నల్లెల్ల టు రాజోలు పి ఆర్ రోడ్డు పక్కన ప్రమాదకర వ్యవసాయ బావి కి మరమ్మతుపనులు
ప్రమాదకర బావికి ముగింపు పలికిన డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ రామచంద్రునాయక్
మరిపెడ/కూరవి నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కేంద్రంలో ని నల్లెల్ల గ్రామపంచాయతీ పరిధిలోని గజా తండ,నల్లెల నుంచి రాజోలు వెళ్ళే రోడ్డులోని బానోతు ఈర్య నాయక్ వ్యవసాయ బావి వద్ద ఉన్న ప్రమాదకర బావి ప్రాంతం గురించి స్థానిక ఎమ్మెల్యేకు ప్రమాదకర బావి గురించి వివరించడం జరిగింది, సానుకులంగా స్పందించిన ఎమ్మెల్యే తండా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు చివరకు మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు,ఇటీవల డోర్నకల్ పర్యటన లో భాగంగా బావి ని చూసి ప్రమాదకరంగా ఉంది అని గమనించిన ఎమ్మెల్యే,తండ ప్రజల కు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే అధికారులను ఆదేశించి రోడ్డు మార్గాన్ని సురక్షితంగా మార్చేలా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ నుండి 10 లక్షల వ్యయం తో పనులు మంజూరు చేయించారు,ఈ సందర్భంగా కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్ బావి మరమ్మత్తు పనులు కు శంకుస్థాపన చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు పై వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అని మంచి మనసు తో స్పందించిన ఎమ్మెల్యేకు గాజతండ ప్రజలు నల్లల్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు, ఈకార్యక్రమంలో గాజ తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు వాసు నాయక్, చిరంజీవి, శివలాల్,చందులాల్, భద్ర తేజావత్,ఈర్యా,మంగీలాల్, శ్రీను,రవికుమార్,ధర్మ సోత్, ధర్మ నాయక్,కాంట్రాక్టర్ ఆంగోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.