మోడీ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 26న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి..

అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై ప్రకాష్.

కారేపల్లి నేటి ధాత్రి

సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కారేపల్లి మండలం పేరుపెల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం వై ప్రకాష్ మాట్లాడుతూ బిజెపి మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కార్మికుల నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాదిమంది రైతుల కార్మికులతో 13 నెలల పాటు సాగిన వీరోచిత ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో 800 మంది అమరులైన ఉద్యమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్యమానికి దేశ ప్రజలకు క్షమార్పణలు చెప్పి రైతులకు కార్మికులకు నష్టదాయకమైన చట్టాలను రద్దు చేస్తానని ఎం ఎస్ పి పంటల గిట్టుబాటు ధర చట్టం అమలు చేస్తానని పార్లమెంట్ సాక్షిగా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి వాటిని రద్దు చేయకుండా దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి తిరిగి అట్టి చట్టాలను మరల దొడ్డి దారిన ప్రవేశపెట్టి అమలకు పూనుకున్నాడని ఎన్నో త్యాగాలతో సాధించుకున్న రైతు కార్మిక చట్టాలను రద్దు చేస్తూ దేశంలో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ పరిశ్రమలను భూములను బహుళ జాతి కంపెనీలకు బడ పారిశ్రామికవేత్తలకు తాకట్టు పెట్టినాడని దీని మూలంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర సంక్షోభానికి గురి అయ్యి బజారున పడి పరిస్థితికి వచ్చిందని సాధించుకున్న హక్కులను చట్టాలను కాపాడుకొనుటకై అన్ని వర్గాల ప్రజలు ఐక్యమై ఉద్యమించాలని అందులో భాగంగా ఎస్ కే యం ఆధ్వర్యంలో ఈనెల 26న ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగే నిరసన ధర్నా కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ మండల నాయకులు అలెం గురవయ్య చంద్రయ్య బైరుమల లక్ష్మయ్య వై జానకి సుగుణ కోటక్క మంగమ్మ నాగేశ్వరరావు కోటయ్య సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version