భారత అభివృద్ధికి బాటలు వేసిన ఘనుడు నెహ్రూ
పీసీసీ సభ్యులు పెండెం రామానంద్
నర్సంపేట,నేటిధాత్రి:
పంచరక్ష ప్రణాళికతో స్వాతంత్ర భారత సర్వతోముఖాభివృద్ధికి బాటలను వేసిన ఘనుడు భారత ప్రధమ ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రు అని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అన్నారు.పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ ఆయన వద్ద ఘనంగా నిర్వహించారు.విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ముందుగా పిల్లలకు జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు మాదాసి రవి, పంబి వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళీ, నర్సంపేట మాజీ సొసైటీ వైస్ చైర్మన్ పాలాయి రవికుమార్, నర్సంపేట నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు డిష్ బాబా, కిసాన్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ముత్తినేని వెంకన్న, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గద్ద జ్యోతి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్,మాజీ వార్డు సభ్యులు గండి గిరి, 9వ వార్డు అధ్యక్షులు పిన్నింటి కిరణ్ కుమార్ రెడ్డి, 20వ వార్డు అధ్యక్షులు రామగోని శ్రీనివాస్, 17వ వార్డు అధ్యక్షులు అప్పాల శ్రీకాంత్, 5వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రతన్ కుమార్, వేల్పుల కృష్ణ, నాగేల్లి సారంగం గౌడ్, గోపు వేద ప్రకాష్, పూల్గుల మాధవరెడ్డి, దేశి సాయి పటేల్, లైన్ నితిన్, చేన్నబోయిన సాయి శ్రావణ్ దాస్, కేదారి, తదితరులు పాల్గొన్నారు.
