నూతన టవర్ వ్యాగన్ వాహనం ప్రారంభం
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయానికి నూతన టవర్ వ్యాగన్ వాహనం ను సుమారు 40 లక్షల పట్టణ ప్రగతి, 15వ ఫైనాన్స్ నిధులతో కొనుగోలు చేయగా బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. వాహన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. ఈ వాహనం మున్సిపాలిటీ పరిధిలోని పలు ఎలక్ట్రిసిటీ కార్యక్రమాలకు ఉపయోగపడేలా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి రఘునాథరెడ్డి రెడ్డి, ఎమ్మార్వో సతీష్ కుమార్,పుర కమిషనర్ గద్దె రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ ,మాజీ వైస్ చైర్మన్ విద్యసాగర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ,నాయకులు పాల్గొన్నారు.
