింగ్‌ సామాను లేదు. టెంటు హౌజ్‌ కు సంబంధించినవి లేవు. పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలు ఏ నివేధిక తయారు చేస్తారు. ఏ ఫోటోలు తీస్తారు.? పై స్ధాయి నుంచి ఒత్తిళ్లతో తిమ్మిని బమ్మిని చేసినట్లు నివేధికలు తయారు చేసినా, ప్రభుత్వం ఏదైనా విచారణకు ఆదేశిస్తే మొదట ఉద్యోగాలు కోల్పోయేది వీళ్లే…అందుకే మేం ఆ పని చేయలేమని పంచాయితీ సెక్రెటరీలు చేతులెత్తేశారు. ఈ మధ్య జిల్లా స్ధాయి అధికారులు జూమ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ మీటింగ్‌లో ఖచ్చితంగా పంచాయితీ సెక్రెటరీలు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతారని తెలిసి, ఆ మీటింగ్‌ రద్దు చేశారు. అంతే కాదు తమ జీవితాలను ఆగం చేసేందుకు దళిత బంధు రూపంలో ఉత్పాతాన్ని సృష్టించి, వాళ్ల ఉద్యోగాలు కాపాడుకునేందుకు పై స్ధాయి అధికారులు కుట్ర పనుతున్నారని పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి వారి సమస్యను తీసుకెళ్లేందుకు కూడా సెక్రెటరీలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

   నిజానికి పై స్ధాయిలో వున్న ఉద్యోగులకు అన్నీ తెలుసు. 

కాని ఏమీ తెలియనట్లు, తామేమీ తప్పు చేయనట్లు, క్షేత్ర స్ధాయిలో ఏం జరిగిందో తెలియనట్లు, నివేధికలు కోరడం వెనుకు ఆంతర్యం తెలియందా? కనీసం 30 నుంచి 40శాతం కూడా లబ్ధిదారులు దళిత బంధు యూనిట్ల కలిగి లేదు. అంతే కాదు కనీసం ఆ యూనిట్లు ఎలా వుంటాయన్నది కూడా వారికి ట్రేడర్లు చూపించలేదు. ఈ పధకం కింద ఇచ్చిన కార్లు వారు నడిపింది లేదు. ఇంటి ముందు పెట్టుకున్నది లేదు. ఆ కార్లతో తిరిగింది లేదు. వారి అవసరాలు, బలహీనతలను సొమ్ముచేసుకునేందుకు వచ్చిన దళారులు ఇచ్చిన అత్తెసరుతో సర్ధుకున్నారు. ఇచ్చింది తీసుకొని కార్లు, ట్రాక్టర్లు వారికి అప్పగించారు. అసలు అధికారులు చేయాల్సిన పని ఏమిటన్నది మర్చిపోయారు. కార్లు, ట్రాక్టర్లు,ఇతర యూనిట్లు అందిజేసినప్పుడే లబ్ధిదారులకు ప్రభుత్వ ఆదేశాలు సూచించాల్సి వుండాల్సింది. కాని అది అధికారుల చేయలేదు. అమాయకులైన దళితులు వాటిని అమ్ముకొని వచ్చిన నాలుగు రూపాయలతో పూట గడుపుకున్నారు. అవి కాస్త అయిపోయినవి. ఇప్పుడు రెండో విడత కోసం ఎదురుచూడాల్సిన పరిస్ధితి వచ్చింది. మరి ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందా? దళితులు ధనవంతులయ్యారా? అధికారులు ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి, తమ వాటాలు తాము తీసుకొని, చేతులు దులుపుకోవడం కోసమేనా? దళిత బంధు అన్న ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలి?

దగా చేసేది మీరేనా…! ఆత్మాభిమానం మీకేనా!!

 

`దళితులనే దోచుకున్నప్పుడు గుర్తులేదా…?

`దళిత అధికారులని అప్పుడు మర్చిపోయారా?

`దళితులను మోసం చేయడం తప్పని తెలియదా?

`దళిత బంధు అమలలో లంచాలు అమానవీయం కాదా?

`దళిత ఉద్యోగులే దళితులను దోచుకుంటుంటే ఎవరికి చెప్పకోవాలి?

`కాపాడాల్సిన స్థానంలో వుండి, కనికరం లేకుండా దోచుకుంటిరి?

`దళిత అధికారులే, దళితుల సొమ్ము కాజేయడం నేరం కాదా?

`సంతకాలకు లంచాలు తీసుకోలేదా?

`ట్రేడర్లు లక్షల నొక్కేస్తున్నది వాస్తవం కాదా?

`షోరూంలు అదనంగా లక్షన్నర లెక్కేయడం నిజం కాదా?

`లబ్ధి దారులను నిండా ముంచింది మీరు కాదా?

`అవినీతి చేసేప్పుడు నిఘా సంస్థలుంటాయని తెలియదా?

`మీడియా వెలుగులోకి తెస్తుందన్న సోయి లేదా?

`లబ్ధి దారులు దుమ్మెత్తి పోస్తున్నారు?

`ఆధారాలతో అన్ని వివరాలు అందిస్తున్నారు?

`తప్పించుకోవడానికి దారి తెలియక మీడియా మీద పడతారా?

`దళితులకు అన్యాయం చేయొద్దని చెప్పడం ఇబ్బందిగా మారిందా?

`ఆత్మాభిమానం ఇప్పుడు గుర్తొచ్చిందా? 

`లంచాలు తీసుకున్నప్పుడు గుర్తు రాలేదా?

`దళిత బంధులో జరిగిన అవకతవకల పై హై కోర్ట్‌ సుమోటోగా కేస్‌ స్వీకరించాలి…

`ఇప్పటికైనా మారండి…దళితులకు అన్యాయం చేయకండి! 

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సహజంగా ప్రభుత్వాలు ఒక గొప్ప పధకాన్ని తీసుకొచ్చే ముందు, దాని అమలు తీరు…సవాళ్లు…ఎదురయ్యే ఇబ్బందులు, సాధకబాధకాలు, నిధుల కూర్పు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని పైలెట్‌ ప్రాజెక్టులు ప్రకటిస్తారు. ఏదో ఒక చోట ముందుగా అమలు చేస్తారు. దాంతో ఆ పధకం మీద ప్రజలకు అవగాహన, పాలకులకు మరింత బాద్యత పెరిగే అవకాశం వుంటుంది. అధికారులు ఎలా పనిచేస్తున్నారు..ఎంత వరకు పనిచేస్తున్నారు..వాళ్ల ఆ పథకం మీద ఎంత దృష్టిపెడుతున్నారు..ప్రజలకు ఏ మేరకు సహకరిస్తున్నారు… వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప విప్లవాత్మక పథకమే దళిత బంధు. ఇది ఎంతటి గొప్ప పధకమో సామాన్య ప్రజలకు అర్ధమైనంతగా అధికారులకు అర్ధం కానట్లుంది. అందుకే ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పైలెట్‌ ప్రాజెక్టు అంటే ఉద్యోగులు ఎంతో చిత్తశుద్దితో పనిచేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. కాని దళిత బంధు విషయంలో ఏం జరుగుతోందో అందరకీ అర్ధమౌతోంది. తెలంగాణలోని దళితుల ఆర్ధిక స్ధితి గతుల్లో మార్పులు తెచ్చి, సమాజంలో వారికి సమున్నతమైన గౌరవం కల్పించి, వ్యాపార రంగాలలో వారిని ప్రోత్సహించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అందుకే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయని ధైర్యం ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేశారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ను ఎంపిక చేశారు. ఎన్నికల వేళ ప్రకటన అంటూ ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ఉపయోగించుకున్నా, తను అనుకున్న లక్ష్యం నెరవేరేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పైలెట్‌ ప్రాజెక్టు కోసం పూర్తి స్ధాయి నిధులు అందజేశారు. ప్రతి దళితుడి బ్యాంక్‌ అకౌంట్లో రూ.10 లక్షలు జమ చేశారు. ఇంత అంకితభావం ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ఇప్పటి వరకు అలాంటి ప్రభుత్వం మరొకటి లేదు. మరి ఇంతే చిత్తశుద్ద అదికారులకు వుందా? ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

తెలంగాణలో అమలుకు నోచుకోవాల్సిన దళిత బంధులో వాటాలు వేసుకొని కమీషన్ల రూపంలో లంచాలు దండుకున్నది అధికారులు. అందులో కింది స్ధాయి అధికారులేమో! 

భయంతో పనిచేస్తే, పై స్దాయి అధికారులేమో! తమనెవరు? ఏం చేస్తారు? అన్న ధైర్యంతో దగా చేశారు…దళితుల సొమ్మును దోచుకున్నారు. ఈ విషయం ఏ లబ్ధిదారుడిని అడిగినా చెబుతాడు. దళిత బంధు పథకం డబ్బులు చేతికి రావడానికి ఎక్కడెక్కడ ఎంత తీసకున్నారన్న విషయం లబ్ధిదారులు పూసగుచ్చినట్లు చెబుతున్నారు. అయినా ఇంకా ఎందుకు భుకాయిస్తున్నారు? దళితుల సొమ్ము దగా మేసి, మేం దళిత అధికారులుగా మా ఆత్మాభిమానం దెబ్బతిన్నదంటారా? ఈ మాటలు దళితులే వింటే ఏమనుకుంటారన్న ఆలోచన కూడా లేదా? దళితుల సొమ్ము రూపాయి కూడా తినకుండా చూడాల్సిన బాధ్యత దళిత అధికారులు తీసుకోవాలి. ఆ సొమ్ముకు భద్రంగా దళితులకు అందేందుకు సహకరించాలి. ఎవరైనా గద్దల్లా దళిత బంధు సొమ్ము కాజేయాలని చూస్తే వారి భరతం పట్టాలి. ఇదీ దళిత అదికారులుగా చేయాల్సిన పనిని విస్మరించి, దళిత బంధు లబ్ధిదారులకు సంతకాలు చేసేందుకే వేలాది రూపాయలు వసూలు చేసి, వాళ్లేవరో ఊళ్లు పంచుకున్నట్లు దళితబంధు పథకంలో అందరూ కలిసి కోట్లాది రూపాయలు లూటీ చేశారన్నదైనా గుర్తుందా? 

 నేటిధాత్రి మీద కేసు వేస్తారా? వేయండి? ఏమని వేస్తారో వేస్తే అప్పుడు తెలుస్తుంది?

 నేటిధాత్రి అదే దళితుల సొమ్ము దగా కోరుల పాలైపోతోందని, వారిని చైతన్యం చేసే యజ్ఞం చేస్తోంది. వారి సొమ్ము దారి మల్లకుండా చూస్తోంది. ఎవరెవరు ఎంతెంత వాటాలేసుకొని పంచుకుతిన్నది చెబుతోంది. ట్రేడర్లనుంచి, షోరూం నుంచి జిఎస్టీల పేరుతో దోచుకుంటున్న సంగతి ప్రతి దళితుడికి తెలుసు. దళితుల్లో ఇంకా అమాయకులున్నారనే…వారి ఎదుగుదలకు ఈ సమాజం ఎలాగూ సహకరించదని, ప్రోత్సాహం అసలే వుండదని, ప్రభుత్వమే దళితులు సంక్షేమం కోసం ఆలోచించి దళిత బంధు తీసుకొచ్చింది. కనీసం ఆ పథకం ఉద్దేశ్యం కూడా అర్ధం చేసుకోలేక, ఉన్నతోద్యోగులై వుండి దళితుల సొమ్ముకు ఆశపడ్డవారు కూడా ఆత్మాభిమానం గురించి మాట్లాడితే ఏలా వుంటుందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజానికి దళితులమని చెప్పుకుంటున్న ఉన్నతోద్యోగులు తాము చేసింది తప్పే అనుకొని, ఇకపై ఇలాంటి పొరపాట్లు జరక్కుండా చూసుకుంటామని చెప్పాలిందిపోయి, నేటిధాత్రి మీద కేసులు వేస్తామని బెదిరిస్తే సరిపోతుందా? నిజం నిప్పులాంటిది…అది దాగదు…తప్పు చేసిన వారిని ఊరికే వదిలిపెట్టదు. 

 ఉద్యోగులుగా ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు సరిపోవడం లేదా?

 ఒక పైలెట్‌ ప్రాజెక్టు ప్రభుత్వం అమలు చేసినప్పుడు దానిపై ఎంత మంది నిఘా వుంటుందో తెలియకుండా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారా? పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, తాము దళితుల దగ్గర తీసుకుంటున్న సొమ్ము గురించి ఎవరికీ తెలియదనుకున్నారా? చేయాల్సిందంతా చేసి, దళితులను దగా చేసి, మేం మా మనోభావాలు దెబ్బతిన్నాయనంటే జనం నివ్విపోతారు…ఇప్పటికైనా హుందాగా వ్యవహరించండి. ప్రభుత్వం ఎంతో గొప్ప పథకాన్ని అమలు చేసే బాధ్యత మీకు అప్పగించినందుకు ఎంతో పుణ్యంగా భావించాలి. తమ చేతుల మీదుగా కొన్ని వేల దళిత కుటుంబాలు ఇప్పుడు సంతోషంగా వున్నాయని చెప్పుకునే స్ధితి కల్పించబడాలి. ఆ హుజూరాబాద్‌లోని దళితులంతా ఉద్యోగులకు చేతులెత్తి మొక్కేలా వుండాలి. ఎక్కడైనా కనిపిస్తే ప్రభుత్వం మా జీవితాలకు భరోసా కల్పిస్తే మీరు మాకు దారి చూపారని చెప్పుకోగలగాలి. అంతే కాని నిత్యం తిట్టుకునేలా వ్యవహరించారు. ఇప్పటికే ఎంతో మంది దళితులు తమ సొమ్ము తిన్న అధికారులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. శాపనార్దాలు పెడుతున్నారు. ముందు అవి వినండి…! అప్పుడు నేటిధాత్రి గురించి ఆలోచించండి…ఆత్మాభిమానం గురించి మాట్లాడండి!!

శంకరయ్య…’మనీ’కింకరుడయ్యా!? శంకరయ్య ఒత్తిళ్లు..! టిపిఎస్‌ లకు తిట్లు?

 

`ఎక్కడిక్కడ జనం చీవాట్లు!?

`పాపం అడకత్తెరలో నలుగుతున్న టిపిఎస్‌ లు.

`లంచాలు తింటున్నారని శాపనార్థాలు?

` క్షేత్ర స్థాయిలో జనం గగ్గోలు…

`జోనల్‌ కమీషనర్‌ ఆదేశాల అమలులో చుక్కలు చూస్తున్న ఉద్యోగులు.

`సికింద్రాబాద్‌ లో ఇలా చేసే శేరిలింగంపల్లి కొచ్చారు?

