వరి కొయ్యల కాల్చివేతపై అవగాహన…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T145204.893.wav?_=1

 

వ్యవసాయ క్షేత్రంలో వరి కొయ్యలు కాల్చడం వలన జరిగే నష్టాలను వివరించిన వ్యవసాయ అధికారులు.

చందుర్తి, నేటిధాత్రి:

 

ఈ రోజు చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో వరి పంట క్షేత్రాలను వ్యవసాయ అధికారులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భం గా రైతులతో మాట్లాడుతూ వరి కొయ్యలను కాల్చడం వల్ల జరిగే నష్టాలు, కలియదున్నడం వల్ల కలిగే లాభాలు గురించి తెలియచేయడం జరిగింది.

వరి కొయ్యలు కాల్చడం వల్ల భూసారం తగ్గి, పంట దిగుబడి తగ్గిపోతుంది. దీని బదులుగా, పొలంలో కలియ దున్నితే అది సేంద్రియ ఎరువుగా మారి భూమికి మేలు చేస్తుంది. కొయ్యలను కాల్చడం వల్ల మిత్ర పురుగులు, భూమిలోని పోషకాలు తగ్గిపోతాయి.

వరి కొయ్యలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు

భూసారం తగ్గిపోతుంది: వరి కొయ్యలు కాల్చితే భూమిపై ఉన్న పైపొర గట్టిపడి, నీరు భూమిలోకి ఇంకడం తగ్గిపోతుంది.

పోషకాలు ఆవిరైపోతాయి: నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పంటకు మేలు చేసే పోషకాలు ఆవిరైపోతాయి.

మిత్ర పురుగులు నశిస్తాయి: భూమిలోని మిత్ర పురుగులు, ఎర్రలు చనిపోతాయి.

దిగుబడి తగ్గుతుంది: భూసారం తగ్గడం, పోషకాలు కోల్పోవడం వల్ల దిగుబడి తగ్గుతుంది.

పర్యావరణానికి హాని: వాతావరణ కాలుష్యం పెరుగుతుంది మరియు ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది.

వరి కొయ్యలను పొలంలో కలియ దున్నడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఎరువుగా మారుతుంది: వరి కొయ్యలు పొలంలో కలియ దున్నితే సేంద్రియ ఎరువుగా మారతాయి. దీనివల్ల ఎకరానికి దాదాపు టన్ను ఎరువు తయారవుతుందని అంచనా.

పోషకాలు లభిస్తాయి: భూమికి అవసరమైన పోషకాలు తిరిగి లభిస్తాయి.

సింగిల్ సూపర్‌ ఫాస్ఫేట్‌ వాడకం: కొయ్యలు త్వరగా కుళ్లిపోవడానికి దున్నే ముందు సింగిల్ సూపర్‌ ఫాస్ఫేట్‌ను చల్లవచ్చు.

ఈ క్షేత్ర పరిశీలన లో మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారి శిరీష, మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version