ఎన్టీఆర్ అవార్డు అందు కున్న గడ్డం కేశవమూర్తి

ఎన్టీఆర్ అవార్డు అందు కున్న గడ్డం కేశవమూర్తి

రాష్ట్రమంత్రి సీతక్క చేతు ల మీదుగా అవార్డు ప్రధా నం

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్ల కానిపర్తి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి మరో అత్యున్నత పురస్కారం లభించింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు,సంచలన రాజ కీయవేత్త, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ ఎన్టీ రామారావుస్మారక అవార్డు పొందారు. విజయ వాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్ర సాద్ తో పాటు గడ్డం కేశవ మూర్తికి ఈ అవార్డును ప్రధా నం చేసింది.

 

 

 

 

గురువారం రోజు ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క చేతుల మీదు గా అవార్డును అందుకున్నా రు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి శాలువాతో సత్కరించి మెమొంటోతోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ దినపత్రికల్లో జర్నలిస్టు గా పనిచేస్తున్న కేశవమూర్తి ఇప్పటి వరకు అరడజన్ పుస్తకాలను స్వయంగా రచించి ప్రచురించారు.

 

 

 

అలాగే 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సక్సెస్ స్టోరీలను రాసి జనసారథులు పేరిట పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ లలో కూడా ప్రధాన భూమిక పోషించారు. మూడేళ్లపాటు వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా విశిష్ట సేవలు అందించారు. తెలంగాణ ప్రభుత్వ విశిష్ట పురస్కారంతో పాటు జాతీయస్థాయిలో అనేక అవార్డులను కేశవమూర్తి పొందారు.

 

 

 

పేదల పెన్నిధి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అవార్డు ప్రధానంతో జర్నలిస్టు రంగానికి కేశవమూర్తి మరింత గౌరవం తీసుకువచ్చారని పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, పాత్రికేయులు వ్యాఖ్యానించారు. వరంగల్ వాయిస్ ఎడిటర్ కేశవమూర్తికి ఈ అవార్డు లభించడం పట్ల గ్రామ ప్రజలు, మండల ప్రజలు ప్రజాప్రతినిధులు, రాజకీయ వేత్తలు, అధికారులతోపాటు, జర్నలిస్టులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version