ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం కేంద్రంలో భక్తుల ఆధ్యాత్మిక ఆకాంక్షలను నెరవేర్చే దిశగా శ్రీ శివ రామాంజనేయ స్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆలయ నిర్మాణం గ్రామ ప్రజల ఐక్యతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఆలయానికి 30 లక్షల రూపాయల నిధులు మంజూరి చేయిస్తానని హమీ ఇచ్చారు.దేవాలయ అభివృద్ధికి తాము సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
