నూతన ఎస్సైగా పీ. సుబ్బారావు బాధ్యతలు స్వీకారం
తిర్యాణి ( మంచిర్యాల):
తిర్యాణి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పీ. సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.
మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై లాల్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, మహిళా కానిస్టేబుళ్లు జ్యోతి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
