శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరుశతాబ్దాలు చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం వేద మంత్రో చ్ఛారణల మధ్య ఘనంగా ప్రారంభం అయింది.ఈరోజు అంకురారోహణము విశ్వక్సేన ఆరాధన రక్షాబంధన పూజ యాగ్నీకులు వీరవెల్లి వేణుగోపాలాచార్యులు అర్చ కులు ఆరుట్ల కృష్ణమాచారి పూజ హోమం నిర్వహించి నారు అనంతరం ద్వజారోహం గరుడ పటం ఎగరవేసినారు తర్వాత గరుడ ముద్ర ప్రసాదాలు సంతానం లేని దంపతులకు భక్తులకు పంపిణీ చేసినారు ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల బిక్షపతి గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్సేనారెడ్డి కృపాకర్ రెడ్డి దిడ్డి రమేష్ గన్ను వేణుగోపాల్ కాoబత్తులప్రకాష్ అనుకారి అశోక్ గొట్టిముక్కుల చంద్రప్రకాష్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.