ఉగాది వేడుకలను విజయవంతం చేయాలి…

ఉగాది వేడుకలను విజయవంతం చేయాలి

ఉగాది ఉత్సవ కమిటీ సభ్యులు

భూపాలపల్లి నేటిధాత్రి

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 19న జరిగే వేడుకలను విజయవంతం చేయాలని ఉగాది ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు కొలుగూరి సంజీవరావు,ఎర్రం సతీష్ కుమార్, కాశెట్టి శ్రీనివాస్ లు కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ….
శ్రీ వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో
తెలుగుదనం ఉట్టిపడేలా ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కూడా రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారాలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ ఇల్లందు క్లబ్ లో జరిగే వేడుకలలో వేద పండితులచే పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
వచ్చిన కళాకారులకు, కవులకు, రచయితలకు నృత్య కళాకారులకు శాలువా, మెమొంటో, ప్రశంస పత్రాలతో సత్కరించడం జరుగుతుందన్నారు.
భూపాలపల్లి మున్సిపల్ పాలకవర్గానికి సన్మానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు హాజరవుతున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని కవులు కళాకారులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉగాది ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు గుజ్జ సారేశ్వర్ రావు, ములకల లక్ష్మారెడ్డి,మంద జోవర్ధన్,ఆకుతోట ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version