` శేరి లింగంపల్లి లో మరింత సంపాదనకు శంకరయ్య ఎగబడ్డాడు?

` అధికారులను రాచి రంపానపెడుతున్నాడు?

`మింగలేక కక్కలేక అధికారులు మధనపడుతున్నారు?

`జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వల్ల ఎమ్మెల్యే గాంధీ అబాసుపాలౌతున్నారు?

`ఏరి కోరి తెచ్చుకున్న ఎమ్మెల్యేకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు?

`జోనల్‌ కమీషనర్‌ పనుల వల్ల ఎమ్మెల్యే కు ఎదురుకానున్న తిప్పలు?

`ఎన్నికలలో ఎమ్మెల్యే కు ఇబ్బందులు తప్పవు?

ఉద్యోగం వచ్చేదాకా జీవితం… సమాజం…జనం…సేవ… ఇలాంటి ఎన్నో ఆలోచనలు చేస్తారు. కొంత మంది అదే జీవితాంతం అనుసరిస్తారు. కొందరు అవన్నీ మర్చిపోతారు…సంపాదనకు ఎగబడతారు. ఉద్యోగం చేస్తూ ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటూ, పనులు చేయడానికి నా కేంటి? అనడం మొదలు పెడతారు…మొహమాటం లేకుండా ఎంతిస్తావ్‌ అని బేరం పెడుతుంటారు…ఇటీవల కాలంలో ఆ బేరం కూడా మారిపోయింది. ఇంతిస్తే గాని పని కాదని చెప్పేస్తున్నారు…పని కావాల్సిన ప్రజలు అంతివ్వలేను మహా ప్రభో అని బ్రతిమిలాడుకుండున్నారు. అయినా కొందరు అధికారులు కనికరం అన్నది వారి దరిదాపుల్లో లేనట్లు, వారి డిక్షనరీ లో లేనట్లు, నా మాటే శాసనమన్నట్లు వసూలు చేస్తున్నారు. జేబులు నింపుకుంటున్నారు…కోట్లు కూడబెట్డుకుంటున్నారు. అలాంటి వారిలో జిహెచ్‌ఎంసి శేరిలింగంపల్లి జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య ఒకరు? అని జనం చెప్పుకుంటున్న మాట…ఉద్యోగుల ఆవేదన. 

ఎక్కడిక్కడ జనం చీవాట్లు!?

 జోనల్‌ కమీషనర్‌ పెట్టే టార్గెట్ల మూలంగా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు టార్గెట్లు పెడుతూ, జనాన్ని ఇబ్బందులు పెట్టినట్లే ఉద్యోగులను కూడా జోనల్‌ కమీషనర్‌ రోజుకింత వారానికింత అని ఆర్డర్‌ వేస్తాడు. దాంతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగ సిబ్బంది యాతన అంతా ఇంతా కాదు…జోనల్‌ కమీషనర్‌ మాట కాదనలేక, ఎదురు చెప్పలేక, మా వల్ల కాదనలేక, ఉద్యోగం చేయడం తప్పని సరై వారు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రజలతో పంచాయతీ పెట్టుకునేది అధికారులు, తిట్లు తినేది అధికారులు. పాపం అడకత్తెరలో నలుగుతున్న టిపిఎస్‌ లు. 

తాజాగా శేరి లింగంపల్లిలో నిర్మాణంలో వున్న ఓ బిల్డింగ్‌ కూల్చివేసేందుకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వచ్చారు.  

దాంతో స్థానిక ప్రజలు, ఆ నిర్మాణానికి చెందిన వ్యక్తులు టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని తిట్టిన తిట్టు తిట్డకుండా తిట్టారు. ఇప్పటికే ఇవ్వాల్సిన లంచాలు ఇచ్చాము…ఇంకా ఎన్ని సార్లు లంచాలు లంచాలివ్వాలని దూషించారు. శాపనార్థాలు పెట్టారు. నిజానికి ఆ బిల్డింగ్‌ నిర్మాణం అక్రమమే అయితే నిర్మాణం మొదలైనప్పుడే అధికారులు అడ్డుకోవాలి. నిర్మాణానికి అవసరమైన హద్దులు ఇవ్వాలి. అంతే కాని నిర్మాణానికి ముందు అన్ని రకాల అనుమతులు ఇచ్చి, తీసుకోవాల్సినంత తీసుకొని, మరింత లాగేందు నిర్మాణం జరగకుండా అడ్డుకోవడం సరైంది కాదు. కానీ ఇలా సగం నిర్మాణం జరిగిన తర్వాత అడ్డుకుంటేనే అధికారులు అడిగినంత ముట్డజెబుతారు. ఇదీ జిహెచ్‌ఎంసి అధికారులు అనుసరించే విధానం. అలాగే శేరిలింగంపల్లిలోనూ జరుగుతోంది. గతంలో ఇక్కడ అలాంటి వాతావరణం లేదని ప్రజలు, అధికారులు కూడా అంటున్నారు. జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వచ్చిన తర్వాతే ఇలాంటి పనులెక్కువయ్యాయని వాపోతున్నారు. క్షేత్ర స్థాయిలో జనం గగ్గోలు…జోనల్‌ కమీషనర్‌ ఆదేశాల అమలులో టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది చుక్కలు చూస్తున్నారు. 

సికింద్రాబాద్‌ లో ఇలా చేసే శేరిలింగంపల్లి కొచ్చారు?

 గతంలో ఇదే శంకరయ్య సికింద్రాబాద్‌ జోనల్‌ కమీషనర్‌ గా పనిచేసిన సమయంలో అక్కడ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు దీపావళి పండగ సందర్భంగా తలా ఓ పది లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారట…అధికారులు తమ వల్ల కాదని తెలిసినా, ఆయనకు ఎదురు చెప్పలేక తలాడిరచారట…కానీ ఓ మహిళా టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఎదురుతిరిగిందట…ఏకంగా మంత్రి కేటిఆర్‌ దృష్టికి ఈ సమస్య వెల్లేలా చేసిందట. దాంతో శంకరయ్య తిక్క కుదిరిందనే అందరూ అనుకున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తప్పించి, శేరి లింగంపల్లి జోన్‌ కు మార్చడంతో ఇక శంకరయ్య అవినీతికి పుల్‌ స్టాప్‌ పడుతుందనుకున్నారట…అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఏరికోరి శంకరయ్య కు శేరి లింగంపల్లి లో పోస్టింగ్‌ వేయించారట…శంకరయ్య తీరు ఏ మాత్రం మారలేదు. నిజానికి సికింద్రాబాద్‌ లో ఆమ్థానీ తక్కువ. ఇక్కడ నగరం విస్తరిస్తున్నందున రోజువారీ సంపాదన శంకరయ్య కు పెరిగిందనేది అధికారులు చెప్పుకునే మాట. 

శేరి లింగంపల్లి లో మరింత సంపాదనకు శంకరయ్య ఎగబడ్డాడు? 

అధికారులను రాచి రంపానపెడుతున్నాడు? అనేది ఇక్కడ ప్రధాన వాదన. మింగలేక కక్కలేక అధికారులు మధనపడుతున్నారు? ఇక ఇదిలా వుంటే జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వల్ల ఎమ్మెల్యే గాంధీ అబాసుపాలౌతున్నారు? ఏరి కోరి తెచ్చుకున్న ఎమ్మెల్యేకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు?

 జోనల్‌ కమీషనర్‌ పనుల వల్ల ఎమ్మెల్యే కు ఎదురుకానున్న తిప్పలు? ఎన్నికలలో ఎమ్మెల్యే కు ఇబ్బందులు తప్పవు? జనం చెబుతున్నారు.

దళిత బంధు లో దగా.. దగా!

`దళితుల సొమ్ముకు ఎర!

`పథకం అమలుకు అధికారుల పొగ?

` అటు అధికారులు…ఇటు ట్రేడర్లు!

`కారుకు షోరూం కొటేషన్‌ లక్షన్నర అదనం…

`ట్రాక్టర్ల్‌ కు కూడా అంతే లక్షన్నర…

`మధ్య వర్తులంతా షోరూమ్‌ యజమానులే…

`వాటాల పంపకాలు వారి చేతుల మీదుగానే!

`ఇటు ఇస్తున్నారు…అటు అమ్ముకునే దారి చూపిస్తున్నారు.

`కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు?

`దళిత బంధును పక్కదారి పట్టిస్తున్నారు?

`పథకాన్ని నీరుగారుస్తున్నారు?

`సెంట్రింగ్‌ యూనిట్‌ లో రెండు లక్షలు కమీషన్‌…

` ప్రతి ఫైలుపై సంతకానికి ఎస్సీ కార్పొరేషన్‌ అధికారికి రూ. 30 వేలు.

`ప్రతి వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ కు ఆర్టీవోకు రూ. 13 వేలు.

` రాత్రికి రాత్రే లీడర్ల ట్రేడిరగ్‌ లైసెన్స్‌…

`దళిత బంధు అమలుపై ఇంటలిజెన్స్‌ ఆరా…

` రెండో విడతలో అధికారులు ఏది చెబితే అదే తీసుకోవాలి?

`మొదటి విడతలో తీసుకోని వారు వాహనాలే తీసుకోవాలి?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సమాజం ఎటుపోతోంది? దళితుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యతను ఎందుకు విస్మరిస్తోంది? ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రారంభించినా, ఆచరించి, అమలు చేయాల్సిన ఉద్యోగ వ్యవస్ధలో కొందరి వల్ల లక్ష్యం ఎందుకు నిర్వీర్యమౌతోంది? అన్న ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి? అసలు దళిత బంధు సొమ్ముకు అధికారులు ఆశపడడం ఏమిటి? దళారులు కాజేయాలని చూడడమేమిటి? ఎవరికి వారు తమ సొమ్మే అన్నట్లు వాటాలు వేసుకోవడమేమిటి? సంతకాలు పెట్టాలంటే ఇంత ఇవ్వాలని అధికారులు షరతులు పెట్టడమేమిటి? లంచం ఇస్తే తప్ప సంతకం పెట్టమన్నంత ధోరణి ప్రదర్శించడమేమిటి? మొత్తంగా దళిత బంధు లాంటి గొప్ప పథకం అమలో ఇంత దోపిడేంది? పైలెట్‌ ప్రాజెక్టన్న భయం కూడా అధికారుల్లో లేకపోవడం ఏమిటి?  

 సహజంగా ప్రైవేటు వ్యక్తులు షోరూంలలో కారు, ట్రాకర్‌, ఏ వాహనం కొన్నా, ప్రభుత్వ వర్గాలు కార్లు కొన్నా ఒకటే రేటు వుండాలి. 

అందుకు అవసరమైన కొటేషనే వేసి ఇవ్వాలి. ఒక వేళ తేడా ఏమైనా వుంటే అది వెయ్యో…రెండు వేలో తేడా వుంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అంతే కాదు పెద్దఎత్తున కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్న సమయంలో మరింత తగ్గించి ఇవ్వాలి. ఇంతకు తగ్గించి ఇస్తేనే మేం కార్లు, ట్రాక్టర్లు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులే షరతులు విధించాలి. అది కాకుండా షోరూం లెందుకు రేట్లు పెంచి కొటేషన్లు ఇస్తున్నాయన్న అనుమానం అందరికీ వస్తుంది? కాని అసలు తిరకాసు ఇక్కడే వుంది? ఇది అధికారులు ఆడుతున్న డ్రామా అన్నది అందరికీ తెలిసిందే…కాని అడిగిన వారు లేదు? ప్రశ్నించిన వారు లేదు? అధికార వ్యవస్ధలో కింది నుంచి పై స్ధాయి దాకా అందరికీ తెలిసి జరగుతుందే? అయినా ఇంత దోపిడా? ఒక వాహనం మీద సుమారు రూ.లక్షన్నర ఎక్కువ చెల్లించడం అంటే లబ్ధిదారుడిని దోపిడీ చేయడం. ప్రభుత్వాన్ని మోసం చేయడం కాదా? ఇది చట్టరిత్యా నేరం కాదా? అయినా ఇంతగా అధికారులు ఎలా భరితెగిస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమంటే కూడా భయం లేకుండాపోయిందా? ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తుందన్న ఆలోచన కూడ లేదా? జైలుకెళ్లాల్సి వస్తుందన్న భయం కూడా లేదా? ఉద్యోగాలు పోయినా ఫరవాలేదన్న ధైర్యమా? ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారులే ప్రభుత్వ ధనం దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారు. ఇందులో తమపాత్ర కనిపించంకుండా షోరూం యజమానులు, అక్కడ పనిచేసే ఉద్యోగులను మధ్యవర్తులుగా మార్చి సొమ్మును పంచుకుంటున్నారు. డైరెక్టుగా అంత పెద్ద అమౌంటు తీసుకుంటున్నట్లు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా కోట్లాది రూపాయలను నొక్కేస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సమారు 4వేల కార్లు, 4వేల ట్రాక్టర్లకు లబ్దిదారులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో మెజార్టీ లబ్ధిదారులకు వాహనాలు అందించారు. ఆ వాహనాల మీద అదనంగా వేసిన కొటేషన్‌ సొమ్మును అధికారుల పంచుకున్నారు. ఇంత భహిరంగంగా దోపిడీ సాగిస్తున్నారు. ఇదిలా వుంటే ఇక రెండు జిల్లాలకు చెందిన ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు ప్రతి అప్లికేషన్‌ అప్రూవల్‌కు లబ్దిదారుల నుంచి రూ.30వేలు వసూలు చేసినట్లు సమాచారం. లబ్ధిదారుల్లో ఉన్నత విద్యావంతులున్నారు. అమాయకులైన లబ్ధిదారులనుంచే కాదు…ఉన్నత విద్యావంతులైన వారి నుంచి కూడా ముక్కుపిండి వసూలు చేసినట్లు రూ.30వేలు వసూలు చేశారని తెలుస్తోంది. అంటే తమ సంతకానికి వున్న పవర్‌ అని చెప్పకనే చెబుతున్నట్లు లెక్క. 

ఇక ఆ వాహనాల రిజిస్రేషన్‌ అన్నది ఆర్టీవో ఉచితంగానే చేయాలి.

 కాని ఆయనేం తక్కువ తిన్నారా? ఆయన కూడా ప్రతి వాహనానికి రూ.13వేలు వసూలు చేశారని లబ్ధిదారులు చెతున్నారు. పైగా ఎవరైనా లబ్ధిదారులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే, పుణ్యానికి వస్తేనే ఇలా మాట్లాడుతున్నావ్‌…కష్టపడితే ఏం మాట్లాడతావో? అంటూ బెదిరించి మరీ డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్నారు. సరే అన్ని అవాంతరాలు దాటుకొని వాహనాలు తెచ్చుకున్నా ప్రతి వాడి కన్నూ ఆ వాహానాల మీదే…ఎలాగైనా వారి దగ్గరనుంచి ఆ వాహనాలు లేకుండా చేశారు..పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌ లోని వివిధ జిల్లాల నుంచి వచ్చి ట్రాక్టర్లు, కార్లు కొనుగోలు చేశారు. లబ్ధిదారులకు రెండు, మూడు లక్షలు చెతిలో పెట్టి వాహానాలు లేకుండా చేశారు. లబ్ధిదారుల బలహీనతలను ఆసరా చేసుకొని లీడర్లు, అధికారులు చేసిన పని వల్ల దళిత బంధురాకముందు దళితుల పరిస్దితి ఎలావుందో…ఇప్పుడూ అదే పరిస్దితి వుంది. అసలు దళిత బంధు వాహనాలు అమ్మొద్దు…ఎవరూ ఇతరులు వారి వద్ద నుంచి కొనుగోల చేయెద్దు. మరి ఎలా ఈ తతంగం అంతా జరుగుతోంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టిపెట్టాలి. లబ్దిదారులకు నగదు ఆశ చూపించి, సొమ్ము చేసుకున్న వారి వద్దనుంచి వాహనాలు వసూలు చేసి తిరిగి, లబ్ధిదారులకు అందించాలి. అప్పుడుగాని ఇలా ప్రభుత్వ పథకాల దుర్వినియోగానికి ఎవరూ పాల్పడరు…

   ఇక సెంట్రింగ్‌ యూనిట్‌ విషయంలో మరీ ఘోరం…

సెంట్రింగ్‌ పేరు మీద రూ.8లక్షలు డ్రా చేయించి తీసుకుంటున్న ట్రేడర్లు, లబ్ధిదారులకు రూ.6లక్షలు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి లబ్ధిదారుని వద్ద నుంచి రూ.2లక్షలు కాజేస్తున్నారు. అధికారులకు వాటాలు పంచేస్తున్నారు. ఇదేనా ట్రేడర్ల ముసుగులో నాయకులు అడుతున్న నాటకం. అటు నాయకులు మోసం చేసి, ఇటు అధికారుల మోసం చేసి, దళితులకు న్యాయంగా అందాల్సిన సొమ్మును మాయంచేయడం ఎంత దుర్మార్గం. లబ్ధిదారులకు సెంట్రింగ్‌ యూనిట్‌ రూ.8లక్షల విలువ చూపించాల్సిందిపోయి, రూ.6లక్షలు చేతిలో పెట్టడమేమిటి? రూ.2 లక్షలు తీసుకోవడమేమిటి? ఇంత దర్జాగా దళిత బంధు సొమ్ము నొక్కేయడమేమిటి? మొదటి విడతలో దండుకోవాల్సినంత దండుకొని కోట్లు కొల్లగొట్టిన అధికారులు, రెండో విడతలో ఎలా నొక్కాలి? ఎంత నొక్కాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. పైగా మొదటి విడతలో ఎలాంటి లబ్ధి పొందని వారి నుంచి ఎలా వసూలు చేయాలన్నదానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఓ మండలంలో లబ్ధిదారురాలైన ఓ మహిళ తనకు కెమెరా కావాలని, తాను ఫోటోగ్రఫీ వృత్తిని నిర్వహించుకుంటానని అధికారుల దృష్టికి తీసుకెళ్తే, కారు తీసుకో..అని ఉచిత సలహా ఇచ్చారట. అంతే కాదు కారు తీసుకుంటామంటేనే సంతకం చేస్తామని కూడా చెప్పారట. అంటే ఫోటో కెమెరా విషయంలో ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. అదే కారు తీసుకుంటే షోరూం నుంచి నేరుగా వాటా అందే అవకాశం వుంది. ఇప్పటికే దళిత బంధులో దోచుకోవాల్సినంత దోచుకున్నారు…ఇంకా అడుగు బొడుగు వున్నవాటిని కూడా వదలమని తెగించి చెప్పేస్తున్నంత పని చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించాల్సివుంది.

దళిత బంధు ట్రాక్టర్లు ఆంధ్రాలో..! హర్యానా నుంచి తెచ్చిన బర్రెలు స్వర్గంలో!!

`ఇదీ దళిత బంధు అమలు అధికారుల నిర్వాకం.

`ఏసి. గదుల్లో కూర్చొని అధికారులు చేసిన అమలు తీరుకు నిదర్శనం.

`దళిత బంధు వాహనాలు అమ్మినా, కొన్నా నేరమే!

`అయినా ఎలా కొన్నారు? అమ్మకాన్ని అధికారులు ఎలా ప్రోత్సహించారు?

`దళిత బంధు ట్రాక్టర్లలో 60 శాతం ఆంద్రాకు చెందిన వ్యక్తులు ఎలా కొనుగోలు చేశారు?

`ట్రాక్టర్లు తరలుతుంటే అధికారులు ఏం చేశారు?

` రెండు జిల్లాల కలెక్టర్లు ఏం పర్యవేక్షిస్తున్నారు?

`ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు నిర్వాకం ఎందుకు కనపడలేదు?

`అగ్రికల్చర్‌ ఏడి. ట్రాక్టరు షోరూం యజమానిని కమీషన్‌ కోసం బెదిరింపులేమిటి?

`ఇన్ని ట్రాక్టర్ల అమ్మకానికి అవకాశం కల్పిస్తే కమీషన్‌ ఇవ్వవా? గద్దించడమేమిటి?

`వాహనాల మీద సిఎం. స్టిక్కర్‌, దళిత బంధు అని ఎందుకు రాయలేదు?

`లబ్ధి దారులు బర్రెలు మేమే కొనుక్కుంటామంటే ఎందుకు అధికారులు సహకరించలేదు?

`కరీంనగర్‌ డైరీ వాళ్లు ఎందుకు ఒప్పుకోలేదు?

`గతంలో ఉత్తర భారత్‌ నుంచి గొర్రెల కొనుగోలు అనుభవాలున్నాయి.

`అయినా బర్రెల విషయంలో అదే ఎందుకు అనుసరించారు?

`గేదెల మరణానికి కారకులెవరు?

`వాతావరణ మార్పులు పడక బర్రెలు చనిపోయాయి.

` ఇప్పటికైనా మేం చెప్పినట్లు వినండి…అని దళిత రైతులు కోరుతున్నారు.

`బర్రెలు ఇవ్వడం కుదరదు…మరో ఇతర యూనిట్లు పెట్డుకోమని కొత్తగా అధికారుల ఒత్తిళ్లు?

`ఇప్పుడు గైడ్‌ లైన్స్‌ అడ్డం రావడం లేదా?

`పాలు పితకడం, వ్యవసాయ సాగు తప్ప మాకేం పనిరాదన్నా అధికారులు వినడం లేదు?

`లబ్ధి దారుల మాటకు విలువలేదు?

`దళిత బంధు ఆగమౌతున్నా అధికారులకు పట్టింపు లేదు?

`లబ్ధి దారులు చెప్పినట్లు చేస్తే అధికారులకు కమీషన్లు రావు?

`ఏజెన్సీలకు డైరెక్ట్‌ గానే ఫోన్లు చేసి అధికారులు కమీషన్లు వసూలు చేసుకున్నారు?

`కాల్‌ రికార్డులౌతాయన్న భయం కూడా లేదు?

`దళిత బంధు తో కోట్లు దండుకున్నారు?

`లబ్ధి దారులను ఆగం చేశారు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సహజంగా పాలకులు మోచేతికి బెల్లం పెట్టి నాకిస్తారని గతంలో చెప్పుకోవడం విన్నాం. ఎదో ఒక సంక్షేమ పధకం ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకోవడం చూశాం…ప్రజల జీవితాలు వెలిగిపోతున్నాయని చెప్పుకున్న సందర్భాలు అనేకం. కాని తెలంగాణ సాధించి, ప్రజల ఆదరణతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటించి, అమలు చేస్తున్న పధకాలు అన్నీ ఇన్నీ కావు. అందులో ఎంతో ప్రాముఖ్యమైన, ప్రత్యేకమైన, ప్రధానమైన పధకం దళిత బంధు. మొదటి సారి తెలంగాణలో అట్టడుగు వర్గాలకు న్యాయం చూస్తున్నాం. అనేక పధకాల అమలు అనుభవిస్తున్నారు. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అనేక సదుపాయలు అందుకుంటున్నారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ చేయూతనందుకుంటున్నారు. అలాగే దళితుల జీవితాల్లో సంపూర్ణంగా వెలుగులు నిండాలని ఆశించిన ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్‌. అందుకు అవసరమైన గొప్ప పధకానికి రూపకల్పన చేసి, ప్రకటించి అమలు చేస్తున్నారు. దళితులకు కొత్త జీవితాలు ప్రసాదిస్తున్నారు. గతంలో దళితులకు ఎంతో కొంత రుణాలు ఇవ్వడమే గొప్పగా చెప్పుకునేవారు. కాని ఇప్పుడు పైసా కూడా ప్రభుత్వానికి తిరిగి కట్టకుండా, పూర్తి సబ్సిడీతో దళిత బంధు పధకంలో రూ.10లక్షల వరకు అందజేస్తున్నారు. లబ్ధిదారుల కోరిక మేరకు, వారి సూచనలను అనుసరించి ప్రభుత్వం వారి ప్రావీణ్యాన్ని బట్టి యూనిట్లను అందజేస్తున్నారు. వారికి ఉపాధి మార్గం చూపిస్తున్నారు. వాటిలో అనేకం వున్నాయి. రైతులుగా పాడిని కావాలనుకుంటున్నవారికి గేదెలు అందజేస్తున్నారు. వ్యవసాయ పనిముట్టుగా పనిచేసే హార్వెస్టర్లు ఇస్తున్నారు. ట్రాక్టర్లు అందజేస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ వున్నవారికి కార్లు ఇస్తున్నారు. కిరణా షాపు నిర్వహిస్తామనుకునేవారికి ఆ సదుపాయం కల్పిస్తున్నారు. సెల్‌ఫోన్‌ షాపులు, ఫర్నిచర్‌ షాపులు, సెంట్రింగ్‌ వర్కులు, టెంట్‌ హౌస్‌లు ఇలా అనేక రూపాల్లో ఉపాది చూపిస్తున్నారు. కాని కొందరు అధికారులు ఈ పధకాన్ని పక్కదోవ పట్టించారు. ఆ పధకం అమలులో చీకట్లు నింపారు. సహజంగా ఎస్సీ కార్పోరేషన్‌ అధికారరులు అమయాకులైన దళితుల్లో మరింత చైతన్యం నింపాలి. వారి జీవితాలకు ఒక మార్గదర్శకంగా నిలవాలి. కాని కొందరు అధికారులు, ముఖ్యంగా ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు చేసిన నిర్వాకం మూలంగా దళిత బంధు వరంగా కాకుంగా, శాపంగా పరిణమించేలా చేస్తున్నారు. వారికి అందాల్సిన సొమ్మును కాజేస్తున్నారు. ఎంతో బాధ్యతగా దళిత బంధును అమలు చేయాల్సిన అధికారుల తీరు బాధాకరం. అత్యంత దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే దుర్మార్గం. పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు అధికారుల తీరు మారడం లేదు. అవినీతి ఆపడం లేదు. అక్రమ సంపాదన మానుకోవడం లేదు. పథకాన్ని నిర్వీర్యం చేసే పన్నాగం పన్నుతున్నారు. ప్రజల పన్నులతో వచ్చే జీతాలు తీసుకుంటూ, ప్రజలకే సున్నం పెడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. 

ఇక్కడు ముఖ్యంగా రెండు విషయాలు చర్చించుకోవాల్సిన అసవరం వుంది.

ప్రభుత్వం పేద దళితుల్లో సాగుతోపాటు, పాడిని చూసుకునేవారి కోరిక మేరకు 8 గేదెలు అందజేయాలని నిర్ణయించింది. అందులో హుజూరాబాద్‌ నియోజక వర్గంలో వేలాది మందిరైతులకు గెదెలు సరఫరా చేశారు. మొదటి విడతగా ముందు 4 గేదెలను అందజేశారు. ఇంత వరకు బాగానే వుంది. కాని అసలు తిరకాసు ఇక్కడే వుంది. ప్రభుత్వం అనుకున్నది ఒకటి. కాని అధికారులు ఆచరించింది మరొకటి. లబ్ధిదారులు మొదటగా గేదెల కోసం షెడ్‌ ఏర్పాటు చేసుకోవాలి. అందుకు అవసరమైన సొమ్మును లబ్ధిదారులు బ్యాంకునుంచి డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. షెడ్డు నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు తీసుకొని, లబ్ధిదారులు కరీంనగర్‌ డైరీకి అందజేశారు. కరీంనగర్‌ డైరీ అధికారులు రైతులను విడతల వారీగా హర్యానా తీసుకెళ్లి, గెదెలు ఇప్పించారు. కాని ఆ గేదెలు మన వాతావరణంలో మనుగడ సాగిస్తాయా?లేదా? అన్నది ఆలోచించలేదు. ఉత్తర బారత ప్రాంతానికి, మన ప్రాంతానికి వాతావరణంలో ఎంతో వ్యత్యాసం వుంటుంది. అందుకే లబ్ధిదారులైన రైతులు తాము ఇక్కడే గేదెలను కొనుగోలు చేసుకుంటామని చెప్పారు. అయినా అధికారులు వినలేదు. ఏ గేదె ఎక్కువ పాలు ఇస్తుందో… ఎంత ఆరోగ్యంగా వుందో…ఎంత వయసు వుందో…ఇలాంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని ఇక్కడే కొనుగోలు చేసుకుంటామని ఎంత మొత్తుకున్నా అధికారులు వినలేదు. గతంలో కురుమలు, యాదవులకు గొర్రెల యూనిట్లు ప్రభుత్వం అందజేసింది. అప్పుడు కూడా అధికారుల అత్యుత్సాహంతో ఇలాంటి పరిస్దితే ఎదురైంది. రైతులను తీసుకెళ్లి ఉత్తర ప్రదేశ్‌ లాంటి ప్రాంతాల నుంచి గొర్రెలు కొనుగోలు చేసి తెచ్చారు. వాటిలో చాలా వరకు గొర్రెలు మరణించాయి. గొర్రెలకు ఇన్యూరెన్సు వుండడం మూలంగా వారికి పెద్దగా నష్టం జరగలేదు. కాని గేదెలకు అలాంటి అవకాశం కల్పించబడలేదు. దాంతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. గేదెలను హర్యానా నుంచి కొనుగోలు చేసిన సందర్భంలో లబ్ధిదారులు ఇక్కడే కొనుగోలు చేస్తామంటూ రూల్స్‌, రెగ్యులేషన్లు అంటూ కొత్త కొత్త బాష్యాలు చెప్పిన అధికారులు, ఇప్పుడు కూడా వారి మాటలు వినడం లేదు. కాని గేదల స్దానంలో మరో రకమైన యూనిట్‌ ఎంపిక చేసుకొమ్మని కొత్త సలహాలు ఇస్తున్నారట…అంటే ఇప్పుడు రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్లు అతిక్రమించొచ్చా? అందుకు అధికారులకు ప్రభుత్వమేమైనా మార్గదర్శకాలు జారీ చేసిందా? అదే నిజమైతే గేదెలను ఇక్కడే కొనుగోలు చేసేలా కొత్త గైడ్‌ లైన్స్‌ ఇస్తుందే గాని, ఇతర యూనిట్లను ఎంపిక చేసుకొమ్మని చెబుతుందా? ఇలా ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసేంందుకు, కమీషన్లలో కొత్త దారులు వెతుక్కునేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారు తప్ప, లబ్ధిదారులకు మేలు చేయాలన్న సోయి మాత్రం ఒక్క శాతం కూడా లేదన్న సంగతి తేలిపోయింది. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగవు. ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పడవు. 

