స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి
మానె రామకృష్ణ భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇంచార్జ్
నేటిధాత్రి:
చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల గ్రామ కమిటీ సమావేశాల్లో బాగంగా నిన్న రాత్రి కుదునూరు గ్రామంలో మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అయినవోలు పవన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేసారు ఈ గ్రామ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా భద్రాచలం డివిజన్ పార్టీ సీనియర్ నాయకులు మానె రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అవుతున్న ఇంతవరకు మహిళలకు తులం బంగారం ఇవ్వలేదు మహిళలకు 2500 ఇవ్వలేదు మహిళలకు స్కూటీలు ఇవ్వలేదు గ్యాస్ ఇవ్వలేదు పెన్షన్లు 4000 ఇవ్వలేదు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వీర కోదండ రామయ్య డివిజన్ యూత్ నాయకులు కాకి అనిల్ మండల యూత్ అద్యక్షులు అంబోజీ సతీష్ పార్టీ సీనియర్ నాయకులు నేతాని రాము అయినవోలు జగదీష్ పంజా రాజు తడికల బుల్లేబ్బాయి ఎడ్ల రాందాస్ కుంజా చంటి కుంజా కమల సిద్ధి సంతోష్ విజయ్ మేడి నరసింహారావు మరియు బిఆర్ఎస్ సైనికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు