చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు, బిళ్ల నరేష్ తో పాటు సుమారు 50మంది యువకులు బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. గురువారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, సర్పంచ్ మ్యాకల పర్శరాములు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి పర్శరాముల ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి లక్ష్మీ నరసింహా రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తు గెలుపే లక్ష్యంగా నూతనంగా పార్టీలో చేరిన వారు పని చేయాలని చల్మెడ సూచించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి మారుపాక సతీష్, యువజన విభాగం గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రశాంత్, గొంటి మనోజ్, అమరబండ జెలెందర్, పెద్దిగారి మహేష్, చక్రాల జెలేందర్, మనోజ్, ప్రశాంత్, రమేష్, గడ్డం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
