సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానము

గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండల కేంద్రంలో గల రామాలయం ఆలయంలో ఈనెల 17 వ తేదీ బుధవారం రోజున జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవము, ఈనెల 18 వ తేదీ గురువారం రోజున జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు రావాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామాలయం ధర్మకర్త అనంతుల భూమయ్య, రామాలయ అర్చకులు తిరునాహరి సత్యనారాయణ చార్యులు, గొల్లపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, పీసు తిరుపతిరెడ్డి, గురిజాల బుచ్చిరెడ్డి, ముస్కు కొండల్ రెడ్డి, ముస్కు శ్రీనివాస్ రెడ్డి, సాతల్ల ఎల్లయ్య, ఏడ గొట్టి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు ఏ ఎస్ ఆర్ గార్డెన్ (కుందురు పల్లి ) నందు నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశానికిభూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలోనిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ,వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య,ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శాసనసభ్యులందరు భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి
పాల్గొంటారు.కావున కాంగ్రెస్ పార్టీ గణపురం మండలంలోని ప్రజా ప్రతినిధులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు ,బూత్ ఎన్ రోలర్స్ మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ కోరారు

ఎస్పీ కార్యాలయం రామనవమి,పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం నేటి ధాత్రి

ఈ నెల 17వ తారీకున భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం,మిథిలా స్టేడియంలో జరగనున్న రామనవమి మరియు మరుసటి రోజున జరగనున్న పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు.సెక్టార్ల వారీగా ఇన్చార్జ్ అధికారులు తమ క్రింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.సుమారుగా 2000 మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలియజేసారు.భక్తుల కొరకు పార్కింగ్ స్థలాలు,లడ్డూ కౌంటర్లు,సెక్టార్ల వివరాలను తెలియజేస్తూ జిల్లా పోలీసుల తరపున ప్రత్యేకంగా ఒక QR కోడ్ ను, అదేవిదంగా ఆన్లైన్ లింకు ( https://bhadrachalam.netlify.app ) ను రూపొందించడం జరిగిందని తెలిపారు.కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు.

ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు : ఐజీ ఏవీ రంగనాథ్

హసన్ పర్తి / నేటి ధాత్రి

వడ్డీ వ్యాపారులు ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్–1 ఐజీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. కొంత మంది వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. డబ్బు చెల్లించని వారి నుంచి బలవంతంగా ఇల్లు, పొలాల పత్రాలను తీసుకుంటున్నట్టుగా ఫిర్యాదులు అందడంతో ఆదివారం రంగనాథ్ స్పందించారు.మల్టీజోన్–1 జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, సంస్థల ప్రాంగణాల్లో జిల్లాల ఎస్పీలు సోదాలు చేపట్టారు. ఈ మేరకు ఐజీ ఆఫీసు ప్రెస్ నోట్ వెలువరించింది. దాడుల్లో వడ్డీ వ్యాపారుల ఇండ్లు, సంస్థల నుంచి పెద్ద మొత్తంలో నగదు
బంగారం, విలువైన డాక్యుమెంట్లు, చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కోర్టుల్లో అందజేయడంతో పాటు డబ్బును ఇన్ కంట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే 3 రోజులుగా దాడులు చేపట్టామని వెల్లడించారు.

విద్యార్థుల సమస్యలపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా : మంద నరేష్

హసన్ పర్తి / నేటి ధాత్రి

తెలంగాణ ఉద్యమం కోసం నిరంతరం పోరాడిన వారికి ఏ రాజకీయ పార్టీ కూడా వరంగల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కేటాయించలేదని ఏ బి ఎస్ ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు కావున విద్యార్థులు, ఉద్యమ కారులు తమకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

తెలంగాణ ప్రజా గొంతుక నేను. -కరీంనగర్‌లో నాదే విజయం.

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09/4

ఎంపిగా కరీంనగర్‌ ప్రగతికి మార్గం వేసాను.

కరీంనగర్‌ లో గెలుపు నాదే అంటున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు ప్రచార విశేషాలు ఆయన మాటల్లోనే…

తెలంగాణ కోసమే పుట్టింది బిఆర్‌ఎస్‌.

బిఆర్‌ఎస్‌ కు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం.

తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్‌ఎస్‌.

తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టింది కేసిఆర్‌.

తెలంగాణ తెచ్చి అన్నపూర్ణగా మార్చింది కేసిఆర్‌.

