ఝరాసంగం నూతన ఎస్సైగా క్రాంతి కుమార్ పటేల్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల నూతన ఎస్సైగా క్రాంతి కుమార్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఉన్న ఎస్ఐ నరేష్ కొహీర్ మండలానికి బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా నూతన ఎస్పై మాట్లాడుతూ.ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను సమన్వయం చేస్తూ సమస్యలు పరిష్కరిస్తూ, మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని అన్నారు.మండల ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్య కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలియజేశారు.