వేములవాడ నేటి ధాత్రి
వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహించనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అన్నమనేని సుధాకర్ రావు విజ్ఞప్తి చేశారు. వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో వాకర్స్ క్లబ్ సభ్యులను వారు గురు వారం కలిశారు. ఈ నెల 5వ తేదీన కరీంనగర్ లో అన్నమనేని గార్డెన్లో వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ కోఆర్డినేటర్ అన్నమనేని సుధాకరరావు ఆద్యక్షతన సమావేశంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిలుగా వరంగల్ ఏరియా గవర్నర్ చింతo సారంగపాణి, తడక కుమార్ స్వామి ,రీజినల్ కౌన్సిలర్ ,దేశిని లక్ష్మినారాయణ చీఫ్ కోఆర్డినేటర్, సమావేశంలో డిప్యూటీ గవర్నర్ బుర్ర జగదీశ్వర్ గౌడ్ ,డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నాతోపాటు పలువురు పాల్గొనున్నట్లు తెలిపారు. వేములవాడ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రేగుల రాము, సభ్యులు రేగుల మల్లికార్జున్, గోస్కుల రవి, లాయక్ పాషా, ముప్పిడి శ్రీనివాస్, కొక్కుల శ్రీనివాస్, వెగ్గలం రఘు,కూర అంజన్న,దాసు, మాట్లాడుతూ కుల, మతాలకతీతంగా, రాజకీయాల కతీతంగా ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను స్వాగతిస్తూ, అభినందించారు.