మున్సిపాలిటీ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలి
మున్సిపాలిటీ కమిషనర్ కు వినతి పత్రం
10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట విలీన గ్రామాల కార్మికులను మున్సిపాలిటీ కార్మికులుగా గుర్తించి, మున్సిపాలిటీ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలతో పాటు చెల్లించాలని 10 వార్డ్ కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ అన్నారు.విలీన గ్రామాల కార్మికులతో కలిసి మున్సిపల్ కమిషనర్ గురువారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 2025 ఫిబ్రవరి 6 తేదీన 8 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుండి నర్సంపేట మున్సిపాలిటీ విలీనమైన 8 గ్రామల కార్మికులు 36 మంది గత సంవత్సర కాలంగా నర్సంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు, విలీనం చేసిన 8 గ్రామల కార్మికులకు మున్సిపాలిటీ కార్మికులకు చెల్లిస్తున్న 16,600 వేతనాన్ని చెల్లించపోవడం దారుణమని అన్నారు.గత సంవత్సరకాలంగా చేస్తున్నది మున్సిపాలిటీ పని అయినప్పటికీ మున్సిపాలిటీ కార్మికులగా గుర్తించకుండా పంచాయతీ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలు చెల్లించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను పరిష్కరించాలని 36 మంది కార్మికులు అనేకసార్లు మున్సిపల్ కమిషనర్ కు విన్నవించిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వివరించడం సరికాదన్నారు.కొంతమంది మున్సిపాలిటీ అధికారులు మీకు జీతాలు పెంచే ప్రయత్నం చేస్తానని కార్మికుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడడం సిగ్గుమాలిన చర్యఅని ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా విలీన గ్రామాల కార్మికులను మున్సిపాలిటీ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు 16600 జీతాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీ కార్మికుల సౌకర్యాలు అమలు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్మికులు ఎండీ యాకుబ్, నర్రా కృష్ణ,కొర్ర వీరన్న,నల్ల మహేందర్, ముత్తినేని రమేష్,పోలబోయిన శ్రీను,బొల్ల పరాశరములు,కల్వచర్ల రమణాచారి, జెట్టబోయిన మల్లయ్య కుమ్మరి రాజు తదితరులు పాల్గొన్నారు.
