‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల సునామీ
‘మహావతార్ నరసింహ’ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వరుసగా సెలవులు రావడంతో జనం సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. నిన్నటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ Xలో తెలిపింది. ‘మహావతార్ నరసింహ’ చరిత్ర తిరగరాస్తోందని, గర్జన అన్స్టాపబుల్ అని పేర్కొంది. కాగా దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది.