భూపాలపల్లిలో జర్నలిస్టుల నిరసన
భూపాలపల్లి నేటిధాత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంపై వరుస కథనాలు సాక్షి మీడియా,పేపర్లో ప్రసారం చేసినందుకు
సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి పై విచారణ పేరుతో గత మూడు రోజులుగా పోలీసులు వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ ప్రెస్ క్లబ్, జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు జర్నలిస్టులు.
అక్రమంగా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ ను హరించే హక్కు ఎవరికీ లేదని, ధనుంజయ రెడ్డి పై పోలీసుల విచారణ నిలిపివేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులు. పాల్గొన్నారు
