వేములవాడ, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావును గురువారం వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామనికి చెందిన ఎస్సి(మాల) సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా గ్రామంలో కుల సంఘం భవన నిర్మాణ పనులు నిధుల కొరతతో నిలిచిపోయిందని, భవన నిర్మాణం పూర్తి అయ్యేందుకు సహకరించాలని చల్మెడను కోరారు. స్పందించిన చల్మెడ మాట్లాడుతూ గతంలో మంజూరైన నిధులతో భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని, తాను గెలిచిన వెంటనే మిగతా నిధులు మంజూరు అయ్యేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మ్యాకల రవి, వైస్ ఎంపీపీ ఆర్.సి రావు, సెస్ డైరెక్టర్ హరి చరణ్ రావు, నాయకులు బూర బాబు తదితరులు పాల్గొన్నారు.