ఇక ట్రాక్టర్ల మాయాజాలం మరో రకమైంది. 

హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో కొన్ని వందల ట్రాక్టర్లు దళిత బంధు కింద అందజేయడం జరిగింది. మరి ఆ టాక్టర్లు ఇప్పుడు లబ్ధిదారుల వద్ద వున్నాయా? లేదా అన్న వాటిని చూసుకునే తీరిక అధికారులకు లేదు. అంతే కాదు ఏ లబ్ధిదారుడికైనా అందిన ప్రతి యూనిట్‌ విషయంలోనూ వారికి ఉపాధి ఎంత లభిస్తోంది. ఒక వేళ లేకపోతే, వారికి ఎలా ఉపాధి కల్పించాలన్నది కూడా ప్రభుత్వ ఉద్యోగులే చొరవ తీసుకోవాలన్నది రూలు. కాని ఎస్పీ కార్పోరేషన్‌ ఉద్యోగులు ట్రాక్టర్లు ఇచేసి చేతులెత్తేశారు. వాటిని అమ్ముకోమ్మని చెప్పి, చేతులు దులుపుకుంటున్నారు. అసలు ఇక్కడ ఎంతో ముఖ్యమైన విషయాలను అధికారులు గాలికి వదిలేశారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి యూనిట్‌ మీద దళిత బంధు స్కీమ్‌ పేరు ఖచ్చితంగా రాయించాలి. పైగా ముఖ్యమంత్రి ఫోటో స్టిక్కర్‌ ఖచ్చితంగా వుండాలి. అది కారైనా, ట్రాక్టరైనా,హార్వెస్టరైనా మరేదైనా సరే, దళిత బంధు స్కీమ్‌ కనిపించేలా వుండాలి. కాని అధికారులు తూతూ మంత్రంగా మాత్రమే వాటిని చూసుకున్నారు. మిగతావాటికి వదిలేశారు. దళిత బంధు స్కీమ్‌ కింద లబ్ధిదారులకు అందజేసిన ఏ వాహనమైనా, మరే ఇతర యూనిట్‌ అయినా సరే అమ్ముకోవడానికి వీలులేదు. ఎవరూ కొనుగోలు చేయకూడదు. అదే జరిగితే ఇద్దరిదీ నేరమే అవుతుంది. ఈ విషయం అమాయకులైన లబ్ధిదారులకు చెప్పకుండా అధికారులు మభ్యపెట్టారు. ఈ విషయం తెలియక ట్రాక్టర్లు చాలా మంది లబ్ధిదారులు అమ్ముకున్నారు. సుమారు 60శాతానికి పైగా ట్రాక్టర్లు ఇప్పుడు లబ్ధిదారుల వద్దలేవు. ఈ విషయంలో లబ్ధిదారులను మాయ చేసి, వారి చేత అమ్మకాలకు పురిగొల్పింది కూడా అధికారులే కావడం గమనార్హం. ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు ఇలా లబ్ధిదారుల సొమ్ముకు కన్నం పెడితే, అగ్రికర్చర్‌ అధికారులు తామేం తక్కువా అనుకున్నారో ఏమో! ట్రాక్టర్లు సరఫరా చేసిన ఎజెన్సీల వద్దకు వెళ్లి, ఇన్ని ట్రాక్టర్లు అమ్మకానికి అవకాశం కల్పించామని, తమకు కమీషన్‌ ఇవ్వాలని వారిని వేధించి వసూలు చేసినట్లు కూడా తెలుస్తోంది. అగ్రికర్చర్‌ డిపార్లుమెంటుకు చెందిన ఓ ఉన్నతాధికారి ఏకంగా ఆ ఎజెన్సీ యజమానికి బెదిరించినట్లు కూడా సమాచారం. ఇలా ఎవరికి వారు కమీషన్ల పేరుతో వాటాలు పంచుకొని, దళిత బంధు సొమ్ము కాజేశారు…లబ్ధిదారుల వద్ద ట్రాక్టర్లు లేకుండా చేశారు. ఇప్పుడు ఆ ట్రాక్టర్లనీ ఆంధ్రాప్రాంతానికి చెందిన కొంత మంది వ్యక్తులకు దగ్గరుండి మధ్యవర్తుల చేత అధికారులు కధలు నడిపించారు. మొత్తంగా పథకానికి సున్నా చుట్టేశారు.

దళిత బంధు మేసిన రాబందులెవరు?

`ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడిచిందెవరు?

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశలు, ఆశయాలు వమ్ము చేసిందెవరు?

`హుజూరాబాద్‌ పైలెట్‌ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిరదెవరు?

`దళిత బంధును పప్పు బెల్లాలు చేసుకొని పంచుకొని మింగిందెవరు?

`ప్రతిపక్షాలకు మాటలకు కొమ్ము కాసేలా వ్యవహరించిన అధికారులెవరు?

`ప్రతిపక్షాల మాయలో పడి దళితబంధు లబ్ధి దారులను దోపిడీ చేసిందెవరు?

`అమాయకపు దళితుల జీవితాలను ఆగం చేసిందెవరు?

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిందేమిటి? 

`అధికారులు ఆచరించిందేమిటి?

`ఎస్సీ కార్పొరేషన్‌ చేసిన ఘన కార్యమేమిటి?

`లబ్ధి దారులను పక్కదారి పట్టించడంలో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారుల పాత్రేమిటి?

`జిల్లా స్థాయి అధికారుల పంపకాల మాటేమిటి?

`ఉత్తుత్తి ట్రేడర్స్‌ కు సొమ్ము కట్టబెట్టడమేటి?

`కార్లు ఇచ్చిన ఏజెన్సీకి అదనంగా మరో లక్షన్నర కలపని అధికారుల ఆదేశాలలో ఆంతర్యమేమిటి?

`దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లు దళిత బంధు లూటీ మాటేమిటి?

`వందల కోట్లు మింగి, కరిమింగిన వెలగపండు చేస్తిరి?

`ప్రభుత్వ లక్ష్యం నీరుగార్చితిరి?

`లబ్ధి దారులను మోసం చేసి, నిండా ముంచితిరి?

` ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తిరి?

`అసలు దొంగల చేత తిన్నది కక్కిస్తే గాని దళిత బంధు లక్ష్యం నెరవేరదు?

`రొయ్యలు తిని మూతి నాకినంత సులువుగా కోట్లు కొట్టేసి చేతులు దులుపుకుంటిరి?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలోని ప్రతి దళిత కుటుంబం కళకళలాడాలి. ప్రతి దళితుడు లక్షాదికారి కావాలి. ఆత్మగౌరవంతో బతకాలి. ఆర్ధికంగా ఉన్నత స్ధితికి చేరుకోవాలి. సమస్యలు లేని జీవితాన్ని గడపాలి. ఆర్ధిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవాలి. ఆపసోపాలు లేని జీవన యానం కావాలి. తెలంగాణ వచ్చింది. తెలంగాణలో అన్ని వార్గాలు ఆనందంగా బతకాలి. అందులో దళితులు మరింత సంతోషంగా బతికే రోజులు రావాలి. తరతరాలుగా అణచివేతకు, వివక్షకు గురౌతూ, సమాజంలో అట్టడుగు వర్గాలుగా మిగిలిపోతూ, ఆర్ధిక అసమానతలతో వెనుకబడిన దళితుల జీవితాల్లో మార్పులు రావాలి. వారు కూడా సమాజంలో ఉన్నతంగా బతకాలి. అందుకు వారికి ఆర్ధిక చేయూత కల్పించాలి. ఉపాధి అవకాశాలు కల్పించబడాలి. ఉన్నతమైన ఉచిత విద్యావకాశాలు అందించాలి. రేపటి తరాన్ని ఉన్నతంగా తీర్చదిద్దాలి. అసమానతలు లేని సమాజం నిర్మింపబడాలి. వెనుబాటు తనం పోవాలి. అది సామాజిక పరంగానైనా, ఆర్దిక పరంగానైనా అందరూ ఏకతాటిపైకి వచ్చే సమాజ నిర్మాణం జరగాలి. ఇదీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన..ఆచరణ. 

 సమాజంలో దళిత వార్గల అభ్యున్నతి గురించి గొప్పగా కొన్ని దశాబ్ధాలుగా చెప్పుకుంటున్న మాటే…మనం వింటున్న మాటే…కాని ఆచరణేది…ఆచరించిన వారేరీ..  

ఇన్నేళ్లయినా ఆ మాటలు మాటలుగానే మిగిలిపోతూ వచ్చాయి. అందుకే కేటాంచిన సొమ్ము మూటలు మాయమైపోతూ వచ్చాయి…దళితులకు చేయూతనందించిన వారేరీ…గొప్పగా బడ్జెట్‌లో లెక్కలు చూపించి మోసం చేసిన వారే…అలా కాకుండా నేరుగా దళితులకు మేలు జరిగేలా, ఆర్ధికపరమైన లబ్ధి జరిగేలా, ప్రతి దళితుడు లక్షాదికారి అయ్యేలా చేయాలని ప్రపంచ చరిత్రలోనే వినూత్నమైన, విప్లవాత్మకమైన దళిత బంధు పధకాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రవేశపెట్టారు. తెలంగాణలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించింది ముఖ్యమంత్రి ఒక్క కేసిఆర్‌ మాత్రమే…గతంలో చాలా మంది నాయకులు, చాల మంది ముఖ్యమంత్రులు చాలా చెప్పారు. కాని ఏది ఆచరించి చూపించలేదు. బడ్జెట్‌లలో కేటాయింపులు, తర్వాత వాటి మళ్లింపులు. ఇవే కాదా…మొన్నదిదాకా చూసింది…కాని నేడు ఆ పరిస్ధితి లేదు. దళితుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్న తరుణమిది. ముందుగా పైలెట్‌ ప్రాజెక్టు హుజూరాబాద్‌లో తీసుకోవడం జరిగింది. ఆ నియోకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.పది లక్షలు అందించే కార్యక్రమం మొదలైంది. అయితే ఇందులో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో దూరదృష్టితో ఉన్నతమైన ఆశయాలు…ఆలోచనతో…ఆచరాత్మక దృక్పధాన్ని మేళవించి ఒక విప్లవాత్మక ధోరణితో దళిత బంధు అమలుకు శ్రీకారం చుట్టారు. కాని ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులకు చెవికెక్కలేదా?… లేక సరిగ్గా వినిపించుకోలేదా? ముఖ్యమంత్రి ఆదేశాలూ పూర్తిగా అవగాహన చేసుకోలేదో? ఏమో గాని దళిత బంధు అమలులో అధికారుల తీరు వివాదాస్పదమౌతోంది. పెద్దఎత్తున చర్చనీయాంశమౌతోంది. దళిత బంధు ఆశయాలకు తూట్లుపొడిచారన్న విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి. పై స్ధాయి అధికారులు చేసిన అవకతవలపై, కింది స్ధాయి అధికారుల మెడకు చుట్టుకునే పరిస్దితులు రానున్నాయి. ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి దళితుడిని లక్షాధికారి చేయాలన్న గొప్ప సంకల్పంతో చేస్తున్న యజ్ఞానికి తూట్లు పొడిచి, పైలెట్‌ ప్రాజెక్టులోనే పెద్ద కుంభకోణానికి అధికారులు తెరతీసినట్లు స్పష్టమౌతోంది. 

 ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అన్నవి కనీస అవసరాలు..

.అవి తీరాలంటే పని చేయాలి. కష్టపడాలి. డబ్బు సంపాదించాలి. అందుకు ఉపాధి కావాలి. ఆ ఉపాధి ఏదో ఒక రూపకంగా అందాలి. దాన్ని ప్రతి వ్యక్తి ఆచరించాలి. అనుసరించాలి. అవసరాలు తీర్చుకోవాలి. ఇది మనిషి ఫిలాసఫీ…అనుసరించి…ఆచరించాల్సిన ప్రాక్టికాలిటి…కాని సమజాంలో ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలు మారినా తలరాత మారని, జీవితాలు మార్పులు రాని దళిత సమాజం పట్ల గత ప్రభుత్వాలు సానుభూతి మాత్రం చూపిస్తూ వచ్చేవి. కాని వారి జీవితాల్లో వెలుగులు నింపే పని జరగలేదు. కాని ఇప్పుడు మొదలైంది. దళిత బంధుతో ఆ యజ్ఞం ప్రారంభమైంది. అందుకు ప్రతి దళితకుటుంబానికి ప్రభుత్వం నేరుగా ఆర్ధికపరమైన సాయం అందిస్తోంది. ఆ సొమ్ముతో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తోంది. హుజూరాబాద్‌లో ప్రారంభమైన దళిత బంధు సుమారు 18వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేపట్టింది. గొప్పగా ఆ పథకం అమలుకు మార్గం వేసింది. కాని అధికారుల తీరుతో ఆ పధకం అసలు లక్ష్యాలకు తూట్లు పడేలా చేసింది. నిజానికి ప్రభుత్వ లక్ష్యం వేరు…అధికారులు అనుసరించింది వేరు…అందులోనూ కుంభకోణానికి తెరతీశారు…దాంతో ప్రభుత్వం ఎంతో గొప్ప లక్ష్యంతో చేపట్టిన పధకాన్ని అధికారులు నీరు కార్చుతున్నారు. దళిత బంధు అమలుకు ఎవరి రెకమెండేషన్‌ అవసరం లేదు…దళితుడైన ప్రతి వ్యక్తికి ఆర్ధిక చేయూత కల్పించబడాలి. ఇదే అధికారులకు వరంగా మారింది. లబ్ధిదారులైన ప్రతి దళితుడికి ముందు రూ.5లక్షలతో వారు కోరుకున్న యూనిట్‌ అందజేయాలి. లేదూ..కొంత మంది కలిసి ఏర్పాటు చేసుకొనే సంయుక్త యూనిట్‌ను అందించాలి. ఇవన్నీ అధికారుల పర్యవేక్షణలో జరగాలి. ఎవరెవరు ఏ ఉపాధి కావాలనుకుంటున్నారు…వారికున్న నైపుణ్యాన్ని బట్టి ఆయా యూనిట్లను అందించాల్సిన బాధ్యత ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులది. కాని ఇక్కడ జరిగింది వేరు…పథకం అమలులో సొమ్ములు ఖర్చు చేశారు..కాని లక్ష్యాలకు తూట్లు పొడిచారు…దళితుల జీవితాలను ఎక్కడ వేసినగొంగళి అక్కడే అన్నట్లు తయారు చేశారు…

దళిత బంధు అమలులో అందించిన యూనిట్ల జాడేది అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

పెద్దఎత్తున ఎస్పీ కార్పోరేషన్‌ అధికారులు పై స్ధాయి నుంచి కింది స్ధాయి దాకా వాటాలు పంచుకున్నట్లు లెక్కలేసి, దళిత బంధు సొమ్మును దానంగా ఇస్తున్నట్లు ఇచ్చింది తీసుకోండన్నట్లు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. దళిత బంధు సొమ్ము ప్రతి దళితుడి అక్కంట్లో వున్నప్పటికీ వాటిని ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు ఎంతో చాకచక్యంగా వాటిని మళ్లించే ప్రయత్నం చేశారు. లబ్ధిదారుల బలహీనతలను ఆసరాగా చేసుకొని వారికి, నగదు ఆశ చూపించి మోసం చేశారు… 

 ప్రతిపక్షాల తీరు…అధికారుల పనితీరు… రెండూ కలిసి దళిత బంధు అమలుకు తూట్లు పొడిచేలా చేశాయి. 

