బెగుళూరు గ్రామంలో భవనాలకు ఎంజీఎన్ఆర్జిఇఎస్ నిధుల భూమి పూజ

ఎంజీఎన్ఆర్జిఈఎస్ నిధులతో పలు భవనాల భూమి పూజ
* నిధులను సాంక్షన్ చేయించిన మంత్రివర్యులు
* ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గ్రామ ప్రజలు

మహాదేవపూర్ అక్టోబర్16 నేటి ధాత్రి *

Vaibhavalaxmi Shopping Mall

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగుళూరు గ్రామపంచాయతీలో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో ఎంజిఎన్ఆర్జిఇఎస్ నిధులతో గురువారం రోజున పలు భవనాలకు భూమి పూజ నిర్వహించారు. గ్రామపంచాయతీ అభివృద్ధిలో భాగంగా ఐటి భారీ పరిశ్రమల శాఖ మరియు శాసనసభ వ్యవహార శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు చొరవ తీసుకొని గ్రామపంచాయతీ భవనముకు 20 లక్షల రూపాయలు మరియు అంగన్వాడి రెండు భవనాల నిర్మాణానికి 16 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులను బదిలీ చేయడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రమోద్ మరియు పలువురు అధికారుల సమక్షంలో ఈరోజు ముగ్గుపోసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ బెగుళూరు గ్రామానికి 20 లక్షలునిధులు సాంక్షన్ చేసినందుకు ఐటి మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ ఆకుల సమ్మక్క మాజీ ఎంపిటిసి చల్ల పద్మ ఓదెలు పంచాయతీరాజ్ ఏఈ సతీష్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంమ్మూర్తి అంగన్వాడీ టీచర్లు సుజాత సరస్వతి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ ములకల పోచమ్మలు ఆకుల రాజయ్య బుర్రి శివరాజ్ కాంట్రాక్టర్ పోటు మల్లారెడ్డి అంకిరెడ్డి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version