డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
అంతర్జాతీయ మాదకద్రవ్యా దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో విద్యార్థులచే స్కిట్ (నాటిక ) ప్లకార్డ్స్ లను ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత పోకడ చూస్తుంటే జీవితమంటేనే మత్తు. మత్తులోనే వుంది గమ్మత్తు అనుకుంటున్నారు. నిజానికి జీవితమంటే మత్తు కాదు. జీవితాన్ని చిత్తు, చిత్తుగా ఓడించేది మత్తు అనే నిజాన్ని తెలుసుకోవాలి నేటి యువత. ఈ విధంగా యువతరాన్ని దారి మల్లించి చెడు మార్గంలో నడిపిస్తున్న దురాలవాట్లలో గంజాయి, హెరాయిన్, కొకైను, మార్ఫిన్, ఆల్కహాల్ వంటి మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనదని తెలిపారు.డ్రగ్స్ వాడినట్టు, అమ్మినట్టు తెలిస్తే మన రాష్ట్రం లో కొత్తగా అమల్లోకి వచ్చిన ఎమర్జెన్సీ నెంబర్ 112 కు తెలిపినట్లైతే తగు చర్యలు తీసుకొంటారని విద్యార్థులకు సూచించారు. చివరగా విద్యార్థులచే డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మదా, జ్యోష్ణ, రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.