అసలు దళిత బంధు అన్నది అమలుసాధ్యం కానిదంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ వచ్చాయి. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే ప్రవేశపెట్టిన పధకమంటూ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయి. అంతే కాకుండా ప్రభుత్వం దళితుల అక్కంట్లో వేసిన డబ్బులు తిరిగి తీసుకుంటుందని అసత్య ప్రచారం విసృతంగా చేశాయి. ఆ మాటలే నిజమన్నట్లుగా కొందరు అధికారులు వ్యవహరించారు. లబ్ధిదారుల బలహీనతలను అధికారులు సొమ్ము చేసుకున్నారు. ప్రెండ్లీ ఎంప్లాయిస్‌ అని ప్రభుత్వం చెబితే..దళిత బంధులను ఊడ్చుకుతిన్నారు…వాటాలేసుకొని పంచుకుతిన్నారు. లబ్ధిదారులను మోసం చేశారు…

  మేం వేలు పెడితే రాజకీయమౌతుందని అధికార పార్టీకి చెందిన బిఆర్‌ఎస్‌ నేతలు ఈ విషయంలో వేలు పెట్టలేదు.

 దళితులందరికీ సాయం అందుతున్నప్పుడు వాటిని రాజకీయం చేయకుంటనే మేలని బిఆర్‌ఎస్‌ నేతలు ఎంతో హుందాగా వ్యవహరించారు. ప్రతిపక్షాలేమో…దళిత బంధు ఫెయిల్‌ కావాలని కుయుక్తులు పన్నాయి. గందరగోళం సృష్టించారు. ప్రజలను రెచ్చగొట్టారు. అమాయకులైన వారికి లేనిపోనివి కల్పించి చెప్పారు. దళిత బంధు డబ్బులు వాడుకోకపోతే, ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని అసత్య ప్రచారం సృష్టించారు. ప్రతిపక్షాలు సృష్టించి ఈ గందరగోళం ఎస్సీ కార్పోరేషన్‌ అధికారుల పాలిట వరమైంది. పట్టించకునే నాధుడు లేడు…అడిగే దిక్కులేదనుకున్నారో ఏమో ఇష్టారాజ్యం చేశారు. దళిత బంధులో దక్కించుకోవాల్సినంత దక్కించుకున్నారు. విస్తరిలో మిగిలిన మెతుకులు విధిల్చినట్లు లబ్ధిదారులకు సున్నం పెట్టారు. ఆకు వక్కలు మాత్రం అధికారులు తిన్నారు. నోరు పొక్కినా ఏదో రుచి నాలుకకు అంటిందే పరమన్నామ్మన్నట్లు అధికారులు ఇచ్చింది లబ్ధిదారులు పుచ్చుకున్నారు. పుణ్యానికి వచ్చింది ఎంతైతే అంత అని సరిపెట్టుకోమన్నారు. తమకు చెందాల్సిన సొమ్మును ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు కాజేస్తున్నారన్న సత్యం తెలుసుకోలేకపోయారు. లబ్ధిదారుల బలహీనతే అధికారులు అప్పనంగా వాడుకున్నారు…దోచుకోవాల్సినంత దోచుకున్నారు…(ఉత్తుత్తి ట్రేడర్ల మాయాజాలం…దళిత బంధు నిధులు మాయం) రేపటి మీ నేటిధాత్రిలో…

అధికారులు ఉన్నట్టా? ఉండి లేనట్టా?

చొప్పదండి / నేటి ధాత్రి

కరీంనగర్ జిల్లాచొప్పదండి మండల పరిధిలోని ఆర్నకొండ గ్రామ పెట్రోల్ బంక్ నుండి మొదలయ్యే రాష్ట్ర రహదారికి ఇరువైపుల ఉన్నటువంటి చెట్లను కర్ర వ్యాపారాలు యదేచ్చగా రాత్రికి రాత్రే ఎలాంటి అనుమతులు లేకుండా కోయడం జరిగింది. అసలు అధికారులు ఉన్నట్టా? ఉండి లేనట్టా? అన్నట్టుగా ఉంది ఇక్కడి వ్యవహారం. ఇలా గతంలో కూడా జరిగినట్టు సమాచారం. ఇకపోతే ఫారెస్ట్ అధికారులు సరే సరే. అందాల్సిన అమ్యామ్యాలు అందితే చాలు చూసి చూడనట్టుగా వ్యవహారిస్తునరన్నా అభియోగాలు లేకపోలేదు. ఇలా కర్ర వ్యాపారులు ఎవరికీ నచ్చినట్టుగా వారి స్వలాభం కోసం చెట్లను నరక్కుంటూ పోతే ఎలా అని ఇక్కడి ప్రజల అభిప్రాయం. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మొక్కలను పెంచి అడవుల విస్తీరణాన్ని పెంచే కార్యక్రమాలు చేస్తుంటే మరోపక్క కర్ర వ్యాపారులు వాటిని తుంచే ప్రయత్నాలను రాత్రికి రాత్రే జరిపేలా ఆలోచనలు చేయడం చట్టవిరుద్ధముగా భావించి చెట్లను నరికిన వారిపై పూర్తి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియచేయడమైనది. దీనిపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారోనని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

పల్లె ప్రకృతి వనన్ని పట్టించుకొని ఆధికారులు

తాగుబోతులకు అడ్డగా మారిన పల్లె ప్రకృతి వనం

చూచి చూడకుండా వదిలిపెట్టిన పల్లె ప్రకృతి వనం

బోయినిపల్లి:నేటిధాత్రి 

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మానువాడ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నోవేల కోట్ల ఖర్చు చేసి, పల్లె ప్రకృతి వనం నిర్మాణం చేపట్టిన సందర్భంగా అధికారుల నిర్లక్ష్యం వలన పల్లె ప్రకృతి వనం చుట్టూ ఫినిషింగ్ జాలి ఉండగా,గుర్తుతెలియని వ్యక్తులు ఫినిషింగ్ జాలిని విరగొట్టడమే కాక పల్లె ప్రకృతి వనం లోపలికి వెళ్లే దారి గేటు లేనందున తాగుబోతులకు అడ్డగా మారింది.అధికారులు ఎవరూ పట్టించుకోక,చెట్లకు నీళ్లు అందిచక,చెట్లు ఎండిపోయి, విరిగి చెత్తాచెదరంతో పూర్తిగా కూడుకుపోయింది.పక్కనే దారి ఉన్నందున దారిగుంట వెళ్తున్న పత్రిక విలేఖరికి కనిపించినందున వెంటనే పోటోలు తీసి, గ్రామ కార్యదర్శి కి ఫోన్ చేయాగ ఫోన్ కట్ చేశారు.ఏపీవో సబితను పల్లె ప్రకృతి వనం సమాచారం గురించి వివరన కోరగా మా దృష్టికి ఏమీ రాలేదని చెప్పినారు.వెంటనే ఎంపీటీసీ ఐరెడ్డి గీతా మల్లారెడ్డికి సమాచారం ఇవ్వగా స్పందించి పల్లె ప్రకృతికి వచ్చి చూసి, మేము చాలా సార్లు, గ్రామకార్యదర్శితో చర్చించామని అన్నారు. ఎంపీఓ తిలక్ కు సమాచారం అందించగా 2,3 రోజులలో వచ్చి చూస్తానని తెలిపినారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను తీర్చాలని గ్రామ ప్రజలు, తదితరులు కోరుతున్నారు.

నిమ్స్ లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి గారిని శుక్ర‌వారం పరామర్శించిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.

రెండు రోజుల జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకొని శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ కు వ‌చ్చిన మంత్రి. 

నేరుగా నిమ్స్‌కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై స‌మీక్ష‌. 

 

ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్, చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని అడిగి తెల్సుకున్న మంత్రి హరీశ్ రావు.  

 

అత్యుత్తమ వైద్యం అందించాల‌ని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యుల‌ను ఆదేశించిన మంత్రి హరీశ్ రావు.  

 

ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి, ధైర్యం చెప్పిన మంత్రి హరీశ్ రావు. 

 

ప్రభుత్వం అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చిన మంత్రి. 

 

విచారణ పూర్తి నిష్పాక్షికంగా జ‌రుగుతుంద‌ని, దోషులు ఎంత‌టివారైనా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ ఇచ్చిన మంత్రి హ‌రీశ్ రావు.

భూపాలపల్లి బాద్‌ షా గండ్ర

`బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ క్రెడిట్‌ గండ్రకే…

`వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ గండ్రదే…

`గండ్ర మీద ప్రజలకున్న ప్రేమకు సంకేతం…

`నేటిధాత్రి చెప్పేదే నిజం…గత అనుభవాలే అందుకు సాక్ష్యం.

`రెండు దశాబ్దాలుగా గండ్రది తిరుగులేని నాయకత్వం…

`రెండు సార్లు ఎమ్మెల్యే…

`ఒకసారి ఎమ్మెల్సీ..

`ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్‌ విప్‌…

`ప్రగతిలో భూపాలపల్లి ప్రత్యేకం…

`ప్రజలతో మమేకమై.. ప్రజల కోసమే అంకితమై…

`సుదీర్ఘ రాజకీయ ప్రయాణం… అభివృద్ధికి తార్కాణం.

`అలుపెరుగని పోరాటం… ప్రజల సంక్షేమం కోసం ఆరాటం.

`నిరంతరం ప్రజల కోసం…నిజమైన సేవా భావానికి నిదర్శనం.

`పార్టీ బలోపేతం కోసం కృషి, నాయకులను కడుపులో పెట్టుకునే చిత్తశుద్ధి.

`పేదలకు ఆప్తుడు…అభాగ్యులకు అన్నార్థుడు.

` నియోజకవర్గం కోసం నిరంతరం తపించే నాయకుడు.

`ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం తపించే ప్రజా సేవకుడు…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాలం కలిసొస్తుంది…ధర్మం, న్యాయం మనవైపు వుంది. తెలంగాణ వచ్చి తీరుతుంది… ఇది ఎవరో అన్న మాటలు కాదు…సాక్ష్యాత్తు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి 2009లో అన్న మాటలు. మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తో అప్పట్లో చెప్పిన మాట…ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే 2009 ఎన్నికలలో గండ్ర వెంకట రమణారెడ్డి తొలి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటికే ఆయన ఎమ్మెల్సీ కూడా… అయితే ఆ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కేవలం పది సీట్లు సాధించింది. ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో కేటిఆర్‌ అసెంబ్లీ లాబీలో ఎదురైన గండ్ర వెంకట రమణారెడ్డితో కాసేపు తెలంగాణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా కేటిఆర్‌ చెప్పిన విషయాలను సావధానంగా విన్న రమణారెడ్డి తెలంగాణ రావడం ఖాయమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణపై రమణారెడ్డికి వున్న చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేశారు. తన నియోజకవర్గం మీద రమణారెడ్డికి ఎంత ప్రేమ వుందో వివరించే ప్రయత్నం చేశారు. తనకు అత్యంత అప్పుడు రమణారెడ్డి అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఉటంకించారు. రమణారెడ్డి మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. అలాంటి రమణారెడ్డి బిఆర్‌ఎస్‌ లో చేరి భూపాలపల్లికి చేసిన సేవను, అభివృద్ధి కార్యక్రమాలను కీర్తించారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు సభపై కేటిఆర్‌ ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా బిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి నాయకత్వ పటిమను కొనియాడారు. భూపాలపల్లిలో చరిత్ర తిరగరాసేంత గొప్పగా సభను ఏర్పాటు చేసిన గండ్ర జ్యోతికి ప్రత్యేకంగా కేటిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ క్రెడిట్‌ గండ్రదే…

భూపాలపల్లిలో జరిగిన బిఆర్‌ఎస్‌ సభ నభూతో నభవిష్యతి అన్నట్లు జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎంత జిల్లా కేంద్రంలో సభైనా అది నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలకున్న నమ్మకం మీద జరిగిన సభ. ఒక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగిన తర్వాత, అక్కడే జరిగిన సభ. సహజంగా ఎన్నికల సభలకు ప్రజలు విశేషంగా హజరుకావడం చూస్తుంటాం. కానీ ఇలాంటి సభలు బహు అరుదు. అవి ఆది నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీకే, ఆ పార్టీ నాయకులకే సాధ్యమౌతుంది. ఇటీవల కాలంలో బిఆర్‌ఎస్‌ పార్టీ సభలకు ప్రజలు గతం కన్నా ఎక్కువగానే వస్తున్నారు. ఆ మధ్య ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు. జిల్లాలలో సమీకృత కలెక్టర్‌ కార్యాలయం సముదాయాల ప్రారంభోత్సవాలు, మెడికల్‌ కాలేజీల శంకుస్థాపనలకు జరుగుతున్న సభలు కూడా పెద్ద ఎత్తున విజయవంతమౌతున్నాయి. అయితే భూపాలపల్లిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనల తర్వాత జరిగిన బిఆర్‌ఎస్‌ సభ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్‌ అవుతుందని చాలా మంది ఊహించలేదు. కానీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్తశుద్ధి, చొరవ, పార్టీ మీద ఆయనకున్న పట్టు, నాయకులలో ఎమ్మెల్యే మీద వున్న విశ్వాసం ఇవన్నీ సభ ఏర్పాటులో కనిపించాయి. అటు వేధిక, ఇటు ప్రజా సముదాయం ఎమ్మెల్యే మీద మరింత నమ్మకాన్ని పెంచిందనే చెప్పాలి. ఇలాంటి సభల సక్సెస్‌ అన్నది నాయకుల మీద మరింత బాధ్యత పెంచుతుంది. ప్రజల్లో నాయకుడిపై నమ్మకం రెట్టింపు అవుతుంది. ప్రజల ఆకాంక్షలు పెరుగుతాయి. మా సమస్యలు తీరుతాయన్న విశ్వాసం పెరుగుతుంది. గత మూడు దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న గండ్ర వెంకట రమణారెడ్డి మీద రోజు రోజుకూ ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గలేదు. అందుకు భూపాలపల్లి సభ విజయవంతం కావడమే నిదర్శనం. బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ తో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త రెట్టించిన ఉత్సాహం కనిపించింది. పార్టీ మీద కూడా ప్రజలకు మరింత అచంచల విశ్వాసం పెరిగిందనడానికి నిదర్శనం. 

వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ గండ్రకే… 

భూపాలపల్లిలో జరిగిన సభతో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. అడుగడుగునా మంత్రి కేటిఆర్‌ ఎమ్మెల్యేకు ఇచ్చిన ప్రాధాన్యతలోనే రమణారెడ్డికి పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో అర్థమైంది. ప్రతి సందర్భంలోనూ మంత్రి కేటిఆర్‌ ప్రజలకు రమణారెడ్డి నాయకత్వ గొప్ప తనం గురించి వివరించే ప్రయత్నం చేశారు. రమణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత శ్రమిస్తారనేది కూడా ప్రజలకు మరింత తెలిసేలా చేశారు. ఇంతటి ప్రాధాన్యమనేది అందరికీ దక్కేది కాదు. ఇలాంటి సభలు తెలంగాణలో పెద్దగా ఏర్పాటు చేసినవి కావు. కానీ ప్రత్యేకంగా రమణారెడ్డి మీద వున్న నమ్మకం, ఆయన నాయకత్వంలో అటు పార్టీకి, ఇటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కేటిఆర్‌ కు పూర్తి స్థాయిలో అర్థమైంది. ఒకనాడు ఆయన మనసులోని ఆలోచన తెలుసుకున్న కేటిఆర్‌, ఇప్పుడు రమణారెడ్డి లోని నాయకత్వ దృక్పథం ఎంత విలువైందో తెలిసింది. అందుకే కేటిఆర్‌ ఇంత ప్రాధాన్యత కల్పించారనేది స్పష్టమైంది. అంతే కాకుండా వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ కూడా రమణారెడ్డి కే అన్న పరోక్ష సంకేతాలు కూడా పంపినట్లైంది

గండ్ర మీద ప్రజలకున్న ప్రేమకు సంకేతం…

తెలంగాణలో భూపాలపల్లి అనేది మారుమూల ప్రాంతం. అందులోనూ కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రం. ఆ జిల్లాలో ఒక బ్రహ్మాండమైన సభ జరపడం అన్నది ఎంతో సాహసంతో కూడుకున్న పని. ఏ మాత్రం తేడావచ్చినా నాయకత్వం మీద వున్న నమ్మకం తలకిందులౌతుంది. రమణారెడ్డికి ప్రజల మీద వున్న విశ్వాసం… ప్రజలకు రమణారెడ్డి అంటే వున్న నమ్మకం మీదనే సభ జరిగింది. సక్సెస్‌ అయ్యింది. పార్టికి మరింత జోష్‌ వచ్చింది. బిఆర్‌ఎస్‌ కు తిగులేదని మరోసారి తరలిపోయింది. 

నేటిధాత్రి చెప్పేదే నిజం…గత అనుభవాలే అందుకు సాక్ష్యం. 

ఈ విషయం నేటిధాత్రి ఎప్పటి నుంచో చెబుతోంది. తెలంగాణలో గెలిచే నియోజకవర్గాలు ఏవో, నాయకత్వాలు బలంగా ఎక్కడ వున్నాయో, తిరుగులేని నాయకులు ఎవరో ఇప్పటికే అనేక సర్వేలు నిర్విస్తూ వస్తోంది. భూపాలపల్లి విషయంలో కూడా బిఆర్‌ఎస్‌ ఎంత బలంగా వుందో కూడా చెబుతూనే వస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ముందు నేటిధాత్రి చెప్పిందే నిజమైంది. మునుగోడు అభ్యర్థి విషయంలో నేటిధాత్రి చెప్పిందే ఫైనల్‌ అయ్యింది. తెలంగాణలో నియోజకవర్గాలలో బిఆర్‌ఎస్‌ బలబలాలపై కూడా ఇప్పటికే పలు మార్లు రిపోర్ట్‌ కూడా ప్రచురించడం జరిగింది. అందులో భూపాలపల్లిలో రాజకీయం ఏం నడుస్తుందో కూడా నేటిధాత్రి చెప్పింది. గండ్ర వెంకట రమణారెడ్డి కే పెద్ద పీఠ అన్నది ఎప్పటి నుంచో నేటిధాత్రి చెబుతూనే వస్తోంది. అదే ఇప్పుడు నిజమైంది. కేటిఆర్‌ కూడా సభలో ఇదే విషయాన్ని కొంత బహిరంగంగా, మరి కొంత నర్మగర్భంగా చెప్పాల్సిన విషయమైతే చెప్పాడు. అర్థమైన వాళ్లు అర్థమైనంతగా వివరంగానే తన అభిప్రాయం వెల్లడిరచారు. ఒక రకంగా వచ్చే ఎన్నికలలో రమణారెడ్డి కే టిక్కెట్‌ అన్నది తేల్చేశారు. తగాదాలు వద్దని చెప్పేశాడు. పేచీలకు తావు లేదని స్పష్టం చేశాడు. 

రెండు దశాబ్దాలుగా గండ్రది తిరుగులేని నాయకత్వం…రెండు సార్లు ఎమ్మెల్యే…ఒకసారి ఎమ్మెల్సీ…

ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌. ప్రగతిలో భూపాలపల్లి ప్రత్యేకం…ఆనాడైనా, ఈనాడైనా అభివృద్ధికి కట్టుబడి వున్న నాయకుడు రమణారెడ్డి. ప్రజలతో మమేకమై.. ప్రజల కోసమే అంకితమై…పని చేయడం మాత్రమే రమణారెడ్డికి తెలుసు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం… అభివృద్ధికి తార్కాణం అనేది జిల్లా ప్రజలే చెప్పుకుంటున్న మాట. అలుపెరుగని పోరాటం… ప్రజల సంక్షేమం కోసం ఆరాటం. ఆది నుంచి రమణారెడ్డి వ్యక్తిత్వం. నిరంతరం ప్రజల కోసం…నిజమైన సేవా భావానికి నిదర్శనం. అని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఎప్పుడూ చెప్పుకునే మాట. పార్టీ బలోపేతం కోసం కృషి, నాయకులను కడుపులో పెట్టుకునే చిత్తశుద్ధి. ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా వుండడం రమణారెడ్డి కి తెలుసు. వారి సాధక బాదకాలు పట్టించుకుంటూ కంటికి రెప్పలా చూసుకుంటారు అనే మాట వుంది. పేదలకు ఆప్తుడు…అభాగ్యులకు అన్నార్థుడు. నియోజకవర్గం కోసం నిరంతరం తపించే నాయకుడు.

ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం తపించే ప్రజా సేవకుడు…

తెలంగాణకు చెదపురుగు షర్మిల!

-ప్రశాంతమైన తెలంగాణలో చిచ్చురేపడానికి వచ్చిన చీడ పురుగు.

-చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రాజకీయాలు తెలంగాణలో చెల్లవు.

-తెలంగాణ శత్రువులకు ఇక్కడ చోటులేదు.

-తెలంగాణను దోచుకున్న వాళ్లకు మాట్లాడే అర్హతలేదు.

-షర్మిల దొంగ దీక్షలు…తెలంగాణ మీద లేని ప్రేమలు, పిచ్చి భ్రమలు ప్రజలకు తెలుసు.

-ఒకనాడు తెలంగాణకు నిలువు, అడ్డం నిలబడిరది వైఎస్‌…

-ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ఉనికి కోసం షర్మిల.

-తెలంగాణను తూర్పారపట్టి, ఒట్టిపోయిన ఆవును చేసింది వైఎస్‌.

-అదే తెలంగాణను గంగి గోవును చేసింది కేసిఆర్‌.

-తెలంగాణను ఎండబెట్టింది వైఎస్‌…

-తెలంగాణను సిరుల మాగాణ చేసింది కేసిఆర్‌.

-తెలంగాణ అంటే నిలువెల్ల విషం నింపుకున్నది వైఎస్‌…

నిలువెల్ల గాయాలను మాన్పి, నిత్య వసంతం చేసింది కేసిఆర్‌.

-మా గురించి ప్రశ్నించే అర్హత వుందా?

-తోడ బుట్టిన అన్ననే దూరం పెట్టాడు. 

-ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చావు.

-వారసత్వంగా పంచుకోవడానికి రాష్ట్రాలేమైన ఆస్థులా?

-బయ్యారం గనుల కోసమే తెలంగాణలో రాజకీయాలా!

-మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్యూ..

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నేకొక గిరిజనబిడ్డను…ఉన్నత విద్యావంతుడను. ఉన్నతమైన ఆశయాలుకల్గిన వ్యక్తిని. సమాజంలో అట్టుడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సామాజిక వేత్తను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడిని. రెండు సార్లు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిదిని. మహబూబాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్న ఎమ్మెల్యేను. నేను చేసిన అభివృద్ధిని, దాని నమూనాను ప్రజల ముందు వుంచిన ప్రజా నాయకుడిని. అలాంటి నాపై ఆరోపణలు చేసి, నోరుంది కదా? అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, రాజకీయాల కోసం బురద జల్లిపోతా? అంటూ ఊరుకోవాలా? మర్యాద, మన్నన లేకుండా కుసంస్కారవంతమైన భాషను ఉపయోగించి, నన్ను మరో రకంగా సంబోధిస్తూ, నా నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి ప్రేలాపణలు చేస్తుంటే నవ్వుతూ చూస్తుండాలా? ఇదేనా షర్మిల నేర్చుకున్న సంస్కారం? రాజకీయాల పేరుతో యాత్రను నిర్వహిస్తూ నియోజకవర్గాలలో పర్యటిస్తూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే విని సంబరపడమంటారా? షర్మిల ఎంతైనా మాట్లాడొచ్చా? అదే తెలంగాణ నాయకులు మాట్లాడితే తాను మహిళను అన్నది గుర్తుకొస్తందా? దేశంలో ఏ మహిళా నాయకురాలైనా షర్మిల మాట్లాడినట్లు మాట్లాడుతున్నారా? ఇంత దిజగారి వ్యాఖ్యలు చేస్తున్నారా? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం ఎక్కడైనా చూశామా? దొంగే..దొంగ అన్నట్లు 2004 ఎన్నికల ముందు ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేక, ఇంటిని అమ్ముకున్న రాజశేఖరెడ్డి ఐదేళ్లలో లక్ష కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ప్రజలు మర్చిపోయారా? ఆ రోజుల్లో విమర్శల పాలైంది ఎవరు? జైలు పాలైంది ఎవరు? ఎందుకు కేసులు ఎదుర్కొన్నారు? ఇవన్నీ మాట్లాడాలంటే మాకు మాటలు రావా? మేం మాట్లాడలేమా? మహబూబాబాద్‌ చూపిన రుచి మర్చిపోరాయా? ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో ఎక్కడా నా కుటుంబం మీద ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అలాంటిది నా సతీమణి గురించి మాట్లాడడాన్ని కూడా సహించమంటారా? ఒక మహిళ సాటి మహిళ గురించి మాట్లాడాల్సిన మాటలేనా? నేనూ మాట్లాడగలను? కాని నాకు సంస్కారం అడ్డొస్తోంది? అయినా రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయంగా మాట్లాడాలి. అంతే గాని వ్యక్తిగత విమర్శలు..దూషణలు…వేలం వెర్రి మాటలు..పిచ్చి కూతలు కూస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఇంకోసారి షర్మిల నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తే సహించే ప్రసక్తే లేదు. ఇంత కాలం ఆమెను పట్టించుకున్న వారే తెలంగాణలో లేరు. బిఆర్‌ఎస్‌ అసలే పట్టించుకోలేదు. దాంతో ఎలాగైనా వివాదాలను సృష్టించి మీడియాలో హల్‌ చల్‌ చేస్తేచాలు..అదే రాజకీయం అనుకునే భ్రమల్లో షర్మిల వుంది. అందుకే ఇలాంటి కూతలు కూస్తోందని అంటున్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్వూ…ఆయన మాటల్లోనే…!

అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, రాజకీయ అవసరాలకోసం ఎంతకైనా దిగజారే తనం..ఇదంతా షర్మిల కుటుంబానికి చెందిన అనుభవం.

