మంజూరు పట్ల సింగిల్ విండో వ్యవస్థకు శ్రీకారం.

హెచ్ టి సర్వీసుల మంజూరు పట్ల సింగిల్ విండో వ్యవస్థకు శ్రీకారం.

వరంగల్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.గౌతమ్ రెడ్డి

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

 

 

విని5యోగదారుల హెచ్ టి. 11 కెవి , 33 కెవి ఆపై వోల్టేజి సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టామని వరంగల్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.గౌతమ్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ టి. 11 కెవి,33 కెవి, ఆపై వోల్టేజి సర్వీసుల మంజూరుకు మరింత సరళీకృతం చేయడానికి హెచ్ టి మానిటర్ సెల్ ను సర్కిల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఇందులో భాగంగా 11 కెవి వోల్టేజి దరఖాస్తులను సర్కిల్ ఆఫీస్ ఏ.డి. ఈ కమర్షియల్ అధికారి మానిటర్ చేస్తారని,అలాగే 33 కెవి వోల్టేజి, ఆపై వోల్టేజి దరఖాస్తులను ఏ.డి. ఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి మానిటర్ చేస్తారన్నారు.ఈ సింగిల్ విండో కొత్త విధానం వలన మొదట వినియోగదారులు టీజీఎంపీటీసీఎల్ పోర్టల్‌లో అవసరమైన పత్రాలతో హెచ్డి దరఖాస్తులు(టీ.జీ ఐపాస్ లో నమోదు కానటువంటివి)నమోదు చేసుకున్న తర్వాత కొత్త అప్లికేషన్ నంబర్ (యుఐడి) ఉత్పన్నమవుతుందని అలా వచ్చిన కొత్త దరఖాస్తులు టీజీఎంపీటీసీఎల్ యొక్క సంబంధిత సర్కిల్‌లలో డాష్ బోర్డులో కనిపిస్తుందన్నారు. ప్రతిరోజూ ఏడిఈ/కమర్షియల్‌లు అధికారులు డాష్ బోర్డుని మానిటర్ చేస్తుంటారని పేర్కొన్నారు.దరఖాస్తు నమోదు చేసుకున్న తర్వాత 11కెవి,33 కెవి ఆ పై వోల్టేజి దరఖాస్తులు సంబంధిత అధికారులకు ఎస్టిమేట్ల కొరకు పంపించబడుతుందని ఎడిఈ/కమర్షియల్ సర్కిల్ ఆఫీస్ ఫీల్డ్ స్టాఫ్ ఫీజిబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం లొకేషన్‌ను సందర్శిస్తారని చెప్పారు.33 కెవి, ఆపై వోల్టేజి ఎస్టిమేట్లను కార్పొరేట్ ఆఫీస్ అధికారులు అనుమతులు ఇస్తారని
ఇక 33 కే.వి ఆ పై వోల్టేజి దరఖాస్తులు ఐతే,ఆన్‌లైన్‌లో సంబంధిత సిఈ/కమర్షియల్ మరియు ఆర్ఎసి/టీజీ డిఆర్ఏఎన్ఎస్ సీఈవో కు ఫీజిబిలిటీ కోసం పంపించబడుతుందని తెలియజేశారు.
11కెవి వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి ఫీజిబిలిటీ ఉంటె రెండు రోజుల్లో అప్‌లోడ్ చేయబడుతుందని వివిధ కారణాల వల్ల సాధ్యపడకపోతే, 2 రోజులలోపు రిమార్క్‌లు వినియోగదారునికి ఎస్ఎంఎస్ రూపేణా పంపబడుతుందని పేర్కొన్నారు.అలాగే 33 కెవి, ఆపై వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి వాటికీ కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు పొందుపరచిన సమయానుగుణంగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
సింగిల్ విండో వ్యవస్థ వలన త్వరితగతిన సర్వీసులు మంజూరు అవుతాయని,ప్రతి సారి ఆఫీసులకు రాకుండా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉందని అన్నారు.దీని వలన అత్యంత పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారులు దరఖాస్తుల స్థితి గతులను ఎప్పటి కప్పుడు సెల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ రూపేణా సమాచారం పంపబడుతుందని సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.గౌతమ్ రెడ్డి వివరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version