పోగొట్టుకున్న మొబైల్ బాధితునికి అందజేత.

పోగొట్టుకున్న మొబైల్ బాధితునికి అందజేత

-బాధితునికి మొబైల్ ఫోన్ ను అందజేసిన ఎస్పై దీకొండ రమేష్..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

 

 

 

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ అనే వ్యక్తి మొబైల్ పోగొట్టుకున్నాడు సెంట్రల్ ఎక్యుప్ మెంట్ ఐడెంటిటి రిజిస్టర్ పోర్టల్ (సి ఈ ఐ ఆర్) ద్వారా రికవరి చేసి మొబైల్ ఫోన్ ను బాధితులకు అప్పగించిన ఎస్ ఐ దీకొండ రమేశ్ | పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ మొబైల్ ఫోన్ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ను, సంబంధిత మొబైల్ ఫోన్ల ఐ ఎం ఈ ఐ నెంబర్ల ద్వారా ఆతని వివరాలు తెలుసుకొని ఆతని నుండి మొబైల్ ను పోత్కపల్లి ఎస్ఐ రికవరీ చేశారు. మొబైల్ ను ఎస్ఐ పోలీసు స్టేషన్ నందు బాధితునికి అప్పగించారు. మొబైల్ విలువ సుమారు రూ.28,000/- ఉండును. ఈ సందర్భంగా పోత్కపల్లి ఎస్ ఐ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తమ మొబైల్ పోగొట్టుకున్నట్లయితే వారు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా నెంబర్ ను వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ లను పట్టుకోవడం జరుగుతుందని, కావున ప్రజలు ఈ సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version