బంగారు తెలంగాణ చేసింది కేసిఆర్‌.

నాలుగు నెలల్లో తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెస్‌.

అరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్‌.

పచ్చగా వున్న రైతును మళ్ళీ గోసపుచ్చుకుంటున్నది కాంగ్రెస్‌.

పచ్చగా కళకళలాడిన తెలంగాణను ఎడారి చేస్తోంది కాంగ్రెస్‌.

పదేళ్ళలో తెలంగాణకు బిజేపి చేసిందేమీ లేదు.

రూపాయి నిధులిచ్చింది లేదు.

బిజేపి ఎంపి. పైసా తెచ్చింది లేదు.

తెలంగాణ ఉద్యమంలో వున్నది నేనే.

కరీంనగర్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది నేనే.

ఒక్కసారి కరీంనగర్‌ ప్రజలు బిజేపిని నమ్మితే ఒక్క పని చేయలేదు.

ఎంపిగా తెలంగాణ సమస్యలు అనేకం కేంద్రం దృష్టికి తెచ్చింది నేను.

కేంద్ర నిధుల కోసం కొట్లాడిరది నేను.

కరీంనగర్‌ లో ఓట్లడిగే నైతికత కాంగ్రెస్‌, బిజేపిలకు లేదు.

ప్రజల్లో వారికి గుర్తింపు లేదు.

తెలంగాణ ప్రజల గుండెలు పిండుతున్న ఆ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదు.

పార్లమెంటు ఎన్నికలలో కారుదే జోరు.

నమ్మిన ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌ నైజం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఇస్తామని చెప్పి పదేళ్లపాటు తెలంగాణ ప్రజలను గోస పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. గెలిచేదాక తెలంగాణ జపం చేసి, గెలిచాక తెలంగాణను మోసం చేయాలని చూసిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ. దాంతో కాంగ్రెస్‌ మెడలు వచ్చి, తెలంగాణలో ఉద్యమం రగిలించి, ప్రజల గుండెల నిండా తెలంగాణ నినాదాన్ని నింపింది కేసిఆర్‌. తెలంగాణకోసం ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ సాధించింది కేసిఆర్‌. సాధించిన తెలంగాణన అన్న పూర్ణ చేసింది కేసిఆర్‌. తెలంగాణ బతుకును బంగారంగా మార్చింది కేసిఆర్‌. పదేళ్ల తర్వాత మరోసారి తెలంగాణను మాయ చేసి, మభ్యపెట్టి అలవి కాని హామీలతో, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తన వెనకటి గుణాన్నే చూపిస్తోంది. తెలంగాణ ప్రజలను వంచనకు గురి చేస్తోంది. తన నీతి మాలిన తనాన్ని వదులుకోలేదని మరోసారి నిరూపిస్తోంది. తెలంగాణ ప్రజలను మళ్లీ బాధల్లోకి నెట్టేస్తోంది. ఒక్కనాడు కూడా తెలంగాణ అనని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి, తెలంగాణను మళ్లీ ఆగం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు తెలంగాన అంటే అర్ధం కూడా తెలియదు. తెలంగాణ అస్ధిత్వం ఎంత గొప్పదో తెలియదు. తెలంగాణ ఆత్మ గౌరవం అంతకన్నా తెలియదు. కేవలం డిల్లీ నాయకులకు ముందు మోకరిల్లడం తప్ప కాంగ్రెస్‌ నాయకులకు మరేం తెలియదు. పదవులుంటే చాలు, అదికారముంటే చాలు తెలంగాణ ప్రజలు ఏమైపోయినా ఫరవాలేదనుకునే గుణం కాంగ్రెస్‌పార్టీది. ఆ పార్టీ నాయకులది. ఓ వైపు తెలంగాణ గొంతెండుతుంటే కూడా పట్టించుకునే తీరిక కాంగ్రెస్‌ నాయకులకు లేదు. తెలంగాణ పల్లెకు నీటికి గోస పడుతుంటే వినే ఓపిక కాంగ్రెస్‌ నాయకులకు లేదు. అందుకే పల్లెలు ఏడుస్తున్నాయి. కాంగ్రెస్‌కు శాపనార్ధాలు పెడుతున్నాయి. ఇక బిజేపి తెలంగాణ చేసిందేమీ లేదు. తెలంగాణ మేలు కోరిందేనాడు లేదు. పదేళ్లలో బిజేపి తెలంగాణకు తీరని అన్యాయమే చేసింది. పదేళ్లలో బిజేపి ఇచ్చిన నిదులు లేవు. చేసిన అభివృద్ది లేదు. మాటలు కోట దాటించి, ప్రజలను మతం మత్తులో ముంచి, ఓట్లు దండుకోవడం తప్ప, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బిజేపి చేసిందేమీ లేదు. అందుకే తెలంగాణ ప్రజలు బిజేపిని కూడా నమ్మే పరిస్ధితుల్లో లేరు. తెలంగాణ ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్సే…ప్రజల గుండెల్లో వున్నది కేసిఆరే..అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కారుకు ఎదురులేదని, తెలంగాణ ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్సే అని నిరూపణ జరగబోతోందని, కాంగ్రెస్‌, బిజేపిలకు తగిన గుణ పాఠం తప్పదని అంటున్న కరీంనగర్‌ పార్లమెంటు అభ్యర్ధి బోయిన పల్లి వినోద్‌ కుమార్‌తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుకు వివరించిన ఎన్నికల ప్రచార విశేషాలు, తెలంగాణ ప్రజల మనోభావాలు ఆయన మాటల్లోనే…

