మైలారం గ్రామంలో రక్తదాన శిబిరం

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సోమవారం మైలారం గ్రామంలో తెలంగాణ వాలంటరీ బ్లడ్ బ్యాంకు వారికి ధర్మసమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మహారాజ్ రక్తదానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని రక్త దానం చేయడం వల్ల కులమత బేధాలు లేకుండా . ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరినో కాపాడుకునే ఆవాకాశముంటుందని ముందుగానే అపాయాలను దృష్టిలో ఉంచుకొని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినందుకు నా యొక్క అభినందనలు తెలియజేస్తు నేను రక్తదానం చేసినందుకు ఎంతో గర్వపడుతున్నా నేను ఇచ్చిన రక్తముతో ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం వచ్చింది అందుకే ప్రతి ఆరోగ్యవంతుడు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని కాపాడుకోవాలని అదే మానవ ధర్మమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *