జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా చేయాలి
కులాలుగా చైతన్యం కావాలి – సమూహంగా ఏకం కావాలి
ఎమ్మార్పీఎస్ ఉద్యమం అట్టడుగు వర్గాలకు కేంద్రబిందువు
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు-బెజ్జంకి అనిల్ మాదిగ
గంగాధర, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ మొదలుపెట్టిన ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రభావం అన్ని అణగారిన కులాల్లో సామాజిక చైతన్యానికి రగిలించిందని అన్నారు. ప్రతి కులం తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి సంఘాల ఏర్పాటు చేసుకొని పోరాట బాటలోకి వచ్చాయని అన్నారు.
వారికి కావాల్సినంత ప్రోత్సాహాన్ని సహకారాన్ని మంద కృష్ణ మాదిగ అందించారు. అందువల్ల ఎమ్మార్పీఎస్ ఉద్యమం కేవలం మాదిగల ప్రయోజనాల వరకే పరిమితం కాకుండా అన్ని అణగారిన కులాల సంక్షేమం కోసం కృషి చేసిందని అన్నారు. అందులో బాగానే ఆరోగ్యశ్రీ, ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం పెంపు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, మహిళల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలైనవి ఎమ్మార్పీఎస్ పోరాడి సాధించిందని అన్నారు.
ఈఫలితాలన్ని వర్గాలు పొందుతున్నారని అన్నారు. అందువల్ల సమస్త అణగారిన కులాలకు కేంద్ర బిందువుగా ఎమ్మార్పీఎస్ నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అణగారిన కులాలన్ని ఏకులానికి ఆకులం చైతనమై మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో మహజనులుగా ఏకమై తెలంగాణ రాజకీయల్లో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదిశగా అన్ని కులాలు ఆలోచించాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం విజయం సాధించిన నేపథ్యంలో జూలై 7న జరుగు ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అన్ని గ్రామాల్లో అన్ని కులాల సమక్షంలో పెద్ద ఎత్తున జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో కొమ్ము శేఖర్ మాదిగ, ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముద్దం నాగేష్, మాజీ ఎంపిటిసి కర్ర బాపురెడ్డి, మాజీ మండల్ పరిషత్ ఉపాధ్యక్షులు సముద్రాల అంజయ్య మాదిగ, కేడిసిసి మాజీ జిల్లా డైరెకట్టర్, దోమకొండ శ్రీనివాస్ మాదిగ, సముద్రాల శివరామకృష్ణ మాదిగ, దోమకొండ నరేష్ మాదిగ, దోమకొండ గోపి మాదిగ, బొడ్డు రాజేందర్ మాదిగ, పర్లపెల్లి అంజయ్య మాదిగ, లంకదాసరి రాజు మాదిగ, దోమకొండ సుధాకర్ మాదిగ, లంకదాసరి మొండయ్య మాదిగ, లంకదాసరి చెంద్రయ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు.