సర్వమత సమానత్వం మన దేశం
దళిత ముస్లిం ఇఫ్తార్ విందు
తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 01:
రంజాన్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు కు విచ్చేసిన డాక్టర్ వై .ప్రవీణ్ సర్వమత సమానమైన మన భారతదేశంలో 1949 నాటి నుంచే ఆనవాయితీగా దళిత ముస్లిం క్రైస్తవ లు కలిసి భోజనం చేయడం అన్నదికాలంగా జరుగుతుందని తెలిపారు.
ఆదివారం సాయంత్రం 6 గంటలకు తిజీవకోన మజీద్ ఏ మహమ్మదీయ లో దళిత ముస్లిం ఇఫ్తార్ విందు కు ముఖ్య అతిథులుగా పాల్గొన్న
ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్
ఎలమంచిలి ప్రవీణ్,
భారతీయ దళిత సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు ధర శేఖర్, బీసీ కే పార్టీ జిల్లా అధ్యక్షులు బోకం రమేష్ ,ఏంజెఏసీ జాతీయ అధ్యక్షులు రఫీ హిందుస్తానీ ఈ మహమ్మద్ అలీ తిరుపతి ఈద్గా వైస్ చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హజ్రత్ మొహమ్మద్ మొహాని 1949లో మొట్టమొదట దళిత ముస్లిం ఇఫ్తార్ విందు ప్రారంభించారు ,వారినీ అనుసరిస్తూ తిరుపతిలోని జీవకోనలో మసీద్ ఏ మహమ్మదీయులో ప్రతి సంవత్సరం రంజాన్ చివరి వారంలో దళిత ముస్లింల ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ,దీని ముఖ్య ఉద్దేశం కులం మతం జాతి వివక్ష లేకుండా మానవత్వంతో ప్రతి ఒక్కరు సోదర భావంతో సమానత్వంతో మెలగాలని కులాలు కూడు పెట్టవని మతాలు మానవత్వం చూపవని కులాన్ని మతాన్ని ఏ విధంగా అయితే మనం మందిరానికి మసీదుకు వెళ్లేటప్పుడు చెప్పులు బయట వదిలేస్తామో అదేవిధంగా కులాన్ని మతాన్ని మన ఇంటి వరకు వదిలేసి సమాజంలో మనమంతా మానవత్వంతో మెలగాలని తద్వారా మన దేశ ప్రగతిని ప్రపంచ దేశాలకు చాటాలని ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం సర్వమత సమానత్వమైన భారతదేశాన్ని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా మెలగాలని దీని ముఖ్య ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమంలో మసీద్ ఏ మహమ్మదీయ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.అనంతరం తిరుపతి ముస్లిం ఈద్గా వైస్ చైర్మన్ గా ఎన్నికైన జీవకోనకు చెందిన
ఈ మహమ్మద్ అలీ ని
ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్
దళిత సాహిత్య అకాడమీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ధనశేఖర్
ఏ ఎం జేఏసీ జాతీయ అధ్యక్షులు రఫీ హిందుస్తానీ ముస్లిం సహోదరులు దుస్సాలవాతో సన్మానించడం జరిగిందని హిందుస్తానీ ఆల్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ
(ఏ,యం జే ఏసి)
జాతీయ అధ్యక్షులు రఫీ ఆ ప్రకటనలో తెలిపారు .