నేను తెలంగాణ గొంతుకను. తెలంగాణ కోసం కేసిఆర్‌తో కలిసి సాగాను. గతంలో ఎంపిగా కరీంనగర్‌ ప్రగతినికి మార్గం వేశారు. దేశంలోనే ఎక్కువగా పార్లమెంటుకు హజరైంది నేనే. అదంరికన్నా ఎక్కువగా తెలంగాణ సమస్యలు ప్రస్తావించి, పరిష్కరించేందుకు ప్రశ్నించి, సమస్యల సాధనుకు, అభివృద్దికి నిధులు తేవడం కోసం కొట్లాడాను. కరీంనగర్‌ అభివృద్దికి బాటలు వేశాను. తెలంగాణ కోసమే పుట్టింది బిఆర్‌ఎస్‌ పార్టీ. అందుకే తెలంగాణ సాధించింది. తెలంగాణను పదేళ్లలో అభివృద్ధి పలాలు అందించింది. అంత గొప్పది బిఆర్‌ఎస్‌ పార్టీ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసిఆర్‌ చేసిన అధ్భుత ప్రగతి ప్రపంచంలోనే ఏ నాయకుడు చేయలేదు. డెబ్బె ఏళ్లుగా వెనకకు నేట్టేయబడి, ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణ పౌరులుగా బతికిన తెలంగాణ ప్రజల్లో ఆత్మ గౌరవం నింపింది కేసిఆర్‌. అభివృద్ది బాటలు వేసింది కేసిఆర్‌. పదేళ్లలో పల్లెల రూపు రేఖలు మార్చాడు. ముఖ్యంగా కరీంనగర్‌ జిల్లాలను సస్యశ్యామలం చేశాడు. కరీంనగర్‌ను అన్నపూర్ణగా మార్చాడు. పదేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ పార్టీ ఇక భవిష్యత్తు లేదని ఎలాగైనా అధికారంలోకి రావాలని 420 హమీలు ఇచ్చింది. అప్పుడు ప్రజలకు అనుమానం వచ్చింది. కానీ ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీలంటూ అబద్దాలను పదే పదే చెప్పి, ప్రజలను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్‌ పార్టీ. ప్రజలకు చాలా తొందరగానే ఈ విషయం అర్ధమైంది. కాంగ్రెస్‌ అంటే కరువు, కరంటు కోతలే అని కేసిఆర్‌ ఎంత చెప్పినా వినిపించుకోలేదని ప్రజలు మధనపడుతున్నారు. ఎంతో చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలను కూడా కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసింది. మళ్లీ తెలంగాణను గోస పెడుతోంది. నెల రోజుల్లోనే కాంగ్రెస్‌ పార్టీ బాగోతం బైట పడిరది. ప్రజల సంక్షేమం పక్కన పెట్టి కక్ష్య సాధింపు తప్ప మరేం చేత గాని కాంగ్రెస్‌ నైజం ప్రజలకు తెలిసిపోయింది. తెలంగాణను ఐదేళ్లపాటు గంగాలం చేసిన కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసి, తెలంగాణకు కరువు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. రైతుల సంక్షేమం విస్మరించి, తన పంతాలు పట్టింపులతో తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేసింది. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ చేతిలో ఎంత మోసపోయామో అర్దం చేసుకుంటున్నారు. పంటలకు నీళ్లివ్వక, నాణ్యమైన కరంటు ఇవ్వక రైతుల ఆరుగాలం శ్రమను అక్కరకు రాకుండా చేసిన కాంగ్రెస్‌ పార్టీమీద కసితో వున్నారు. రైతు బంధును రూ.15వేలు చేస్తామని నమ్మించి, అసలుకే ఎసరు పెట్టిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దమౌతున్నారు. రెండు లక్షల రుణమాఫీ పేరుతో ప్రజలు మభ్యపెట్టి మోసం చేసిన కాంగ్రెస్‌ అంటేనే ప్రజలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. పచ్చగా వున్న తెలంగాణను ఎడారి చేసి ఎండబెడుతున్న కాంగ్రెస్‌కు తెలంగాణలో ఇక నూకలు చెల్లినట్లే.
పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి తెలంగాణకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. తెలంగాణకు విభజన చట్టం హమీలను అమలు చేయాల్సిందిపోయి, తెలంగాణను దగా బిజేపి దగా చేసింది. తెలంగాణలో ఐటి విప్లవానికి తోడు కావాల్సిన ఐటిఐఆర్‌ను గుజరాత్‌ తరలించుకుపోయి, తెలంగాణ యువత నోట్లో మట్టికొట్టిన బిజేపిని తెలంగాణ ప్రజలు సహించేందుకు సిద్దంగా లేరు. కాజీ పేట కోచ్‌ ప్యాక్టరీ మీద మిగిలివున్న ఆశలను వమ్ముచేసి, ఆశలను కూడా తుంచేసిన పార్టీ బిజేపి. తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోతలు పెడుతూ, తెలంగాణ ప్రగతిని అడ్డుకున్న బిజేపి. ఒక వేళ తెలంగాణ ప్రజలు పొరపాటున కాంగ్రెస్‌ను నమ్మినట్లు నమ్మితే రైతుల మోటార్లకు మీటర్లు ఖాయం. ఖచ్చితంగా రైతాంగం నుంచి ముక్కుపిండి కరంటు బిల్లులు వసూలు చేయడం తధ్యం. కేసిఆర్‌ పదేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడిచేసినా, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఆపినా రైతులకు అన్యాయం జరగనివ్వలేదు. కాని కాంగ్రెస్‌, బిజేపిలు రైతులను ఎలా వంచించాలని గోతి కాడ నక్కల్లా ఎదరుచూస్తున్నాయి. అందుకే తెలంగాణ ప్రయోజనాల కోసం పాటు పడేది, పోరాటం చేసేది, తెలంగాణ ఆత్మ గౌరవం నిండి వున్నది ఒక్క బిఆర్‌ఎస్‌ పార్టీయే. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజేపిలకు తగిన గుణ పాఠం ప్రజలు నేర్పుతారు. ఆ పార్టీలకు తెలంగాణలో చోటు లేదని నిరూపిస్తారు. ఇక కరీంనగర్‌ విషయంలో బిజేపి ఎంపి నమ్ముకున్న మత రాజకీయమే ఆయనకు కర్రు కాల్చి వాత పెడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, ఆయనలో మానవత్వం మేలుకోవడం లేదు. మతం తప్ప ఆయన నోటి నుంచి మరో పదం రావడంలేదు. ప్రజా శ్రేయస్సు గాలిలో కలిసినా పరవాలేదు. ప్రజల మధ్య మతం చిచ్చు పెట్టి ఎన్నికలు రాజకీయం కాచుకోవాలని చూస్తున్న బండి సంజయ్‌కి మరోసారి పరాభవం తప్పదు. కాంగ్రెస్‌కు కరీంనగర్‌లో స్కోపే లేదు. గెలిచేది నేనే. ప్రజలు మావైపే. కేసిఆర్‌ లేని తెలంగాణ పాలన ఎంత ఆగమ్య గోచరంగా వుందో, ఎన్ని గోసలు పడాల్సివస్తుందో ప్రజలకు తెలిసింది. ఒక్కసారి నమ్మినందుకే ఇంతగా బతుకులు పొయ్యిలో వేసుకున్నట్లైంది. ఇంకా ఆ పార్టీలను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరు. రాజకీయాలు తప్ప, ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్‌, బిజేపిలను ప్రజలు తరిమికొట్టే రోజులు కూడా దగ్గర్లోనే వున్నాయి.

కౌమర దశ కార్యక్రమం పై అవగాహన

గొల్లపల్లి నేటి ధాత్రి:
ఆదర్శ పాఠశాల గొల్లపల్లి యందు ఆడ పిల్లల సాధికారక క్లబ్ ఆధ్వర్యంలో కౌమర దశ కార్యక్రమం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కౌమర దశలో వచ్చే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆడపిల్లల సాధికారత తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు చైల్డ్ హెల్ప్ లైన్, విమెన్ హెల్ప్ లైన్ కు సంబంధించిన విషయాలను కార్యక్రమంలో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా ప్రోగ్రాం కన్వీనర్ తాడూరి శ్రీనివాస చారి విద్యార్థులకు ఆడపిల్లల సాధికారత సంబంధించిన విషయాలను ప్రధాన వక్తగా తెలియజేశారు. కౌమార దశలో జాగ్రత్తగా వ్యవహరించాలని పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా కన్వీనర్ తాడూరి శ్రీనివాసచారి, పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తో పాటు తిరుపతి వైస్ ప్రిన్సిపాల్ కాంతం నగేష్, ఎన్ పెద్దన్న, టి రాజేశ్వరి, ఏ సంధ్యారాణి, జి సంధ్య, అర్చన, అన్నపూర్ణ, కె రజిత, ప్రియాంక విద్యార్థులు పాల్గొన్నారు.

జైపూర్ మండల్ పలు గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

జైపూర్ నేటి ధాత్రి

శివాజీ సేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 133 వ జయంతి

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ సేన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 133 వ జయంతి సందర్బంగా అంబేద్కర్ ఫోటో కి పూలమాలవేసి పాలాభిషేకం చేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవలు మరువలేనివని, కుల వివక్షను రూపుమాపి సమ సమాజాన్ని నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు.ఇట్టి కార్యక్రమంలో శివాజీ సేన వ్యవస్థాపకుడు మంతెన ఉదయ్ కిరణ్, అధ్యక్షుడు మెరిమిడి గణేష్, కోశాధి కారి మంతెన రవితేజ, ప్రచార కార్యదర్శి వేల్పుల సంజయ్,సహ కార్యదర్శి వేముల సాయికిరణ్ గౌడ్, సభ్యులు గణేష్, జనగామ నితిన్ ఎం ఆర్ పి ఎస్ నాయకులు పాల్గొన్నారు.

టేకుమట్ల గ్రామంలో అంబేద్కర్ 133 జయంతి వేడుకలు

జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు నాయకులు యువకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఉజ్వలమైన భవిష్యత్తుకు విద్య ఒకటే మార్గం అని అంబేద్కర్ తెలిపిన బాటలో భావితరాలు నడవాలని గ్రామ పెద్దలు మాట్లాడారు.

ఇందారం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు

జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది నాయకులు ప్రజలు అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, అపరవిద్యవేత్త, రాజ్యాంగ శిల్పి, ఉద్యమ జ్యోతి అయినటువంటి అంబేద్కర్ చూపించిన బాటలో పయనించి యువత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని తెలియజేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి అనిల్ కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామాల సమీపంలో అడవి దున్నలు

గంగారం, నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్దఎల్లాపురం, మర్రిగూడెం గ్రామాల సమీపంలో అడవి దున్నల మంద వచ్చి మేత మేస్తున్నాయి అది చూసిన బాటసారులు భయందోళన చెందారు గిరిజన రైతులు..ప్రయాణికులు దారి వెంట వెళ్లాడనికి భయపడుతున్నారు

ప్రజా నాయకుడి వెంటే నడుస్తాం,కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం: జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి,ఏప్రిల్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గ హైదర్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు.

హైదర్ నగర్ డివిజన్ కు చెందిన బిఆర్ఎ స్ పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి తండా నుంచి సుమారు 300మంది తో ప్రజా నా యకుడి వెంటే నడుస్తామ ని,కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం గ్రహించి ఈరోజు చేవెళ్ల పార్ల మెంట్ సభ్యు లు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి, నియోజ కవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచా ర్జ్.జగదీశ్వర్ గౌడ్ నాయ కత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరి గింది.బిఆర్ఎస్ పార్టీ నుండీ కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిళ నాయకులు,కార్య కర్తలకు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు.టూరిజాం డెవల ప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,ఎం.బి.సి డెవలప్మెంట్ చైర్మన్ జేరిపేటి జైపాల్,కాం గ్రెస్ సీని యర్ నా యకులు కూన సత్యంగౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో జరిగింది.

అమ్మవారి ఆలయంలో అధిక ధరకు టెంకాయల చలామణి.

