నూతన హోటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్లోని హుగెల్లి వై-జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటైన స్టార్ నసీబ్ హోటల్ను ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించి వారి మన్ననలను పొందాలని, వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.