అందరూ అలాగే వుంటారని అనుకుంటే పొరపాటు. 2004 ఎన్నికల ముందుకు ఎలాగైనా తెలంగాణ సీట్లు ఎక్కువ గెలిస్తే తప్ప అధికారంలోకి రాలేమని, జై తెలంగాణ అని అంటే తప్ప తెలంగాణలో ఓట్లు రావని తెలిసి, బిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చి మోసం చేసింది వైఎస్‌. బిఆర్‌ఎస్‌తొ పొత్తు పెట్టుకొని తెలంగాణలో గెలిచిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలంగాణ వాదమే లేదని నిరూపించే ప్రయత్నం చేసి నమ్మక ద్రోహి వైఎస్‌. రాజశేఖరరెడ్డి. తెలంగాణభూములను తెగనమ్మి, తెలంగాణలో అభివృద్ధిని కుంటుపర్చి, ఆంధ్రకు నిధులను తరలించి దుర్మార్గుడు. తెలంగాణను ఎండబెట్టి, పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి, నీళ్లను రాయలసీమకు తరలించి, తెలంగాణ రైతాంగం గోస పుచ్చుకున్న వ్యక్తి వైఎస్‌. తన జీవితంలో ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా రాజకీయాలు చేసి, తన స్వార్ధం కోసం తెలంగాణను ఉపయోగించుకొని ఐదేళ్లలో లక్ష కోట్లు సంపాదించాడన్న అపవాదు ఎదుర్కొన్న నాయకుడు వైఎస్‌. ఆనాడు 2004లో ఏ వామపక్షాలతో ఆయన జతకట్టాడో వారిని కూడా నిండా ముంచి, వారి చేతే లక్ష కోట్లు దోచుకున్న వైఎస్‌ అన్న అపవాదును మోసిన నాయకుడు వైఎస్‌. ఇదీ ఆయన చరిత్ర. నీచ రాజకీయం. నూరు గొడ్లను తిన్న రాబందు నీతులు వల్లించినట్లు ఇప్పుడు తగుదునమ్మా! అని తెలంగాణ గురించి షర్మిల మాట్లాడడం విడ్డూరం. తెలంగాణ అంటే ఏమిటో తెలియదు. దాని త్యాగం తెలియదు. తెలంగాణ గోస తెలియదు. తెలంగాణ సంస్కృతి తెలియదు. తెలంగాణ బోనం తెలియదు. తెలంగాణ బతుకమ్మ తెలియదు. బోనం నెత్తినపెట్టబోతే, బొట్టు పెట్టబోతే తెలంగాణ మహిళలపై గుడ్లు పద్దవి చేసుకొని చూసిన షర్మిలనా తెలంగాణ ప్రజలకు మేలు చేసేది…తెలంగాణలో రాజకీయాలు చేసేది…చెప్పుకోవడానికి కొంచెమైనా ఇంగితం వుండాలి! 

  మహబూబాబాద్‌ లాంటి వెనుకబడిన ప్రాంతాన్ని మరింత వెనుకబాటుకు గురి చేసిందే వైఎస్‌. 

అలాంటి ప్రాంతాన్ని ఇప్పుడు సస్యశ్యామలం చేసిందే ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఎమ్మెల్యేగా నేను..అంతే కాని ఉమ్మడి రాష్ట్రంలో మహబూబాబాద్‌ పరిస్ధితి ఏమిటో ప్రజలకు తెలుసు. అమ్మ పుట్టిల్లు గురించి మేన మామ ముందు గొప్పలు చెప్పినట్లు…మహబూబాబాద్‌ గురించి షర్మిలకు తెలిందల్లా ఒక్క బయ్యారం గనులు…! మాత్రమే..ఇప్పుడు ఆమే చేసే రిజకీయమంతా అందుకే!! తెలంగాణ ఉద్యమ కాలంలో జై తెలంగాణ అన్న ఎంతో మంది ఉద్యోగులను వేధించింది ఎవరో కాదు…షర్మిల తండ్రి వైఎస్‌. ఉద్యోగులను పీడిరచింది…జై తెలంగాణ అనకుండా దారిలోకి తెచ్చుకునేందుకు ఏసిబితో దాడులు చేయించి, ఎంతో మంది ఉద్యోగులను కేసుల్లో ఇరికించిన చరిత్ర వైఎస్‌ది.

నేను తెలంగాణ వాదిగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తుండడాన్ని జీర్ణించుకోలేక, ఉద్యోగ వేధింపులను కూడా భరించాను. చివరికి ఉద్యోగం కూడా వదులుకొని తెలంగాణ కోసం ఉద్యమించాను. ఇదీ నా చరిత్ర. పిల్ల బిత్తరులంతా వచ్చి, పిచ్చి పిచ్చి ప్రేళాపణలు చేస్తే, నా ఉద్యమ చరిత్రకు చెదలు పడుతుందా? ఇరవైఏ ళ్లకిందనే లక్ష కోట్లు దోచుకున్న దొంగల కుటుంబం అని ఆరోపణలు ఎదుర్కొన్న వైఎస్‌ కూతురు షర్మిల తెలంగాణ నాయకుల మీద లేని పోని అవినీతి ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించరు. అంతదాకా ఎందుకు ఆమె మహబూబాబాద్‌లో మాట్లాడుతన్న సందర్భంలో ప్రజలనుంచి ఎలాంటి సందన కనిపించలేదు. ఒకటికి రెండుసార్లు ప్రజలు అడిగినా ఎవరూ చప్పుడు చేయలేదు. ఆ వీడియాలను స్పష్టంగా చూస్తే నన్ను విమర్శిస్తున్న సందర్భంలో ప్రజలు ఆక్రోశంగా చూశారే…! ఆమె మాటాలకు స్పందిచలేదు. ఇది ఆమె గమనించింది. అందుకే ఇక నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిరది. 

తెలంగాణ అనే పదాన్నే మాట్లాడేందుకు ఇష్టపడని ఆ కుటంబం చేసింది ఏమిటో మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ రాళ్లకు తెలుసు. 

ఇప్పటికీ తెలంగాణ వాదులు ఆ రాళ్లకు పూజలు చేయడం తెలుసు. అలాంటి మహబూబాబాద్‌లో తనపై షర్మిల పిచ్చాసుపత్రిని నుంచి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు పట్టించుకుంటారా? ఆనాడు ఆమె తండ్రి తెలంగాణను దోచుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజల విరాళాలతో పార్టీ నడుపుతోంది. పూట గడుపుకుంటోంది. ఇంతకన్నా సాక్ష్యం మరొకటి అవసరం లేదు. తెలంగాణ మీద పడి దోచుకోవడానికి అలవాటు పడిన ప్రాణం ఊరుకోలేకపోతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చినా వారి ఆశలు చావడం లేదు. దోచుకోవడం ఆగిపోవడం జీర్ణం కావడం లేదు. షర్మిల తెలంగాణ వాది కాదు..తెలంగాణ కోసం కొట్లాడిరది లేదు. తెలంగాణకు మేలు చేసే పని ఏనాడు చేసింది లేదు. మరి ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి అసవరమైన నిధులు ఎక్కడివి? అంత సంపాదన ఎక్కడిది? ముందు ఈ సంగతి చెప్పాలి. చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునేందు, కాలం కలిసొస్తే, చేజారిపోయిన బయ్యారం కలలు నిజం చేసుకునేందుకు తప్ప తెలంగాణ మీద ప్రేమ కాదు….ఆమె కు తెలంగాణకు సంబంధం లేదు…తెలంగాన అనే పదమే ఒక ఉద్యమ కణిక…ఎన్నేళ్లైనా దాని సెగ తగ్గేది కాదు…దోచుకునేవారికి ఇక్కడ చోటు లేదు…ప్రజలు కూడా ఇవ్వరు…! షర్మిల భ్రమల్లో బతకడం మానుకుంటే చాలు!! పిచ్చి వాగుడు వాగినందుకు తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పు!!!

జిల్లాలో కంటి వెలుగును సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు.

ఏం డోకా లేదు ఇలలోని అందాలను మేము చూడగలం… పేదల కళ్ళలో అద్దాలు ఒక వరం జిల్లాలో 20 బృందాలతో కంటి పరీక్ష లు కంటి వెలుగు కార్యక్రమము తో దురమౌతున్న కంటి సమస్యలు.

జిల్లాలో కంటి వెలుగును సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు.కంటి వెలుగుపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్న జిల్లా కలెక్టర్ 

యస్. క్రిష్ణ ఆదిత్య. 

ములుగు జిల్లా నేటిధాత్రి

 

అద్దాలు పొందిన వారి మాటల్లో ఆనందం చుక్కల మందులు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చిండ్రు.

పెద్దల రమ వృత్తి కూలి , భర్త సాంబయ్య, శ్రీనివాస కాలనీ, ములుగు.

నా పేరు పెద్దల రమ నాకు ముగ్గురు అమ్మాయిలే కొడుకులు లేరు పెద్ద బిడ్డ బీటెక్ చదువుతుంది. ఇద్దరు బిడ్డలు తాడువాయి లో ఇంటర్ చదువుతున్నారు. దగ్గర చూపు కనపడకపోయేది కంటి వెలుగు వల్ల కంటి పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా చుక్కల మందులు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చిండ్రు అద్దాలు మంచిగా కనబడుతున్నాయి. అద్దాలు పెట్టుకుంటే సూదిల దారం పెడుతున్న… ఈ కంటి వెలుగు మంచిగ అనిపించింది.

 

ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చారు గొల్లపల్లి స్వామి వృత్తి కూలీ

 

నేను బార్దన్ షాపులో పనిచేస్తా మా ఊరు బండారుపల్లి నాకు దగ్గర చూపు కనబడకపోయేది. ఇక్కడ కంటి వెలుగు పథకంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు కూడా ఇస్తున్నారని చెప్పడంతో ఇక్కడికి వచ్చా. డాక్టర్లు కంటి పరీక్షలు చేసి, దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడంతో గతంలో కంటే ఇపుడు చూపు స్పష్టంగా కనిపిస్తున్నది.

 

ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది.

అచ్చ సాంబయ్య, తండ్రి లక్ష్మయ్య, బంజారా కాలనీ, ములుగు.

 

ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం చాలా సంతోషం. ప్రైవేటు దవఖానాలో ఐతే శానా పైసలు అయితుండే ఈ కంటి వెలుగు లో మందులు అద్దాలు ఉచితంగా ఇచ్చిండ్రు.

 

 శేష్మ అచ్ఛా దిక్రా. మేరా నామ్ హశ్మత్, 53 వయసు గడిగడ్డ, ములుగు.

 

శేష్మ అచ్ఛా దిక్రా నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు వాళ్ళ పెళ్లిళ్లు అయిపోయినాయి. నా భార్త చనిపోయాడు. నాకు కంటి సమస్య కొద్ది నెలల నుండి ఉంది. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోవడానికి డబ్బులు లేక చుపించుకోలేదు. కంటి వెలుగు కార్యక్రమము ప్రభుత్వం చేపట్టినదని చెప్పిడ్రు. ఉచితంగా మందులు ఇచ్చిండ్రు, అద్దాలు ఇచ్చిండ్రు. ఈ సర్కారు చల్లగా ఉండాలే. ఈ పథకంతో మాలాంటి పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

 

కంటి వెలుగు సూపర్ కే. శ్రీనివాస్, వయసు 46 దేవగిరిపట్నం.

 

కంటి వెలుగు సూపర్ నాకు పేపర్ చదువుతుంటే దగ్గర చూపు ఇబ్బందిగా ఉండేది. కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా అద్దాలు ఇచ్చిండ్రు ఇప్పుడు సూపర్ గా కనబడుతున్నాయి. కేసీఆర్ పెట్టిన కంటి వెలుగు పథకంతో కొత్తచూపు వచ్చినట్లు ఉంది. ఇంకా ఇలాంటి పథకాలు కెసిఆర్ సారు మరెన్నో చేపట్టాలి.

 

 కంటి వెలుగు గిట్లనే కొనసాగించాలే హైమావతి వయసు 45 గొల్లవాడ ములుగు

 

నాకు కంటి వెలుగు కొత్త చూపునిస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. కేసిఆర్ సారు కంటి వెలుగు గిట్లనే కొనసాగించాలే.

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ కంటి వెలుగు కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రజలమాట ఇక ఏం డోకా లేదు కంటి దగ్గర చూపు.. దూరం చూపు… ఇబ్బందిగా ఉండే మాకు కంటి అద్దాలు కంటి వెలుగులో ఇచ్చినవి. పెట్టుకుంటే అంత మంచిగా కనబడుతున్నాయని అంటున్నారు స్వరాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా, వారి కళ్లలో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పలు శాఖల అధికారులతో సంయుక్తంగా కలిసి శిబిరాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లాలోని 9 మండలాలలో 174 గ్రామపంచాయతీలలో 3,30,031 జనాభా ఉండగా అందులో 18 సంవత్సరాలు పై బడిన జనాభా 2,08,000 మంది ఉన్నారు. వీరందరికి కంటి పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని 15 పిహెచ్ సి లలో, 20 బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన కంటి వెలుగు పరీక్షల శిబిరాలలో 68059 మందికి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో అవసరం ఉన్న 9312 మందికి అక్కడిక్కడే రీడింగ్‌ గ్లాస్ లను సైతం అధికారులు అందించారు. ప్రత్యేక అద్దాలు అవసరం ఉన్న మరో 6155 మందికి అద్దాలను అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపగా దానిలో నుంచి 1392 ప్రత్యేక అద్దాలను ములుగు వైద్య ఆరోగ్య శాఖకు పంపించారు. దీనిలో 661 ప్రత్యేక అద్దాలను అవసరం ఉన్న వారికి అందించారు. కంటి వెలుగు శిబిరాలలో పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలకు అద్దాలతో పాటు ఎదురవుతున్న కంటికి సంబంధించి చిన్న చిన్న సమస్యలకు మందులతో పాటు కంటిలో వేసుకోడానికి చుక్కల మందులను సైతం పంపిణీ చేస్తున్నారు.

 

కంటి వెలుగుపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద.

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును విజయవంతం చేసేందుకు ములుగు జిల్లా కలెక్టర్‌ ఎస్. క్రిష్ణ ఆదిత్య జిల్లాలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ జిల్లా వైద్యాధికారితో పాటు ఇతర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో కంటి వెలుగు శిబిరాలను తనిఖీలు చేపడుతూ శిబిరాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో కంటి వెలుగు నిర్వహణలో భాగస్వాములై కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.జిల్లాలో వేగవంతంగా కంటి పరీక్షలు.ప్రజల కంటి సమస్యలను తీర్చేందుకు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో ప్రజలు కంటి పరీక్షలకు వేగవంతంగా హజరవుతున్నారు. పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకంగా షెడ్యూల్‌ను రూపొందించుకొని జీపీ కార్యాలయాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరాలకు విశేష స్పందన జిల్లాలో అత్యధికంగా దగ్గరిచూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు శిబిరాలలో నమోదవుతున్న లెక్కలు చెబుతున్నాయి. 40 ఏళ్ల వయస్సు పైబడిన చాలామందికి దగ్గర చూపు కనిపించడం లేదని శిబిరానికి వస్తున్నారు. ఇలాంటి వారికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి, రీడింగ్ గ్లాసెస్ అందజేస్తున్నారు.

కమీషన్‌ అంటే ఆ కమీషనరే!?

` ఏ రోజు లెక్క ఆరోజే!!

`ప్రతి రోజూ కిలాసలు నిండాల్సిందే!

`లకారాలు లేనిదే ఇంటికి వెళ్లరంతే? 

`ఉద్యోగులను ఎవరినీ నమ్మడు!

`నలుగురు ప్రైవేటు వ్యక్తులతో వ్యవహారం నడిపిస్తాడు?

`సికింద్రాబాద్‌ లో అవినీతి పరాకాష్ఠకు చేరుకొని తబాదలయ్యాడు!

`ఓ మహిళా ఉద్యోగి పిర్యాధుతో ట్రాన్స్‌ ఫర్‌ తప్పలేదు.

`దీపావళి పండగ సమయంలో ఉద్యోగులకు టార్గెట్‌?

`ఆ టార్గెట్‌ ఫుల్‌ ఫిల్‌ చేయలేమని మహిళా ఉద్యోగి తిరుగుబాటు?

`ఫైళ్లకొచ్చేవి ఇస్తూనే వున్నాం…ఇంకా కావాలంటే ఆస్థులు అమ్ముకోలేం…ఇదీ ఆ మహిళా ఉద్యోగి సమాధానం!

`ఇక్కడ ఉద్యోగులను నమ్ముకోకుండా ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు!

`నగర శివారులో పదిహేనెకరాలు సంపాదించుకున్నాడు?

`నెల నెల కోట్లు కూడబెట్టుకుంటున్నాడు?

`ఎమ్మెల్యే ఎన్ని సార్లు హెచ్చరించినా తీరు మారడం లేదు?

`అడ్డూ, అదుపు లేని సంపాదన ఆపడం లేదు!

` అన్నీ ఆన్‌ లైన్‌ అనుమతులైనా సరే…అడిగినంత ముట్టజెప్పాల్సిందే!

`ఇక బిల్డర్లైతే ఏది కోరితే అది ఇవ్వాల్సిందే?

`ముగ్గు కనిపిస్తే చాలు…సంచులు పంపాల్సిందే?

`మోడల్‌ కారిడార్‌ పనుల్లో ఎంత కమీషనో అని గుసగుసలాడుతున్న ఉద్యోగులు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రజలకు మేలు చేయాల్సిన వాళ్లు, ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు, ప్రజల చెల్లించే పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల్లో కొంత మంది అవినీతి సంపాదనకు బాగా అలవాటు పడుతున్నారు. గతంలో ఇంత అవినీతి వుండేది కాదు. ఇంత పెద్ద ఎత్తున ముడుపులు తీసుకునే అవకాశం వుండేది కాదు. ఒక వేళ అవినీతి చేసేందుకు అవకాశం వున్నా, అధికారులు తప్పు చేసేవాళ్లు కాదు. లంచాలు తీసుకునే వాళ్లు కాదు. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ అధికారి గురించి విన్నా అవినీతి అన్న పదమే వినిపిస్తోంది. నేను లంచం తీసుకోను అన్న మాట మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. లంచం తీసుకునే అవకాశం లేని చోట ఉద్యోగం కూడా కావాలని కోరుకోవడం లేదు. ఏ కార్యాలయం సంపాదనకు ఆలవాలమో ముందే తెలుసుకుంటున్నారు. అలా తయారైంది వ్యవస్ధ. ఒకప్పుడు ప్రజలే తమ పని సకాలంలో ఇబ్బందులు లేకుండా పూర్తయితే ఎంతో కొంత ఇచ్చేవారు. కాని ఇప్పుడు ఆ పని చేసి పేడితే నాకేం లాభం…నాకేంత ఇస్తావు? అని నేరుగా ప్రశ్నించే అధికారులే ఎక్కవగా కనిపిస్తున్నారు. అంతే కాదు అడిగినంత ఇస్తే తప్ప పని చేసి పెట్టడం లేదు..కాదు..లేదు అన్న మాట ప్రజల నుంచి వస్తే ఇక అంతే సంగతులు… ఆ ఫైల్‌ ముందుకు వెళ్లేది లేదు. పని జరగడం అంత కన్నా లేదు. అలా తయారైంది వ్యవస్ధ. ముఖ్యంగా రియలెస్టేట్‌ విపరీతంగా పుంజుకోవడం, నగరాలలో జనాభా రోజు రోజుకూ పెరుగుతుండడంతో ప్రజల అవసరాలు ఉద్యోగులక వరాలుగా మారుతున్నాయి. లంచాలకు దారులు పరుస్తున్నాయి. లంచం తీసుకోవడం నేరమని తెలిసినా, తమను ఎవరు ఏం చేయలేరన్న ధైర్యం కూడా ఉద్యోగుల్లో పెరిగిపోయింది. ఒకప్పుడు అవినీతి నిరోధక శాఖ అంటే ఉద్యోగుల్లో అంతో ఇంతో భయం వుండేది. ఇప్పుడు అది కూడా లేదు. అసలు ఆ శాఖ ఏం చేస్తుందో కూడా తెలియకుండాపోతోంది. అటు రాజకీయ నాయకుల ప్రోద్భలం, ప్రజల బలహీనతల కారణంగా కొందరు ఉద్యోగులు ఆడిరది ఆట…పాడిరది పాటగా మారుతోంది. అవినీతి సంపాదనకు ఆలవాలమౌతోంది. ఒక్కసారి ప్రభుత్వ ఉన్నతోద్యోగం చేసే అవకాశం వస్తే చాలు..తర తరాలు కూర్చున్నా తరగతనంత ఆస్ధి సంపాదించుకునే అవకాశం ఎదురౌతోంది. ఇలా సంపాదనా పరులుగా మారిన ఉద్యోగులు ప్రజలకు దూరంగా, నాయకులకు దగ్గర వుంటూ, కోరుకున్న చోట పోస్టింగులు వేయించుకొని మరీ సంపాదనకు ఎగబడుతున్నారు. కోట్లు సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో జిహెచ్‌ఎంసిలో పనిచేసే ఓ డిప్యూటీ కమీషనర్‌ కూడా వున్నాడు. 

 అది ఒకప్పుడు గ్రామ పంచాయితీ ప్రాంతం. తర్వాత మున్సిపాలిటీ అయ్యింది. కొన్నేళ్ల క్రితం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చేరింది. ఐటి రంగమంతా ఇప్పుడు అక్కడే కనిపిస్తోంది. ఇంకేముంది ఆ పల్లె కాస్త పట్టణంగా రూపాంతరం చెందింది. ఇప్పుడు ఐటికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఒకప్పుడు ఆ ప్రాంతమంతా కాలుష్య కాసారంగా వుండేది. నగరానికి చాలా దూరం అనిపించేది. కాని ఇప్పుడు నగరంలో భాగమైంది. అసలైన నగరంగా ఆ పల్లే అభివృద్ది చెందింది. దాంతో రియలెస్టేట్‌ రంగం విసృతంగా పెరిగింది. పల్లె కాస్త ఆకాశహ్రమ్యాల నిర్మాణాలతో వెలిగిపోతోంది. అలాంటి సర్కిల్‌లో ఉద్యోగం అంటే మాటలా….మాట మాట్లాడితే చాలు మూట రావాల్సిందే…పెన్ను తీస్తే చాలు నోట్లు కనిపించాల్సిందే…సంతకం పెట్టాలంటే ప్రతి దానికి ఓ రేటు చెప్పాల్సిందే…అలాంటి సీట్లో కూర్చున్న డిప్యూటీ కమీషన్‌ సంపాదన గురించి వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే…అక్కడ పనిచేసే ఉద్యోగులు, పనుల కోసం వచ్చేవారు చెప్పే మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే…అంతే….

ఈసారు వారు ఇంతకు ముందు సికింద్రాబాద్‌ సర్కిల్‌లో పనిచేశారు. 

అక్కడ ఆయన కింద వుండే టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని కమీషన్ల సంపాదన కోసం వేధించుకుతినేవాడట. ఓ సందర్భంలో దీపావళి పండగకు ఒక్కొ ఉద్యోగి పది లక్షలు ఇవ్వాలని హుకూం జారీ చేశాడట. దాంతో ఓ మహిళా ఉద్యోగి నా వల్ల కాదని, ప్రతి ఫైలుకు అందాల్సినంత అందిస్తూనే వున్నాం…ఇంకా లక్షలు కావాలంటే మా ఇంటిని కుదువ పెట్టి ఇవ్వాల్సిందే…నేను ఇవ్వను…ఏం చేసుకుంటారో చేసుకోండి? అని మొహం మీదే చెప్పిందట. ఈ విషయం ప్రభుత్వ పెద్ద దాకా చేరిందట. దాంతో ఆ డిప్యూటీ కమీషనర్‌ను అక్కడినుంచి నగర శివారు సర్కిల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అయితే తంతే భూరల బుట్టలో పడ్డట్టు…మంచి ప్రైమ్‌ లోకేటేడ్‌ ఏరియాగా డెవలప్‌ అవుతున్న సర్కిల్‌కు రావడంతో ఆ కమీషనర్‌కు మరింత పంట పండిరది. కమీషన్ల ఆదాయం విపరీతంగా పెరిగింది. రియల్‌ రంగం ఎంత పెరిగిందో అంత సంపాదన మొదలైంది. ఆ ప్రాంతంలో ఇల్లు కట్టు కట్టుకోవాలన్నా, ఎవరైనా ఐదంతస్తు బిల్డింగ్‌ కట్టుకోవాలంటే కమీషన్‌ ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే..అంతా ఆన్‌లైన్‌ సిస్టమ్‌లోనే ధరఖాస్తులు అని చెబుతున్నప్పటికీ, నిర్మాణంలో లొసుగులు చూపించేసి మొత్తం కూల్చేస్తే తర్వాత ఎందుకు ఇబ్బంది అని ప్రజలు కూడా ఇవ్వడం అలవాటు చేసుకున్నారు. ఆ అధికారి సంపాదనకు అందరూ సహకరిస్తున్నారు. 

 ఇక వసూళ్ల పర్వంలో ఈ అధికారి కింది స్ధాయి అధికారులను నమ్మరు…సికింద్రాబాద్‌లో ఎదురైన అనుభవంతో ఆయన ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నారు.

 ఓ నలుగురు ప్రైవేటు వ్యక్తులకు ఆయన పనులు అప్పగిస్తారు. వారి పని నిత్యం సర్కిల్‌ పరిధిలో ఎక్కడ ఎలాంటి నిర్మాణాలు మొదలౌతున్నాయి. ఎక్కడ రిపేర్లు జరుగుతున్నాయి. ఎక్కడ నిర్మాణాలలో ఉల్లంఘనలు జరిగాయి. రోడ్లు ఎవరు ఆక్రమించుకున్నారు. ఎవరు పర్మిషన్ల కన్నా, ఎక్కువ ఫ్లోర్లు వేసుకున్నారు..పెంట్‌ హౌజ్‌లు ఎక్కడున్నాయి. వాటికి పర్మిషన్లు వున్నాయా? లేదా లాంటి వివరాలు సేకరించడం…ఆ డిప్యూటీ కమీషనర్‌కు వివరాలు అందించడం…ఇదీ నిత్యకృత్యం. ఇటు బిల్డింగ్‌ పర్మిషన్ల కోసం వచ్చే సంపాదనతోపాటు, అటు ఉల్లంఘన పేరుతో జరిగిన నిర్మాణాలపై దృష్టితో వచ్చే సంపాదన అంతా ఇంతా కాదు…నెలలో కోట్లు కూడబెడుతున్నాడని సమాచారం…

                        

                                 

                             ఇలాంటి అవినీతి అధికారిని ఎక్కడా చూడలేదు: ప్రజలు..బాధితులు

                               మా వల్ల కాదు…ఆ కమీషనర్‌ ఆగడాలు భరించలేం? అంటూ ప్రజలు , రియలెస్టేట్‌ వ్యాపారులు నేటిధాత్రిని ఆశ్రయించి, తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తాము ఎలాంటి తప్పులు చేయకపోయినా, ఉల్లంఘనల పేరుతో వేధింపులకు గురైన వారు కూడా అనేక మంది వున్నారు. ఇక పర్మిషన్ల విషయంలో ఎదురైన సమస్యలు అనేక మంది చెబుతూ, డిప్యూటీ కమీషనర్‌కు అవినీతిపై తమ బాధలు చెప్పుకుంటున్నారు. గతంలో ఎంతో మంది అధికారులను చూశాం కాని…ఇలాంటి అధికారిని ఎక్కడా చూడలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి అధికారిపై ప్రజలు చెప్పిన వివరాలతో కూడిన సమగ్ర కథనాలు వరుసగా మీ నేటిధాత్రిలో….

అంత్య క్రియలలో వివక్ష చూపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

దళిత ఎమ్మెల్యే అయినందుకేనా ఇంత వివక్ష

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ డిమాండ్.

చొప్పదండి/ నేటి ధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్      

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గత ఐదు సార్లు ఎమ్మెల్యే ఎన్నికలలో విజయం సాధించిన వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యే సాయన్న తేదీ 19.2 2023 రోజున అకాల మరణం పొందడం దళిత సామాజిక వర్గానికి తీరని లోటు అని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత బి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దళితుడైనందుకే అంత్యక్రియలు అధికారికంగా జరపకపోవడం చాలా బాధాకర విషయం నిజాం వారసులకు, అగ్రవర్ణ నాయకులకు, సినిమా యక్టర్ల కొంతమంది మరణిస్తే ప్రభుత్వ అధికారిక లాంచనాలు చేయడం వివక్షకు నిదర్శమని, నిరంతరం 20 సంవత్సరాల నుండి ప్రజాసేవ చేసే సాయన్నకు ఒక న్యాయమా ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కుటుంబం మీద ఏలాంటి వివక్ష లేకుంటే వారి కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే స్థాయిలో నామినేటెడ్ పదవి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.

గండిలచపేటలొ “ప్రజా గోస-బిజెపి భరోసా”

తంగళ్ళపల్లి : నేటి ధాత్రి 

 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండిలఛ్చపేట గ్రామంలో “ప్రజా గోస-బిజెపి భరోసా ” కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. 

 సురువు వెంకట్, శక్తి కేంద్రం ఇంచార్జీ “కర్రోళ్ల బాలకిషన్” ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు ” శీలం రాజు ” హాజరై మాట్లాడుతూ గ్రామంలో నిర్మించినటువంటి సిసి రోడ్లు, రైతు వేదికలు మరియు వైకుంఠ ధామాలు లాంటి అనేక అభివృద్ధి పనులకు కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని ” కరొన ” విపత్తు సమయంలో పేదలు ఎవరు ఆకలితో అలమటించద్దని మూడేళ్లగా పేదలకు ఉచితంగా నెలకు తల 5 కిలోల బియ్యం అందజేస్తున్న ఘనత “నరేంద్ర మోడీ” గారి ప్రభుత్వాన్ని దేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీ.జే.వై.ఎం ( బీజేవైఎం )జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి ,బూత్ అధ్యక్షులు కుక్కల బాలయ్య, బత్తుల సురేష్, బామ్మగారి వెంకట్, బీజేపీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version