సోయి లేకుండా వ్యవహరిస్తున్న సంభందిత అధికారులు.

టాప్ లేపిన టెంకాయ ధర..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

అయ్యో.. మెసమ్మ .. మీ మొక్కుబడి తీర్చుకోవడానికి మేము వస్తే.. ఇక్కడ టెంకాయల విక్రయదారులు ధరకు మించి వసూళ్లు చేస్తూ మా చేతికి కుళ్లిన టెంకాయలు ఇస్తున్నారమ్మ అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతాపూర్ మైసమ్మ ఆలయనికి ప్రతి ఆది మంగళ గురువారాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. భక్తుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ఒకవైపు వ్యాపారులు, మరోవైపు దళారులు మోసానికి పాల్పడుతున్నారు. భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి కి కొబ్బరికాయ కొట్టి మొక్కలు చెల్లించుకోవడం ఆనవాయితీ. జాతరలో టెంకాయల విక్రయ టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్ తన కడుపు చల్లగుండ టెంకాయలతో పాటు కుళ్లిపోయిన టెంకాయలను సైతం భక్తులకు అంటగడుతున్నాడు.

ఒక టెంకాయ 25 రూపాయలకు విక్రయించాల్సి ఉండగా 30 రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. కానీ టెండర్ దారులు ఒక్క టెంకాయ ఇవ్వకుండా రెండు టెంకాయలు కట్టబెట్టి 60 రూపాయలు వసూలు చేస్తున్నారు.దుకాణదారులు విక్రయించే టెంకాయలలో రెండు మూడింటిలో ఒకటి కుళ్లిపోయి ఉంటున్నట్లుగా భక్తులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. మంచి టెంకాయలే అమ్ముతానని హామీ ఇచ్చి మళ్లీ కుళ్లిపోయిన టెంకాయలే విక్రయిస్తున్నాడు. అధికారుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా కుళ్లిన టెంకాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నా ఆలయ సీఈవో అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటనీ భక్తులు మండిపడుతున్నారు. ఆలయ పరిసరాల్లో అక్కడక్కడ కుళ్లిపోయిన టెంకాయలు కుప్పలు తిప్పలుగా పడి ఉంటున్నాయి. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి నాణ్యతతో కూడిన టెంకాయల విక్రయాలు అధిక ధరలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో 105,106,107,108బూత్ లలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ నీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి గడప గడపకు స్టిక్కర్, నరేంద్ర మోదీ, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ది పనుల కరపత్రంలను పంపిణి చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ చొప్పదండి నియోజకవర్గం ప్రభారీ రాజేష్, బీజేపీ జిల్లాకార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ఉపాధ్యక్షులు జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శి వెల్ముల రమేష్, బూత్ కమిటి అధ్యక్షులు కంకణాల ఆనందం, వేముల గణేష్, జిట్టా రాజు, చింతల తిరుపతి, సామల చందు, గొండ మధు, గాండ్ల సాయి కుమార్, ఉప్పు రవీందర్, జిల్లెల్ల సురేష్, గాండ్ల లచ్చయ్య, అవుదరి శేఖర్, అవుదరి సంపత్, అంబటి వినోద్, అమిరిశెట్టి సురేష్, అమిరిశెట్టి తిరుపతి, సాగర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మనస్తాపంతో నిరుద్యోగి ఆత్మహత్య

హసన్ పర్తి / నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామం లో ఆకుల భారతి పెద్ద కుమారుడైన ఆకుల రంజిత్ వయసు 30 సం.. గత 2, 3 సం.. ల నుండి 3 సార్లు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి అప్లై చేసి పరీక్షలు రాయగా ఉత్తీర్ణత సాధించక పోవడంతో ఉద్యోగం రావట్లేదని గత 4 రోజుల నుండి మనస్థాపం చెందుతూ ఇంట్లో ఎవరు లేని సమయం లో లుంగీ తో ఉరి వేసుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు క్రిందికి దించి 108 అంబులెన్స్ కి కాల్ చేయగా వారు వచ్చి అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు రోదించారు.

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి
పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ప్రియాంక తన తండ్రి జ్ఞాపకార్థంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.దానిని పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం జూనియర్ అసిస్టెంట్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో నడికుడ యంపిడిఓ శ్రీనివాస్,మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్, కార్యాలయ పర్యవేక్షకులు శైలశ్రీ,ఏపిఓ ఇందిర,టెక్నికల్ అసిస్టెంట్ సుమలత, కార్యాలయ సిబ్బంది, ఈజియస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో నరేన్ గార్డెన్ లో 170 మంది పార్టీలో చేరారు

కూకట్పల్లి ఏప్రిల్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రె స్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజిన్ కార్పొరేట ర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మ హిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, గౌరవ అధ్యక్షురాలు మధులత,సీనియర్ నాయ కులు బాలస్వామి,మో జెస్,పోశెట్టిగౌ డ్,యాదగిరి,ఫారూఖ్,ఖాలీమ్,భిక్షపతి,రవీందర్,పుట్టం
దేవి,సరిత,పర్వీన్,యస్మిద్,మహముదాలు కాంగ్రెస్ కండువా కప్పు కుని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరితో పాటు సుమారు వందమంది కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవడం జరిగింది.సోమవా రం రోజు ఉదయం నల్లగండ్లలోని జగదీ శ్వర్ గౌడ్ సమక్షంలో సుమారు 170 మంది నరేన్ గార్డెన్ లో పార్టీలో చేరారు. అంతకు ముందు నల్లగండ్ల లోని ఆయన నివాసం వద్ద 30 మంది పార్టీ తీర్థం పు చ్చుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మారిన కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఈ విషయాన్ని మీడియా మిత్రులతో తెలి యజేశారు.ఈ సందర్భంగా కార్పొ రేటర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రాను న్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేసి చేవెళ్ల పార్ల మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించా లని అన్నారు.కార్యక్ర మంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్,అగ్రవాసు,సంగమే ష్,రాజు,అరుణ,బాలస్వామి సాగర్,త దితరులు పాల్గొన్నారు.

ఎంపీపీగా జవ్వాజి హరీష్ ఏకగ్రీవం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికపై డిఆర్డివో శ్రీధర్ ఎన్నికలు నిర్వహించారు. ఈఎన్నికల్లో ఎంపీపీ పదవికి జవ్వాజి హరీష్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ బీఫాంతో నామినేషన్ దాఖలు చేయడంతో రామడుగు మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా జవ్వాజి హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని డిఆర్డివో తెలిపారు. మొత్తం పద్నాలుగు మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా వెలిచాల గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు గతంలోనే రాజీనామా చేయగా మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. మిగిలిన పదకొండు మంది సభ్యులతో ఎన్నికలు నిర్వహించగా జవ్వాజి హరీష్ ను ఏకగ్రీవంగా ఎన్నికోవడంతో, హరీష్ కు నియామక పత్రాన్ని డిఆర్డివో అందజేశారు. ఎంపిక అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నమస్కరించి హరీష్ ఎంపిపిగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా చోప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హాజరై హరీష్ ను అభినందించారు. ఎంపిపి హరీష్ మాట్లాడుతూ రామడుగు మండల పరిషత్ అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అన్ని పార్టీల సహచర ఎంపిటిసి సభ్యులకు మొట్టమొదటగా నాహృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈమండలంలో ఉన్నత బాధ్యతలు రావడానికి అవకాశం కల్పించిన వన్నారం, కొక్కెరకుంట గ్రామ ప్రజలకు జీవితాంతం ఋణపడి ఉంటానని, ఎంపిటిసిగా ప్రయాణం చేపట్టిన నాటి నుండి నేడు ఎంపిపిగా పదవీ బాధ్యతలు చేపట్టేవరకు నాకు అన్ని విషయాల్లో సహకరించిన పాత్రికేయ మిత్రులకు ఈసందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, అతి పిన్న వయసులోనే నాలో వున్న రాజకీయ ఆసక్తిని గుర్తించి, ఎంపిటిసి టిక్కెట్ ఇచ్చి గెలిపించడమే కాకుండా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చొప్పదండి నియోజకవర్గంలోనే తనకి మొట్టమొదటి అవకాశం కల్పించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి ఈసందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతఙ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఉన్న ఈకొద్ది సమయం అయినప్పటికి యువ నాయకులు చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం సంపూర్ణ సహాయ సహకారాలతో రామడుగు మండలాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తనకు సహకరించిన ప్రతీ ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాని తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, ఎంపిడివో రాజేశ్వరి, సూపరింటెండెంట్ రాజేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మైలారం గ్రామంలో రక్తదాన శిబిరం

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సోమవారం మైలారం గ్రామంలో తెలంగాణ వాలంటరీ బ్లడ్ బ్యాంకు వారికి ధర్మసమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మహారాజ్ రక్తదానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని రక్త దానం చేయడం వల్ల కులమత బేధాలు లేకుండా . ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరినో కాపాడుకునే ఆవాకాశముంటుందని ముందుగానే అపాయాలను దృష్టిలో ఉంచుకొని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినందుకు నా యొక్క అభినందనలు తెలియజేస్తు నేను రక్తదానం చేసినందుకు ఎంతో గర్వపడుతున్నా నేను ఇచ్చిన రక్తముతో ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం వచ్చింది అందుకే ప్రతి ఆరోగ్యవంతుడు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని కాపాడుకోవాలని అదే మానవ ధర్మమని తెలిపారు.

జైపూర్ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు

నేటి ధాత్రి జైపూర్ :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట, మిట్టపల్లి, రసూల్ పల్లి, నర్వ , టేకుమట్ల బెజ్జాల గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీని వీడి సోమవారం రోజున చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే వివేక్ అందరికీ కండువాలు కప్పి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఇంతమంది పార్టీలోకి చేరడం చాలా సంతోషకరంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త శ్రేయస్సు కోరుకుంటుందని, అమ్మలా ఆదరిస్తుందని, పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ముందుకు సాగాలని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా మారుతుందని తెలిపారు. అలాగే చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడపడానికి నా సాయ శక్తుల కృషి చేస్తానని, ఎటువంటి సమస్యనైనా తమ దృష్టికి తీసుకురావాలని వీలైనంత త్వరగా పరిష్కారాన్ని చూపిస్తామని తెలియజేశారు. పార్టీలోకి చేరిన నూతన కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఎక్కువ మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తవక్కల్ విద్యార్థినిలను అభినందించిన చైర్మన్ అబ్ధుల్ అజీజ్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణం లోని తవక్కల్ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఆశ్లేష, దీక్షిత,రచన,ఐశ్వర్య, శ్రీవైష్ణవి లు మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో జాతీయస్థాయిలో మూడవ స్థానం సాధించారని, భారతదేశ గౌరవ పురస్కారానికి ఎంపికయ్యారని, ఈ నెల 8న హైదరాబాద్ లో వీరికి భారతదేశ గౌరవ పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలను సైతం అందజేశారని తవక్కల్ విద్యా సంస్థల ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. సోమవారం రామకృష్ణాపూర్ పట్టణం లోని తవక్కల్ పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను వారి తల్లిదండ్రులను తవక్కల్ విద్యా సంస్థల చైర్మైన్ అబ్దుల్ అజీజ్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… చదువు తో పాటు సాంస్కృతిక రంగాలలో రాణిస్తున్న విద్యార్థుల కృషిని వారి తల్లితండ్రుల ప్రోత్సహాన్ని సైతం కొనియాడుతున్నానని అన్నారు. తమ పాఠశాల విద్యార్థులకు ఇంత చక్కటి తోడ్పాటునందించి వారి విజయానికి కృషి చేసిన సమీక్ష ఆర్ట్స్ అకాడమీ వారి కృషిని కూడా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, ఉపాధ్యాయబృందం విద్యార్థులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి 65 వ డివిజన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో Rs.25000 /- ఆర్థిక సహాయం*

హసన్పర్తి (నేటిదాత్రి ) :

ఆదివారం రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇటీవల మృతి చెందిన చుంచు సురేష్ గారి ఇంటికి వెళ్లి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు. సురేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని, చిన్న వయసులోనే చుంచు సురేష్ గారు మరణించడం వారి కుటుంబానికి తీరని లోటు అని శ్రీ నాగవల్లి రమేష్ , శ్రీ వెన్నపురెడ్డి జగన్ ,పోరిక స్వప్న రాజు నాయక్(బీజేపీ కంటెస్టెడ్ అభ్యర్థి) మేకల చంద్రబాబు, కాగితోజు అఖిలేష్, అభిలాష్, సూరం రంజిత్, తిరుమల్, నితిన్ గారు నివాళులు అర్పించారు మరియు బిజెపి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు వారికి ఆర్థికంగా 25 వేల రూపాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా, వచ్చే విద్యా సంవత్సరం జూన్ లో వారి పిల్లలకు కావలసిన నోట్స్ బుక్స్ కూడా ఇస్తామని పోరిక స్వప్నరాజు నాయక్ గారు సురేష్ కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది.

error: Content is protected !!
Exit mobile version